ముఖ్య విషయము
సృష్టికర్త సృష్టించిన జీవుల ఆత్మలు)అనేక దేహములలో ప్రవేశించి తిరిగి తిరిగి చివరకు మానవ దేహములో ప్రవేశించును. మానవవులుండే ప్రపంచము అంతా నాశమానము. ఈ విషయము తెలిసినను మానవులు మనసు,బుద్ధిల ప్రభావములవల్ల మాయాచే కప్పబడి అజ్ఞానముచే ఆనేక మంచి చెడు కర్మలు(కార్యములు) చేయుచు వానివల్ల సుఖదుఃఖములు ,పాపపుణ్యములు పొంది వానిచే జననమరణచక్రములోబడితిరుగుచుందురు .
మనము మనసు,బుద్ధిలను అదుపులోనుంచుకొని మంచికార్యములు చేయుచుండిన తత్ఫలితముగా ఆ జనంమరణచక్రమునుండి తప్పింపబడి మరల సృష్టికర్తదగ్గరకు వెళ్ళుటకవకాశముండును. ఇంకా కర్మలగూర్చి తెలిసికుందాము.
కర్మకాండలో కర్మత్రయo , ఫలత్రయం,దోషత్రయం ఉంటాయి.
1.. కర్మత్రయo :మనం వాడే కరణాల దృష్ట్యా మనం చేసే కర్మలు 3రకాలు
ఏ )కాయికకర్మ శరీరముతో పూజ,ప్రదక్షిణం చేసేది ,నమస్కారం ,తీర్ధయాత్ర,యజ్ఞం
బి )వాచికకర్మ వాక్కుతో చేసేది పైకిచెసేజపం,పారాయణం సి)మానసకర్మ మనసుతో చేసేది ధ్యానం
2ఫలత్రయం :ఏ కర్మ చేసినా దేయానికి ఫలముంటుంది . అది దృష్టఫలం అలా కావచ్చు . అదృష్టఫలంకావచ్చుఁ . అనగా కనబడేఫలం ,కనబడనిఫలం .
అది పుణ్యం కావచ్ఛు , పాపంకావచ్చుఁ . ఉదాహరణకు:ఆకలితో ఉన్న పేదవానికి అన్నం దాన0 చేస్తేపుణ్యం వస్తుంది . ఆదికనబడే, కనబడని ఫలములవవచ్ఛు . ఆకలి తీరిన ఆ పేదవాని ముఖంలో కలిగిన ఆనందం , ఆటను నోరారా మనను దీవించటం -దృష్టఫలం . ఈ మంచి కార్యం చేసినందుకు కొంచెము పుణ్యం లభించును. . ఇది ఇది అదృష్టఫలం. అలా కాకుండా ఆటను తిన్న తరువాత దుక్కలాగున్నావు,ఏదైనా పని చేసుకోరాదా అని అంటే అదృషట ఫలం గా పాపం చేరుతుంది.. అలా ప్రతీకార్యానికి తెలిసో,తెలియకనో పునీమో,పాపమో చేరును. ఆ ఫల 3రకములు (ఫలత్రయం).
2ఫలత్రయం :మనకు అర్ధ,కామ,ధర్మ రూపాల్లో కలుగుతుంది. అనగా మనం చేసే కార్యాల ధర్మార్ధకామమోక్ష నాలుగు పురుషార్ధాలలో మొదటి మూడింటిని కలుగచేస్తాయి.
