మనం గుర్తుంచుకోవలసిన విషయాలు
రాధా స్వ ఆమీ
మనం గుర్తుంచుకోవలసిన విషయాలు
1.కర్మ ,కర్మఫలం :-
దేవుడు జీవుడు
1.శరీరధారుడు కాదు. శరీరధారుడు
. 2 .కర్మలు చేయడు కర్మలు చేయును .గాన శరీరధారణ
అవసరము.కర్మఫలములను అనుభవించును.
3..కర్మఫలములను అనుభ
వించనక్కరలేదు.
కర్మచేసేవారిని కర్త అనియందురు.వాని ఫలములననుభవించు వానిని భోక్త అనియందురు.
కర్తృ త్వమేవరిదో భోక్తత్వము కూడా వారిదే.దేవునిలో నవి యుండవు. వేదవిహిత కర్మలను చేయాలని ఈశ్వరాజ్ఞ .అట్లు చేయనిచో అనేకదుఃఖము లపాలగును .దేవుడు జీవునకు కర్మఫలములనిచ్చును.అందుకే దేవుడవసరము.కర్మఫలాలనను భవించాలంటే మొదట శరీరము కావాలి .తర్వాత అన్నము,అనువగు ప్రపంచ మిచ్చుట దేవుని పని.దేవుని సృష్టి రచనలేనిచో సుఖదుఃఖాలు,కర్మలు,పాప పుణ్యములేమియు నుండవు.జీవుని యందు కోరిక,ప్రయత్నము,ద్వేషము,దుఃఖము,సుఖము,జ్ఞానము ఈ ఆరును ఆశ్రయంచి యుండును.కాన మాటిమాటికి జీవుడు శరీరాధారణ చేయును.ఒక వస్తువు కావాలని కోరడము అది లభించనిచో ద్వేష భావము కల్గియుండుట,వస్తుసంపాదనకై ప్రయత్నించడము,సాధించిన దానితో సుఖపడటము/దుఃఖించడము సామాన్యజ్ఞానాన్ని కల్గియుండడం,వంటివన్నీ జీవునిలోచూస్తాము.దేవుడు,జీవుడు,ప్రకృతి,ఉనికి గల పదార్ధాలు.వీనికెన్నడు నాశములేదు.దేవుడు సృష్టి స్ధితి లయలకధిపతి.దేవుడు ప్రపంచానికి స్వామి.ప్రపంచాన్ని మించి యున్నాడు.జీవుడు ప్రపంచములో నొక భాగస్వా మి మాత్రమే.దేవుడు సర్వవ్యాపకుడు,సార్వదేశికుడు.జీవుడేకదేశీ .దేవుడొక్కడే.జీవులనేకం.దేవునిలో విశ్వమంతా నిండి యుంది.శరీరమవసరములేదు.కారణశరీరము,సూక్ష్మ శరీరము,స్ధూలశరీరము అనేవిలేనివాడు దేవుడు.కారణజన్ముడు జీవుడు కానీ దేవుడు కాదు.జన్మఎత్తే అధికారమతనికుంది.దేవుడు జీవుల చేష్టలను,కర్మలను పరిశీలిస్తూ,తగినఫలా లనిస్తుంటాడు.పరమాణువుకంటే సూక్ష్మమైనవాడు,అదృశ్యరూపుడు,ఓంకారవాచ్యుడు,అంతటానిండి యున్నవాడు ,మనలోనున్నవాడు.కాన మనము శరీరధారులము కావున మనలోని దేవుని వెదకి ఆతనినుపాసించి తరించుట మన కర్తవ్యము.
No comments:
Post a Comment