యోగము _ప్రాణాయామము
సాంఖ్యము కలుగు జ్ణానము యోగముతో కలిగే బలమూ రెండూ సాటిలేనివి.కొంతమంది సాంఖ్యము యోగము వేరు వేరు అంటారు.కానీ రెండూ ఒకటే .మనోధారణ ప్రాణాయామము అనేవి రెండు ప్రధానయోగములు.మొదటిది నిర్గుణము రెండవది సగుణము .మనోధారణ అనగా మనస్సును ఏకాగ్రత గా ఉంచడము.ప్రాణాయామము అనగా శ్వాసను క్రమ పద్ధతిలో వదలి పీల్చడం .ఇది మానవునకు అసౌకర్యము కల్గించదు.క్రమ పద్ధతిలో ప్రాణాయామము చేస్తూ ఇంద్రియములనదుపు లో ఉంచుకున్నవాడు యోగసిద్ధిపొందగలడు.ప్రాణాయామము చేసే సాధకుడు నియమనిష్ఠలు పాటించాలి .ప్రాణాయామమునకు రోజూ కొంత సమయము పాటించాలి.శరీరమునకు అసౌకర్యము కలుగని రీతిలో ప్రాణాయామము అభ్యసించాలి.ఇలా ప్రాణాయామము పగలు ,రాత్రి అభ్యసించాలి.దీనివలన లోపలి వెలుపలి శరీరము శుద్ధి పొందుతుంది.
యోగసిద్ధికి ప్రాణాయామము
దానివలనకల్గే అంతః బాహ్య శుద్ధి మూలము.ఇది సగుణతంత్రము.మనోధారణ నిర్గుణతంత్రము.ఇంద్రియములను మనసులో,మనసును అహంకారంలో ,అహంకారమును బుద్ధిలో,బుద్ధిని ప్రకృతిలో లీనం చేయడమే ధ్యానం.నిరంతరం ధ్యానంలో నిమగ్నమైనవాడికి ముసలి తనములేదు.యోగీకి మలినములు అంటవు ..
నిరంతర ఆనందము పొందుతూ పరమాత్మ దర్శనం పొందుతాడు.యోగి గాలిలో పెట్టిన దీపము వలె నిశ్చలంగా ఉంటాడు.నిర్మలాకాశంలాఉంటాడు.ఆటుపోటులకు చలించని సముద్రంలా ఉంటాడు.అతడి చుట్టూ భయంకర శబ్దాది మనసును కలవర పెట్టే విషయాలను పట్టించుకొనడు.దీనినే యోగమార్గము అంటారు.కానీ ఈ మార్గంలో నడవడానికి ఎలాంటి అలసత్వం పనికి రాదు.ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండాలి.ఈ యోగీకి ఎవరికి అందని మోక్షము లభిస్తుంది.
మరణము లోకాలు
మరణసమయంలోఈయోగికిపాదాలనుండి ప్రాణాలుపోయినచోవిష్ణుపదము, పిక్కలు నుండి పోయిన వసువులుఉండేలోకమును,జానువులనుండిపోయినసాథ్యులుండేలోకములభిస్తుంది. విసర్జనకు ఆలయము నుండి పోయిన సూర్య లోకము లభిస్తుంది.తొడలనుండి పోయిన ప్రజాపతి లోకము లభిస్తుంది.జననేంద్రియాలనుండి పోయిన భూలోకప్రాప్తిలభిస్తుంది.పార్శ్వములనుండిపోతే మరుత్తల లోకము వస్తుంది.బొడ్డులోనుండిపోతేచంద్రలోకములభి స్తుంది.చేతులనుండిపోతే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది.వక్షస్థలమునుండిపోతేకైలాసప్రాప్తిలభిస్తుంది.ముఖములోనుండిపోతే విశ్వ దేవతలుండే లోకం లభిస్తుంది.చెవుల నుండి పోతేదిక్పాలకులుండే లోకం లభిస్తుంది. ముక్కునుండి పోతే వాయుదేవుడు ఉండే లోకము లభిస్తుంది.కళ్ళనుండి పోతే అగ్నిదేవుడు ఉండే లోకము లభిస్తుంది.కనుబొమలనుండిపోతే అశ్విని దేవతలు ఉండే లోకం ప్రాప్తిస్తుంది. నుదురు నుండి పోతే పితృ దేవతలు ఉండే లోకం ప్రాప్తిస్తుంది.తలపైభాగంనుండి. పోతే శాశ్వతానందం ఇచ్చే మోక్షం లభిస్తుంది.
మరణసమయం
మరణసమయం మాసన్నమైనప్పుడు ఆకాశంలో అరుంధతీ నక్షత్రం కనిపించదు.ముక్కుచెక్కినట్లుకనపడినా , చంద్రుడు మలినంగా కనబడినా,అతడిఆయుష్షు ఒక సంవత్సరము నిగ్రహించాలి.ముఖవర్ఛ స్సు,తెలివితేటలుపెరిగినాతరిగినాఅతడిఆయువుఆరు నెలలే అనితెలుసుకోవాలి.పూర్ణచంద్రుడిలో,సూర్యబింబంలో వెలితి కనబడితే అతడి ఆయుర్దాయము ఏడు రోజులే అని తెలుసుకోవాలి.దేవాలయమునకు వెళ్లినప్పుడు దేవుడికి సమర్పించిన పుష్పములు,సుగంధ ద్రవ్యములు దుర్గంధము వెదజల్లితే అతడి ఆయస్సు ఆరు నెలలు మాత్రమే.చెవులు ముక్కు వాలిపోయినా దంతాలు రంగు మారినా కళ్ళలో కాంతి సన్నగిల్లినా ,శరీరము నల్లబడినా అతనికి తక్షణమే మృత్యువు అని తెలుసుకోవాలి.మానవుడు ఏ కారణము లేకుండా నే కళ్ళలో నీరు కారుతూ ఉంటుంది.తల మీద నుండి పొగలు,సెగలు వచ్చినా అతనికి చివరి దశ ఆసన్నమైనదని టెక్=లుసుకొవాలి .యోగి యైనవాడు ఈ సూచనలు గమనించి నిరంతర ధ్యాన సమాధిలో నుండి జీవుడిని పరమాత్మలో కలపడానికి ప్రయత్నించును.అట్టి యోగి ప్రాణములను విడువగానే పరమాత్మలో లీనమై శాశ్వతానందమును పొందును.
No comments:
Post a Comment