మానవ జీవితం
ఇదిభగవంతుడిచ్చినవరం.దీనిని సుఖవంతంగా మలచుకోవడం మన బాధ్యత.ఈజీవిత చదరంగంలో కల్గే బాధలకు మనమే కారణం.అవన్నీదేవుడుచేసాడనుకోవడం చాలా పొరబాటు.పరిష్కారంలేని సమస్య అంటూ ఏదీ లేదు.రోజులోకొంచెం సమయం దైవం కోసం కేటాయించు.నీమనసునుదైవానికిసమర్పించు.అలాగేమనంమనదగ్గరనున్న వాటితో సరిపెట్టుకుంటే ప్రతీ చోటాస్వర్గమే.లేనిదానికోసంఆరాటపడుతూవేసేప్రతీ అడుగు నరకమే.ఒక్కోసారి మన నిజాయితీ,ధైర్యం, తెలివితేటలు ఇవేవీ మనల్ని గెలిపించ లేకపోయినా మన ఓర్పు, సహనంమాత్రమేమనల్ని గెలిపించగలవు.మనం చేసే పనిని అందరూ స్వీకరించక పోయిన, అవసరం, అర్హత ఉన్న వారు స్వీకరిస్తారు.మనదగ్గరేముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరు ఉన్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను మర్చిపోయేలాచేస్తుంది. .మనఆత్మాభిమానం మునకు ముఖ్యం.అది ఎప్పుడూ అంత ఎత్తులో ఉండాలి.ఒకరుచులకనచేసారని ఎప్పుడూ అనుకోకూడదు.ఎవరిస్థాయి వారిదే.
మానవునికిరోగంకల్గించేది..పాపం.భోగంకల్పించేది .. పుణ్యం
భవిష్యత్తునిర్ణయించేది..కర్మ..లాభంకలిగించేది...సేవ.సంపాదననిల్పేది . పొదుపు.విలువ పెంచేది..దానం.నష్టం కల్గించేదిహింస.అశాంతికల్గించేది..ఆశ.శాంతికల్గించేది.తృప్తి.దుఃఖంకల్గించేది..కామం.పతనంచేసేది...అహంకారం..మానవునకుఅందరినిదగ్గరచేసేదిప్రేమైతేదూరంచేసేది అసూయ.మానవునిస్థితినిసూచించేది.గుణం, దైవంగా మార్చేది..దయ.
ఆత్మ స్థితిని తెల్పేది.వాక్కు.విజయం చేకూర్చేది..ధర్మం,గొప్పవానిగాచేసేది. జ్ఞానం, ముక్తి నిచ్చే రాహిత్యం.మానవుని అన్నిరకాల సంస్కరించే ది స్మరణ ధ్యానములు.అందుకేప్రతీమానవుడుభగవంతునినామస్మరణచేస్తూథ్యానమునభగవద్దర్శనమును పొందుట ఆవశ్యకం.
No comments:
Post a Comment