Thursday, 20 April 2023

థనమున్నాసుఖములేదు

 *మైక్రో సాఫ్టు అధినేత సత్యానాదెళ్ళ గారు వేల కోట్లు సంపాదించారు. కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉండి వీల్ ఛైర్ కు మాత్రమే పరిమిత మైన కొడుకు ఉండేవాడు.అతను దాదాపు 25సంవత్సరాలపాటు అలాగే జీవించి ఇటీవలే మరణించాడు.మరి వారికి వచ్చి న ఈ దురదృష్టం ఎందరికి తెలుసు?*


*అలాగే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు వేలకోట్లు సంపాదించారు.వారికి మానసిక వికలాంగుడైన కొడుకు ఉండేవాడు.అతనికి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశాడు. కానీ అది కూడా ఫలించలేదు.*


*మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కూడా వందల కోట్ల ధనము సంపాదించాడు. అయినా గానీ వారి‌మొదటి భార్య చనిపోతే ప్రేమ తో పట్టెడు అన్నం పెట్టే వాళ్లు లేరు. అలాగని రెండో పెళ్ళి చేసుకుంటే కుటుంబ కలహాలతో పదవీ చ్యుతుడై మనస్తాపం తో చనిపోయాడు.*


*రేమండ్సు అధినేత విశ్వపతి సింఘానియా తన స్వశక్తితో రేమండ్సు కంపెనీ ని బాగా అభివృద్ధి చేశాడు వేలకోట్ల ఆస్తులను తన పుత్ర రత్నానికి బహుమతి గా ఇచ్చాడు. ఇంత చేస్తే ఆ పుత్రుడే వారిని తమ ఇంటి నుంచి బయటకు గెంటేశాడంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. ?*


*మనము ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. మనము ధర్మ మార్గం లో జీవిస్తూ ఉండటం ముఖ్యం. మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మంచి సంస్కారం అందించాలి. ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చి న డబ్బు ను ఆస్తులను ఒక ధర్మ కర్త వలె ఖర్చు పెట్టాలి.అప్పుడే ఆ డబ్బు సుఖమును తృప్తి ని ఇస్తుంది. ఇలా తృప్తి సుఖము ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎంత సంపాదించాము అనేది ముఖ్యము కాదు.*


*ఇలా ఎంతో మంది ధనికులు చాలా బాధలు పడ్డారు.*


*డబ్బు తనతో పాటు కొంత చెడును కూడా తీసుకుని వస్తుంది. డబ్బు ఉంటే అహంకారం వస్తుంది. ఆ అహంకారమే అన్ని అనర్థాలకు మూలకారణం అవుతుంది.*


*ఇలా ప్రతివారికీ ఏవో దురదృష్టం కూడా ఉంటుంది. కావున ఇతరుల ఆస్తులను గూర్చి అసూయ పడ కూడదు.*


*ఎంత చెట్టు కు అంత గాలి ఉంటుంది. ఈ విషయం మరచిపోకూడదు.*


*మనకు ఉన్న దానితో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి.*


*మనకు మంచి ఆకలి వేస్తూ ఉండటం, ఆకలివేసినపుడు‌మంచి భోజనం, మంచి నిద్ర, ఒక ఇల్లు, సంఘంలో గౌరవ ప్రదమైన జీవితం జీవిస్తూ ఉంటే మనము చాలా ధనవంతులము, అదృష్ట వంతులము కూడా. దానికి తోడు ప్రశాంతమైన,ధర్మ మార్గం లో జీవనం. ఇవి ఉంటే అన్నీ ఉన్నట్లే.*


*ఎవరికీ ఎప్పుడూ సుఖాలు ఉండవు. సుఖపడినవారు కష్టాలు పడతారు. కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది. కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. ఈ అవకాశం చాలా మంది ధనవంతులకు లేదు గదా.*


*ఏ కష్టాలు లేని వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రాగలరా? ప్రయత్నించి చూడండి.*


*ఇలా అసూయ పడతారనే శేషప్ప కవిగారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు.*


*తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు*


*వెళ్ళి పోయెడినాడు వెంటరాదు*


*లక్షాధికారైన లవణమన్నమె గాని*


*మెండుబంగారంబు మింగబోడు.*


*ఏ వస్తువు అయినా తాత్కాలికంగా సుఖమును ఆనందమును ఇస్తుంది. సుదీర్ఘ కాలములో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది. కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి. ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అదికూడా అశాంతికి దారితీస్తుంది.*


*మన కోరిక లే అన్ని దుఃఖాలకు మూలకారణం అని బుధ్ధుడు ఎప్పుడో చెప్పాడు. తక్కువ కోరిక లతో తృప్తిగా హాయిగా సమాజం లో గౌరవప్రదంగా జీవించడం చాలా అదృష్టం.*

" సర్వే జనా సుఖినో భవన్తు"*మైక్రో సాఫ్టు అధినేత సత్యానాదెళ్ళ గారు వేల కోట్లు సంపాదించారు. కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉండి వీల్ ఛైర్ కు మాత్రమే పరిమిత మైన కొడుకు ఉండేవాడు.అతను దాదాపు 25సంవత్సరాలపాటు అలాగే జీవించి ఇటీవలే మరణించాడు.మరి వారికి వచ్చి న ఈ దురదృష్టం ఎందరికి తెలుసు?*


*అలాగే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు వేలకోట్లు సంపాదించారు.వారికి మానసిక వికలాంగుడైన కొడుకు ఉండేవాడు.అతనికి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశాడు. కానీ అది కూడా ఫలించలేదు.*


*మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కూడా వందల కోట్ల ధనము సంపాదించాడు. అయినా గానీ వారి‌మొదటి భార్య చనిపోతే ప్రేమ తో పట్టెడు అన్నం పెట్టే వాళ్లు లేరు. అలాగని రెండో పెళ్ళి చేసుకుంటే కుటుంబ కలహాలతో పదవీ చ్యుతుడై మనస్తాపం తో చనిపోయాడు.*


*రేమండ్సు అధినేత విశ్వపతి సింఘానియా తన స్వశక్తితో రేమండ్సు కంపెనీ ని బాగా అభివృద్ధి చేశాడు వేలకోట్ల ఆస్తులను తన పుత్ర రత్నానికి బహుమతి గా ఇచ్చాడు. ఇంత చేస్తే ఆ పుత్రుడే వారిని తమ ఇంటి నుంచి బయటకు గెంటేశాడంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. ?*


*మనము ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. మనము ధర్మ మార్గం లో జీవిస్తూ ఉండటం ముఖ్యం. మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మంచి సంస్కారం అందించాలి. ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చి న డబ్బు ను ఆస్తులను ఒక ధర్మ కర్త వలె ఖర్చు పెట్టాలి.అప్పుడే ఆ డబ్బు సుఖమును తృప్తి ని ఇస్తుంది. ఇలా తృప్తి సుఖము ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎంత సంపాదించాము అనేది ముఖ్యము కాదు.*


*ఇలా ఎంతో మంది ధనికులు చాలా బాధలు పడ్డారు.*


*డబ్బు తనతో పాటు కొంత చెడును కూడా తీసుకుని వస్తుంది. డబ్బు ఉంటే అహంకారం వస్తుంది. ఆ అహంకారమే అన్ని అనర్థాలకు మూలకారణం అవుతుంది.*


*ఇలా ప్రతివారికీ ఏవో దురదృష్టం కూడా ఉంటుంది. కావున ఇతరుల ఆస్తులను గూర్చి అసూయ పడ కూడదు.*


*ఎంత చెట్టు కు అంత గాలి ఉంటుంది. ఈ విషయం మరచిపోకూడదు.*


*మనకు ఉన్న దానితో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి.*


*మనకు మంచి ఆకలి వేస్తూ ఉండటం, ఆకలివేసినపుడు‌మంచి భోజనం, మంచి నిద్ర, ఒక ఇల్లు, సంఘంలో గౌరవ ప్రదమైన జీవితం జీవిస్తూ ఉంటే మనము చాలా ధనవంతులము, అదృష్ట వంతులము కూడా. దానికి తోడు ప్రశాంతమైన,ధర్మ మార్గం లో జీవనం. ఇవి ఉంటే అన్నీ ఉన్నట్లే.*


*ఎవరికీ ఎప్పుడూ సుఖాలు ఉండవు. సుఖపడినవారు కష్టాలు పడతారు. కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది. కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. ఈ అవకాశం చాలా మంది ధనవంతులకు లేదు గదా.*


