Saturday, 12 September 2020

మనసు

            .మనసు

సృష్టికిపూర్వము ఆత్మలుఒకముద్దగఅవ్యక్తస్ధితిలోభగవంతునిచరణములవద్ద పడియుండెను.మాయాచైతన్యములమిశ్రణముచేభగవదాజ్ఞచేచైతన్యముపొందికిందలోకములోజంతుమానవరూపములలోప్రవేశించును.అప్పుడువ్యక్తిగతజీవనముదేహధిరులకులభించును.తద్ద్వారావారికిమనసు,బుద్ధిలభించిఆలోచనలుకల్గుట ,బుద్ధిచే వానిని ఆచరింపజేయుట లభించినవి. అందుకే మనఏవమనుష్యాణాం కారణంబంధమోక్షయోః అని పెద్దలన్నారు. మన మనస్సేఅనుబంధానికైనా,మోక్షమోక్షానికీ  కారణభూతమైనది . 

               సృష్టికర్తసృష్టించిన స్ధూలశరీరము  యొక్క సూక్ష్మాoశమే మనసు. మనసులోనిఆలోచనలే మనల్ని నడిపిస్తాయి. సూక్ష్మశరీరములోఇంద్రియములుకన్నా సూక్ష్మమైనవి పంచ న్మాత్రలు --విషయములగు శబ్ద ,స్పర్శ ,రూపగంధాలు (వినికిడి,స్పర్శజ్ఞానం,రుచి,వాసన ,చూపు గంధాలు,     వీనికంటే సూక్ష్మమైనది మనసు ..దానికంటే సూక్ష్మమైనది బుద్ధి. . మనసు చిత్రమైనది ఒకచోనిలవదు.పరుగులుపెడుతుందిదూరతీరాలకుతీరంలేనిదూరానికి.పరుగులన్నీఆలోచనలే.ఆఆలోచనలేమనసునుపరుగుపెట్టిస్తున్నాయామనసేఆలోచనలైపరుగులుతీస్తుందా?అనగాఆలోచనలేమనసనిచెబుతారు.శరీరానికివృద్ధిక్షయలున్నట్లేమనసుకుకూడావృద్ధిక్షయలుంటాయి.వృద్ధాప్యంలోశరీరంతోబాటుమనసుపటుత్వాన్నికోల్పోతుంది.ఆలోచనలకు, ఆచరణలకుమూలంమనసు.మనసుచీకటికలనుసృష్టుస్తుంది.మనసుసృష్టించేకలనుచూడగలముకానిమనసునుచూడలేము.అటులనేఅక్కడున్నదంతాఆత్మసృష్టించిందికానిఆత్మనుమనంచూడలేము.అలాగేబాధలకుఉద్వేగానికికారణంమనసు.మనసులేనిదేవిచారణకవకాశంలేదు.స్థూలశరీరంయొక్కగుణాలుశక్తులుఅన్నీమనసునుండేకలుగుతాయిబాధలు, పోగొట్టుకోవాలంటేభగవద్ధ్యనంచేస్తుంటేప్రశాంతతలభిస్తుంది.మనసులోమంచిఆలోచనలుండిబద్ధిచేఆచరించినప్రశాంతత ,పుణ్యం లభిస్తాయి.అటుగాక చెడుఆలోచనలుకల్గిఆచరిస్తేబాధ ,పాపము, నాశనముకల్గును.నాశమానమగుఐహికభోగవిషయములకైయాలోచించక ఆత్మదర్శనము‌ ,తద్ద్వారాభగవద్దర్శనమునకైశుద్ధమనసుతోయత్నించికృతార్థులగుదురుగాక.భగవంతునిిలోనైక్యమగుుటకుయత్నించుటమానవజన్మసార్ధక్యము.

No comments:

Post a Comment