పరమ గురు స్వామీజీ మహారాజ్
పరమ పురుష రాధాస్వామీ దయాళురు క్రీ .శ .1818సం వత్సరము ఆగష్టు 24వ తేదీ సోమవారం రాత్రి 12-30గం టలకుఆగ్రాలోని ఫన్నీగల్లు అను మొహల్లాలో జనించెను.వారి పూర్వనామము శ్రీ శివదయాల్ సింగ్ .వీరు ఖత్రికులమునకు చెందిన శేఠ్ దిల్వాల్ సింగ్ సాహెబ్ గారికి మొదటి కొడుకు,రెండవకొడుకు శే ఠ్ బృందావన్ ,మఱియు మూడవకొడుకు శేఠ్ ప్రతాపసింగ్ .వీరు గురునానక్ సాహెబ్ భక్తులు .వీరు సంతు తులసీసాహెబ్ వారి సత్సంగములో చేరిరి మాతాపితరులతోసహా .వీరు 5వ సంవత్సరంలోనే చదువు మొదలుపెట్టి గురుముఖీ భాషలనే గాక పర్షియన్ భాషనునేర్చుకొని యొక గ్రంధమునుకూడారచించిరి.సంస్కృతము,అరబిక్,హిందీ,ఉర్దూ భాషలలో ప్రావీణ్యము సంపాదించిరి.ఆయనవద్దకు అనేకమందివిద్యను గ్రహించిరి.
వీరు చిన్నతనమునుండియే ఆధ్యాత్మిక సాధనలు సల్పుచు తల్లి సాయమున తమ 6వ ఏటనుండియే ఆధ్యాత్మికాఅభ్యాసముచేయుచుండెడివారు..స్వామిజివారు పసితనమునుండియు,బడికివెళ్ళుసమయములోను పిన్నలకు.పెద్దలకు,తమతల్లిదండ్రులకు పరమార్థబోధన లు చేయుచు పరిపూర్ణోధ్ధారణమునుసాధించుటకుదోడ్పడు పంధానందరు నవలంబింపవలసినదని బోధించెడివారు.
వీరు చిన్నవస్సులోనే ఫరీదాబాదు నివాసియగు లాలా ఇజ్జత్ రాయ్ గారి కు మార్తె శ్రీమతినారాయణదేవిగారితో వివాహము జరిగెను.చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగములో జేరినను ఆధ్యాత్మికాభ్యాసనలకాటంకము కల్గుచుండుటచే మానివేసిరి.కానీ కుటుంబపోషణకై వారి మామగారు యొక రాజుగారి దివాణమున 2గంటలు పనిచేయు షరతుతో జేరిరి.వారికి లభించినదానిలో తమకవసరమణదానినియుంచుకొని మిగిలినది బీదసాదలకిచ్చెడివారు .
ఇట్లుండగా నొకనాఁడుతమతండ్రిమరణమాసన్నమైనదని యుద్యోగమునువదిలి తమతండ్రియొద్దకుబోయిరి. వీరు వెళ్లునప్పటికీ వారితండ్రిగారు యొకవివాహమునకు హాజరై తిరిగివచ్చిజబ్బుపడిరి .స్వామిజివారు సపర్యలుజేయుచు సంతుల పవిత్ర గ్రంధములనుండి శబ్దపఠనము చేసి గతించిపోవు నాత్మకు సహాయసంరక్షణలనిచ్చిరి.
స్వామీ జి మహారాజువారు తమకుటుంబబాధ్యతలనుండి,ప్రాపంచికబాధ్యతలనుండియు విముక్తులై తమ కాలమునంతటిని యాధ్యాత్మిక సాధనలలోను,పరమార్ధ బోధన చేయుటలోను గడుపు చుండిరి.వారికి వేరే గురువు లేరు.అట్టి యవసరము కలుగలేదు.స్వేఛ్చచేపరమోన్నత ధామమునుండి దిగివచ్చిమానవ రూపమును ధరించిన పరమపురుషుని యవతారము.వారు తినునది 2ఔన్సుల ధాన్యపు దినుసులు మాత్రమే.కానీ వారు గంటలకొలది యుపన్యాసములనిచ్చు చు నందరిని యబ్బుర పరిచెడివారు. కొందరి విశిష్ట వ్యక్తులకు ఆధ్యాత్మిక సాధనలనుపదేశించెడివారు .తమ ప్రధాన శిష్యులైన హుజూర్ మహారాజువారియొక్కయు,ఇతరభక్తులయొక్కయు ప్రార్ధనలకు మన్నించి సమస్త ప్రజలందఱకు సత్సంగమును క్రీ|| శ 1861 వతేదీవసంతపంచమీ సుదినమున తెఱచి నట్లుమహానుగ్రహముతో ఘోషణ చేసిరి.హుజూరుమహారాజు వారి ప్రార్ధనను తెలియబరుస్తు స్వామీజీమహారాజు వారొకశబ్దమును రచించిరి.
సతగురుసే కరూ పుకారీ ,సంతన మత్ కీజె జారీ
అప్పటినుండి పన్నీగల్లు లో అభ్యసనాది ఎల్లవే ళలచేయుచుండగా భక్తుల సoఖ్య పెరుగుచుండుటచే ఇప్పుడున్న రాధాబాగ్ అదే స్వామిబాగ్ కి మార్చుట జరిగినది.తమదగ్గరకు వఛ్చిన వారి సందేహాలను,ఖండనలు వారడగకముందే వారికీ విడమరిచిచెప్పెడివారు..వారు నూతి దగ్గరనుండి జలమును తీసుకొనివెళ్లెడివారు.ఒకరోజు ఆ నూతి చుట్టూ పెద్దనగరము తయారగునని చెప్పిరి.అదే ఇప్పటి దయల్బాగ్ .
No comments:
Post a Comment