*ఏ కష్టాలు లేని వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రాగలరా? ప్రయత్నించి చూడండి.*


*ఇలా అసూయ పడతారనే శేషప్ప కవిగారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు.*


*తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు*


*వెళ్ళి పోయెడినాడు వెంటరాదు*


*లక్షాధికారైన లవణమన్నమె గాని*


*మెండుబంగారంబు మింగబోడు.*


*ఏ వస్తువు అయినా తాత్కాలికంగా సుఖమును ఆనందమును ఇస్తుంది. సుదీర్ఘ కాలములో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది. కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి. ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అదికూడా అశాంతికి దారితీస్తుంది.*


*మన కోరిక లే అన్ని దుఃఖాలకు మూలకారణం అని బుధ్ధుడు ఎప్పుడో చెప్పాడు. తక్కువ కోరిక లతో తృప్తిగా హాయిగా సమాజం లో గౌరవప్రదంగా జీవించడం చాలా అదృష్టం.*

" సర్వే జనా సుఖినో భవన్తు"1601.     2-1.  210423-1.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀474..830

నేటి…

             *ఆచార్య సద్బోధన:*

                ➖➖➖✍️



*తాము లోకంలోకి వచ్చిన తర్వాత తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే లోకంలో ఏ విశేషమూ, ఏ అంశమూ తమకు సంబంధించినది కాదు అని.* 


*వెళ్ళేటప్పుడు ఏ లోక సంబంధమైన అంశాన్నీ తీసుకు వెళ్ళలేము అని.*


*కాని లోకంలో ఉన్నంతసేపు తాము ఉపయోగించుకున్న ఈ ప్రకృతి తమదే అని వ్యక్తి భావన చేస్తున్నాడు. దానిపై అభిమానాన్ని పెంచుకుంటున్నాడు.*


*దాచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అధికంగా అనుభవించాలని వేరు వేరు యంత్రాలను తయారు చేసుకుని ఈ ప్రకృతిని ఇబ్బంది పెడుతున్నాడు.*


*ఈ ప్రపంచం తాము వినియోగించుకుని వదిలి పెట్టి వెళ్ళిపోయే అద్దె ఇంటి వంటిదని భావించిన వానికి ఇబ్బందులు ఉండనే ఉండవు. కాని ఈ రకమైన ఆలోచనా పరిధికి అందరూ దూరంగానే ఉంటారు.


                    


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*

            

Friday, 14 April 2023

మంచి _చెడు

                                         మంచి -చెడు 

ఇతర జీవులకంటే మానవ జీవితం విలక్షణమైనది.అందుచేతనే మానవునకు భావవ్యక్తీకరణ,ఆలోచనలతో బాటు కష్టసుఖాలు,మంచి చెడులు మున్నగునవి ఉంటాయి.

మంచి చెడు :-నేడు ఈ ప్రపంచాన చేదుకున్న విలువ మంచికి లేకపోవచ్చు.కానీ మంచివారికి ఉన్న విలువ మాత్రం చెడ్డవారికి ఉండదు.తన మిత్రుడు దొంగ ఐనా కూడా తప్పురా అని చెప్పలేకపోవచ్చు.,అలా అని తన ఇంట్లో కూర్చుo డబెట్టుకొని బంధుత్వం కలుపుకొనునా !లేదు కదా.ఎన్ని జరిగినా చివరికి ప్రపంచం మంచి వైపే నిలబడుతుంది.మంచినే అంగీకరిస్తుంది .కాన మంచినే ఎల్లప్పుడు  మంచినే చెయ్యాలి.మంచినే ఆశ్రయించాలి .భగవంతుడు చూపే మార్గం కూడా మంచివైపే.కాన చెడును చూడకు.మంచిని వీడకు.ఏనాటికైనా నీకు రావాల్సింది దక్కాలంటే అది మంచి మార్గంలోనే అని మఱువకూడదు.

