ఆత్మను తెలుసుకోవడం
ఆత్మను తెలుసుకోవడం మానవజాతికేసాథ్యమగును.అందులకైమూడు కార్యములను ఆచరించాలి.
1.శ్రవణదర్శనాలు2.మననము(స్మరణ)3.నిధిధ్యానము.
1.శ్రవణదర్శనాలు:-ఇంద్రియాలతోజగత్తుయొక్కయధార్ధ జ్ఞానమును,శ్రవణచక్షురింద్రియములచేపొందవలెను.
2.మననము:-తర్కముచే,నింద్రియములకతీతమగువిషయాలనుచింతించియథార్ధజ్ఞానమునుసంపాదించాలి.
3.నిదిథ్యాసము:-శ్రవణ,దర్శనం,మననములవలన గల్గిన జ్ఞానమును ఆత్మచే గ్రహించడం చేయాలి.దీనినేశ్రద్ధ లేక విశ్వాసమందురు.నిదిథ్యాసమనగాఅనుభవపూర్వకముగాగ్రహించుట.మననము గావింపచేయుట తర్కము యొక్క పని.ఆత్మ క్షేత్రమునకు తర్కము ప్రవేశింప వలదు.అట్లుజరిగినకుతర్కమనబడును.ఆకుతర్కము మనుజుని శ్రద్థా విశ్వాసము లనుండి తొలగించ గలదు.అంతఃకరణకార్యమునుగమనింపుడు.
అంతఃకరణ కార్యం:-మస్తిష్కమునకుపై భాగమున నిచ్ఛాశక్తి యుండి తనకార్యమును సాగించును.దీనికికొంచెము క్రిందుగా, మస్తిష్కముపై మేధావీ బుద్ధి యుండును.దానికి క్రిందమస్తిష్కమధ్యమున తార్కికబుద్ధికాలేదు.మస్తిష్కముక్రిందిభాగము, మనో సంబంధమైన సందేశతంతువులస్ధానముండును.హృదయము పైనమనసుగలదు.హృదయముమరియునాభిమధ్యనచిత్తముండును.దీనికిక్రిందినసూక్ష్మప్రాణములుండును.ఈఅంతఃకరణాలతోనిచ్ఛాశక్తి(నిశ్చాశక్తి)పని చేయును.బుద్ధితో
జ్ఞానముమరియుతర్కపూర్ణవిచారము,మనస్సుతోనింద్రియములవ్యాపారము,చిత్తముతోనుద్రేకాదులు,మరియుప్రాణాలతో భోగ కార్యములు గావించబడును.అంతఃకరణ కార్యములు సరిగా జరిగినప్పుడు ఇచ్ఛాశక్తి యొక్క కార్యములో నాటంకాలు కల్గి శక్తివికాస, వృద్ధులు గాంచును.ఇవన్నీ ఆత్మకు యంత్రాంగములవంటివి.ఇచ్ఛాశక్తి విద్యుత్ వంటిది(గతిశక్తి). ఈకార్యక్రమంలో కల్గు ఆటంకాలు....
1.సూక్ష్మప్రాణములు, ఇంద్రియవ్యాపారములగు భావవిచారములలో జోక్యంకల్గించుకొన్నప్పుడు,మనుజుడుకోరికలకు దాసుడగును.
2.చిత్తము,ఇంద్రియవ్యాపారములలోసంబంధము పెట్టుకొన్న భావుకత వృద్ధిచెందిమనోబుద్ధులు
నిష్క్రియములగును.
3.మనసుబుద్ధి యొక్క కార్యములోజోక్యముగొన్నమనుజుడుఇంద్రియాదులజ్ఞానమునువిచారించలేడు.ఇంద్రియజ్ఞానము తోనాతడుభ్రమాదులనెరుంగకనిర్ణయంగావించుచుండును.
4.ఇటులనే తర్కము కల్పనాస్మృతులయొక్కయు, మేధావి బుద్ధి యొక్కయుకార్యములలోజోక్యంగల్పించుకొన్నచోమనుజుడుకుతర్కాలుగలవాడై విజ్ఞానము,శ్రద్ధ,మరియువిశ్వాసములనుండి విముఖుడై యుండి అనుమానాదులలో చిక్కు కొనును.
5.బుద్ధి, ఇచ్ఛాశక్తి పనిలో సంబంధం పెట్టుకున్నచో నాత్మ పరమాత్ముల నైక్యమొనర్చు శక్తి నుండి మనుజుడువంచితుడగును.
6.అల్పజ్ఞతవలన కూడా విఘ్నముకల్గును.దానివలనమానవునిలోసందేహము,అసఫలత మున్నగు స్వభావములేర్పడును.ఇదిశక్తి, వికాసము లో గొప్పఆటంకంకల్గించును.మనోబుద్ధి చిత్తాదులు తమతమ సీమలలో పనిజేయుచునితరులతో సంబంధంపెట్టుకొనకుండా యున్నచోమానవుడు శ్రద్ధా తర్కములచే లాభం పొందగలడు.
@@@@@@
No comments:
Post a Comment