ఏ )అర్ధం{ముందు కలిగే ఫలం అర్ధం. అది ప్రాధమిక ఫలం అర్ధం . అర్ధమ నగా డబ్బు. కానీ ఇక్కడడబ్బు ఒకటే కాదు డబ్బు,పదవి,అంతస్తు ఏ దై నాకావచ్చుఁ భద్రతని చేకూర్చునదేదైనా వస్తుంది దానిక్రింద. ఆవు కూడా ఎండగాఉంటే భద్రతకోసం నీడను వెతుక్కుంటుంది. బి )కామం :అనగా కోరిక .ఇది భద్రతనివ్వదు. ఆనందాన్నికలుగచేస్తుంది. ఉదాహరణకు టివి భద్రతనివ్వదు. కానీ ఆనందాన్నిస్తుంది. డబ్బు వచ్చ్చాక విదేశాలకు వెళ్లాలనో ,పెద్దభవనాలుకావాలనో కోరుకుంటారు. సి)ధర్మం : దీన్ని పుణ్యమని అంటారు.అనగా మనం చేసే కర్మలు మనకు పుణ్యమో,పాపమో కలుగచేస్తాయి.అది వాళ్ళపూర్వజన్మసుకృతంవల్లనో,లేక వాళ్ళపూర్వజన్మపాపమువల్లనో వాళ్లకు అనగా ఆత్మ ధరించిన దేహధారులకు సుఖదుఃఖములుకల్గుచుండును. వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. అంటే గాని భగవానుడు పాపమో,పుణ్యమో మనకు హెలీకాఫ్టర్లోనుండి పడవేయడుగదా. ఇవ్వాళ మనం హాయిగా ఉన్నామంటే మనం చేసుకొన్నా పూర్వజన్మలో మనం చేసుకొన్నా మంచి చేతనే . అలా మనం చేసిన కర్మత్రయo మనకు ఫలత్రయం ఇస్తుంది . వ్యతిరేకంగా చూస్తే మనకర్మత్రయం మనమిచ్ఛే ఫలాత్రయంలో దోషత్రయముంది . కాయిక ,వాచిక, మానసిక కర్మల ద్వారా ధర్మార్ధాకామా లనే పురుషార్ధాలను పొందవచ్చు. ఇవి మనకు శాంతిని. భద్రతను ,ఆనందాన్నిచించినట్లే కనబడతాయి కానీ గులాబీ పువ్వుకింద ముళ్ళున్నట్లే వాని వెనుక దోశత్రయాన్ని తీసుకొనివస్తాయి. అవి దుఃఖమిశ్రితత్వం ,అతృప్తికరత్వం, బంధకత్వం
దుఃఖమిశ్రితత్వమనగా ఆనందాన్ని వెన్నంటి దుఃఖముంటుయింది. అతృప్తికరత్వమనగా కోరికలనటం గదా !ఒకటి తీరితే మరొకటి పుడుతుంది .అందువలన తృప్తి తీరదు. బంధకత్వమనగా ఒకవ్యక్తిమీద లేక ఒకవస్తువుమీదగాని ప్రేమఉండాలి గాని ఆ ప్రేమ మనసును కట్టిపడేయకూడదు. ఉదాహరణగా సెల్ఫోన్ మనకొకపరికరము, ఆదిమనను 24గంటలు దానికే కట్టిపడవేయకూడదు. వీనికి మూలకారణము మనమనసేమనబాధలకు,దుఃఖానికి,సుఖానికి ఆనందానికి కారణభూతమైనదని యర్థము. తైత్తరీయోపనిషత్తులో మనఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షా :--మనస్సే బంధించినా,మోక్షానికైనా ,మనస్సు మళ్ళీ మూడు దోషాలతో ఉంది .
1.మలమంటే3 కామక్రోధలోభమదమోహమాత్స్యరాలు మనసుకున్న మలినాలు.
2.విక్షేపము అనగా మనస్సు స్ధిరంగా యుండక చంచలత్వముతోనుండుట.
3. అజ్ఞాన ఆవరణము అనగా తానెవరో తెలిసికొని భగంతుని (తనలోని ఆత్మను )దర్శించుటకు తగినజ్ఞానమును సంపాదించుట .దీనికై ధ్యానముచేయుట. ..... కర్మలు చేయుటవలన చిత్తశుద్ధి ఉపాసనచేయుటంవల్ల చిట్టా ఏకాగ్రత లభిస్తుంది. దానివలన వివేకం, వైరాగ్యం, శమదమాదిషట్క సంపత్తి ముముక్షత్వములకధికారియై కీర్తిని సంపాదించును.
No comments:
Post a Comment