కష్టసుఖాలు :-కష్టసుఖాలు కావడికుండలు --ఇవి కాలాలువంటివి.నువ్వు వద్దనుకున్నా సరే నీ కర్మ ప్రకారం వచ్చి అవి ఉండక్లిగినంతకాలం ఉంది వెళ్ళిపోతాయి .దానిని నువ్వు అడ్డుకోలేవు .ఆపనూలేవు.ఏదైనా చేయగ ల్గావంటేఒక్కటే!వచ్చిపోయే ఈ కష్టనష్టాలు గురించి పట్టించుకోకుండా పరమాత్మను గట్టిగా పట్టుకో .ఇవి ఒకదానివెంట ఒకటి క్రమక్రమంగా వచ్చిపోతుంటాయి.నీవి చేయవలసినది ఏమనగా చేయాల్సినపనులను దోషము లేకుండా చేసుకో .నిన్ను ఏ కర్మ ఫలం కూడా ఏమీ చేయలేదు.

Tuesday, 11 April 2023

మూడు మూడు మూడు

మూడు మూడుమూడు 

మన జీవితంలో క్రింది విషయాలు లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

1.నిన్నునీవుపోగడుకొనుట.2.పరనింద3.ఇతరుల దోషాలను ఎంచుట.

**ఈ మూడింటిని ఎల్లప్పుడూజ్ఞాపకం ఉంచుకో .

1.ఈశ్వరస్మరణ

2.పరులనుగౌరవించుట.

3.నీలోనిదోషలనుకనిపెట్టుట.

***ఈ మూడింటిని ఆచరించు.1.సత్యము,2.అహింస3.ప్రేమతత్త్వము.

*ఈమూడింటికిదూరంగాఉండు.

1.ఇతరులగూర్చిచర్చ

2.వాదవివాదాలు 

3.నాయకత్వం

**ఈ మూడింటి యందు దయతో ఉండవలెను.

1.అబల2.పిచ్చివాడు

3.దారి తప్పినవాడు.

**ఈమూడింటియందు దయతో నుండకు.

1.పాపము2.బద్ధకము.

3.స్వేచ్ఛాప్రవర్తన

**ఈ మూడింటిని నీవశం చేసుకోవాలి.

1.మనసు2.కామేంద్రియం3.నాలుక.

**ఈమూడింటియందు మమకారం కల్గియుండు.

1.ఈశ్వరుడు2.సదాచారము3.పేదలు

**ఈ ముగ్గురు పట్ల వినయంతో ఉండు.

1.తల్లి2.తండ్రి3.గురువు

**ఈ మూడింటిని నీ మదిలో ఉంచుకోవాలి.

1.దయ2.క్షమ3.వినయము.

**ఈమూడు వ్రతాలు పాటించు

1.పరస్త్రీనిమోహించకుండుట2.పరధనాసక్తిలేకుండుట.3.అసహాయులకు సేవ చేయుట.

**వీరి యందు ప్రత్యేక శ్రద్ధ జూపు.

1.వితంతువు2.అనాధలు3.నిరాధారులు.

***వీటిని లెక్క చేయవద్దు

1.ధర్మాన్నిపాటించేసమయంలోకల్గేకష్టము

2.పరులకష్టాన్నితొలగించేటప్పుడుకల్గేధననష్టాన్ని

3.రోగికిసేవచేయునప్పుడు శరీరానికి కలిగే కష్టాన్ని.

** బాగా పోషించిడంనీకర్తవ్యం!

1.తల్లిదండ్రులు2.భార్యాబిడ్డలు3.దుఃఖములోనున్నవారు.

**వీటిని మరచిపో 

1.నీవితరులకుచేసినసాయం2.ఇతరులునీకుచేసినకీడు3.డబ్బు,గౌరవం,సాధనాలు వల్ల సమాజంలో నీకుకల్గిన ఉన్నతస్థితి 

**ఈవిధంగా మారకు

1.కృతఘ్నుడు2.డాంబికుడు3.నాస్తికుడు.

ఏ విద్యనభ్యసించాలన్నా , మనపెద్దలు3మెట్లసోపానాన్నిఎక్కాలనిసూచించిరి.

