స్వామిజీ మహారాజు-2
2పేజి
స్వామీజీ మహారాజు వారు స్ధా పించిన మతము యొక్క సారాంశము
1.ఆధ్యాత్మికసాధనలు 3 ---1.మానవశరీరములో ఆత్మస్ధానము వద్ద పవిత్ర నామమును స్మరణ చేయుట .
2.ఆయా త్మస్ధానము వద్దనే సంత్ సద్గురువు యొక్క పవిత్ర స్వరూపమును ధ్యానము చేయుట.
3.శబ్దాభ్యాసము అనగా ఆత్మస్ధానము వద్ద లక్ష్యము నేకాగ్రము జేసిసచ్చిదానందతేజోరూపమగు చైతన్య శక్తి తో అనగాశబ్దధారతోనాంతర్యమున సంయోగమేర్పరచుకొనుట .
తప్పనిసరి కృత్యములు
1.సంత్ సద్గురువు సేవ,మానవసేవ,పరమార్ధి ఈ సేవ చేసి సద్గురువుని దయాకటాక్షములను,ఆంగ్రంధములు తర్యసాయమును పొందవలయును.
2.సత్సంగము అనగా సంతు సద్గురువు యధ్యక్షతన జరుపబడు సామాజిక దైవ ప్రార్ధన.సత్సంగములో పవిత్ర గ్రంథ పాఠ మును చేయుదురు .సద్గురువు అమృత వచనములను సెలవిచ్చుచుందురు.సంత్ సద్గురు సాంగత్య మహాలాభము గూడ చేకూరును .
రాధాస్వామీమతములో కర్మకాండ,బాహ్యాచారములు,మొదలగునవి విధింపబడలేదు.జాతివర్ణములమూలమునపరస్పరభేదభావములు గూడనీమతములో పాటింపబడవు. ఈ మతములోని నీతిశాస్త్రమంతయు నీక్రింది సూత్రములలో నిండియున్నవి .
1.నీవితరులు నీ యెడలనెట్లు ప్రవర్తింపవలెనని గోరుదువో గోరుదువో నీ వితరులయెడలనట్లే ప్రవర్తించవలయును.
2.భగవంతుని సన్నిధానమునకు గొనిపోవునట్టి యూహలుపనులను శుభకర్మలు.
3.భగవంతుని వద్దనుండి దూరము జేయునట్టి కృత్యములు పాపకర్మలు.
పాటింపవలసిన నియమములు :-
1.ఈ మతమున నుపదేశము గోరువారు మత్స్యమాంసములను ,గ్రుడ్లు మొదలగు జంతుసంబంధ మైన యాహారమును విసర్జించవలయును.
2.మద్యము మొదలగు మత్తుపదార్ధములను విసర్జించవలయును.
3.రాధాస్వామీ నామము పరమపితయొక్కనిజనామమని దృఢవిశ్వాసము కల్గియుండవలయును.
స్వామీజీమహారాజు వారి ప్రధమ శిష్యులగు జీవన్ లాల్ ,మఱియు హుజూరు మహారాజుగారు .వేరు స్వామీజీ వారు ఆశువుగా జెప్పు శబ్దములను వ్రాసి తదుపరి అచ్చొత్తించిరి.అదియే సారబచన్ గ్రంధము.
సత్సంగము ప్రతిదినము జరుగుచు నన్నిజాతుల వారును, వర్ణములవారును సత్సంగమునకు వచ్చి స్వామీజీమహారాజు వారి వచనామృతమును గ్రోలుచుండెడివారు.వీరి కాల ములో 4000మందికిపైగా ఉపదేశములనుతీసుకొనిరి.స్వామీజీ మహారాజు వారు తమ నిర్యాణమునకు ముందు హుజూర్ మహారాజువారు తమతర్వాతగురువగుదురనితెలియబరిచిరి.వారు 1878సం|| జూన్15వతేదీన మధ్యాహ్నము 1గుంట 45నిమిషాలకు 60వ యేట భౌతికశరీరమును విడిచిరి.
స్వామీజీమహారాజువారు తమ నిర్యాణమునకు ముందు భక్తులకు "ఈ త చేతకానివాడు నీటిలో మునిగిపోవుచుండగా నాతనిని యీదుమని జెప్పినను అతడప్పుడీత నేర్చుకొనజాలక మునిగిపోవును.కానీ చిన్నతనమునుండియు ఈత నేర్చినవాడు నట్టేటిలో పడిపోయిన నెన్నటికిమునిగిపోడు.మన భౌతికశరీరము చర్మముతో కప్పిన మాంసాస్ధికల శకలం.యావజ్జీవము నాధ్యాత్మిక సాధనల జేసినవానికి ఈ ప్రపంచమును వీడిపోవునప్పుడు పరమపురుషుని పవిత్ర నామముతప్పక స్మృతికి వచ్చుఁను.కావున మానవులు పవిత్ర నామమును ప్రాపంచిక కృత్యములను చేసికొనునప్పుడును,ఇటునటు తిరుగుచున్నప్పుడును,గూడ మఱువకుండనెల్లప్పుడును స్మరణ చేయుచునే యుండవలయును.
కావున ప్రతి సత్సంగీ పై వచనములనాచరణలో నుంచుకొనవలయునని మనవి.
No comments:
Post a Comment