1.శ్రవణం2.మననం3.నిధిధ్యాసనఫలితంగాకలిగేదిసాక్షాత్కారం.ఆధ్యాత్మికవిద్యనభ్యసించడానికిపైవానినిఅనుసరించుటయుక్తము.శ్రవణమనగాగురువులుచెప్పేదిశ్రద్ధగావినడంద్వారాజ్ఞానముపొందవచ్చును.కేవలంవినుటయేగాక విన్న దానిని మరింత లోతుగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేయడం,ఆస్వాదించడం,కూలంకషంగా నెమరు వేసుకొనిఏర్పాటుచేయాలి.విన్నదాన్నిమననంచేసాక సారాంశము పై కొంతసేపు ధ్యానం చేయాలి.అప్పుడువిన్నది,చదివినదిమనశరీరవ్యవస్థలోజీర్ణమైఆజ్ఞానముమనస్వంతమగును.ఆవధంగామనలోనంతర్భాగమైమనకక్కరవచ్చినప్పుడుపయోగపడేవిధంగాఉంటుంది.మంచిచెడులనుయోచించిసాధువర్తనంతోజీవనగమనాన్నికొనసాగించాలి.మనోవాక్కాయకర్మల్నిభగవంతునిపైకేంద్రీకరిస్తేఆధ్యాత్మికతపుడుతుంది.ధర్మచింతనతోఅలుపెరుగనిబాటసారిగాఆధ్యాత్మికమార్గంలోపయనిస్తేసార్ధకమగును.అదేమహాప్రస్ధానం.జీవితాన్నిమలుపుతిప్పేదివ్యసోపానం.

@@&&@@










 

మానవ జీవితం విశిష్టత

 మానవ జీవితం

ఇదిభగవంతుడిచ్చినవరం.దీనిని సుఖవంతంగా మలచుకోవడం మన బాధ్యత.ఈజీవిత చదరంగంలో కల్గే బాధలకు మనమే కారణం.అవన్నీదేవుడుచేసాడనుకోవడం చాలా పొరబాటు.పరిష్కారంలేని సమస్య అంటూ ఏదీ లేదు.రోజులోకొంచెం సమయం దైవం కోసం కేటాయించు.నీమనసునుదైవానికిసమర్పించు.అలాగేమనంమనదగ్గరనున్న వాటితో సరిపెట్టుకుంటే ప్రతీ చోటాస్వర్గమే.లేనిదానికోసంఆరాటపడుతూవేసేప్రతీ అడుగు నరకమే.ఒక్కోసారి మన నిజాయితీ,ధైర్యం, తెలివితేటలు ఇవేవీ మనల్ని గెలిపించ లేకపోయినా మన ఓర్పు, సహనంమాత్రమేమనల్ని గెలిపించగలవు.మనం చేసే పనిని అందరూ స్వీకరించక పోయిన, అవసరం, అర్హత ఉన్న వారు స్వీకరిస్తారు.మనదగ్గరేముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరు ఉన్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను మర్చిపోయేలాచేస్తుంది. .మనఆత్మాభిమానం మునకు ముఖ్యం.అది ఎప్పుడూ అంత ఎత్తులో ఉండాలి.ఒకరుచులకనచేసారని ఎప్పుడూ అనుకోకూడదు.ఎవరిస్థాయి వారిదే.

మానవునికిరోగంకల్గించేది..పాపం.భోగంకల్పించేది .. పుణ్యం

భవిష్యత్తునిర్ణయించేది..కర్మ..లాభంకలిగించేది...సేవ.సంపాదననిల్పేది . పొదుపు.విలువ పెంచేది..దానం.నష్టం కల్గించేదిహింస.అశాంతికల్గించేది..ఆశ.శాంతికల్గించేది.తృప్తి.దుఃఖంకల్గించేది..కామం.పతనంచేసేది...అహంకారం..మానవునకుఅందరినిదగ్గరచేసేదిప్రేమైతేదూరంచేసేది అసూయ.మానవునిస్థితినిసూచించేది.గుణం, దైవంగా మార్చేది..దయ.

ఆత్మ స్థితిని తెల్పేది.వాక్కు.విజయం చేకూర్చేది..ధర్మం,గొప్పవానిగాచేసేది. జ్ఞానం, ముక్తి నిచ్చే రాహిత్యం.మానవుని అన్నిరకాల సంస్కరించే ది స్మరణ ధ్యానములు.అందుకేప్రతీమానవుడుభగవంతునినామస్మరణచేస్తూథ్యానమునభగవద్దర్శనమును పొందుట ఆవశ్యకం.