నేను-మారావూరి
నేను -మారావూరి
ఇక్కడ నేను అనగా తాతపూడి విష్ణు ప్రసాదరావు.
రావూరి అనగా శ్రీ రావూరి వేంకటేశ్వర్లు గారు.మా ఇరువురికి అనేక విధములుగా సామీప్యమున్నది.
మొదటగా బంధుత్వము:
రావూరి వారు నాకు స్వయానా మేనమామ .మా అమ్మ రెండవ తమ్ముడు.నాకు చిన్నప్పుడు ఉపనయనమైన తరువాత మా అమ్మ మరణించుటచే మానాన్న చెల్లెలు వద్దకు చేరి 12వ్తరగతి యందు కృతార్ధు డ నైతిని .తరువాత మానాన్నగారు కొవ్వూరు సంస్కృత పాఠ శాలలో చేర్పించిరి.అప్పుడు రావూరివారింట్లో ఉండడం జరిగింది.వారికి కొడుకులు లేకపోవుటచే నన్ను మేనల్లుడుగా కాక కొడుకుగా చూచుకొనేవారు.వారు కమిటీపాఠశాలలోనుండుటచే జీతములు సరిగా రాకపోయినను నన్నుంచు కున్నారు.వారు పాఠములే కాక జీవితములో కష్టాలనుతేల్పి వానినిఎలా ఎదుర్కోవాలో చెప్పేవారు.ఆయన హాస్టలు వార్డే నుగాఉన్నప్పుడు వంటవాడు రాకపోతే ఆయనే స్వయముగా విధ్యార్ధులును కూడదోసి వంటచేసి వారికన్నము పెట్టిరి.
ఒకతూరి విధ్యార్ధులు ఎవ్వరికీ చెప్పక రాజమండ్రి సినిమా కు వెళ్లిరి.రావూరివారు హస్ట లుతనిఖీకి వచ్చినప్పుడు సినిమాకి వెళ్ళినవారిని గుర్తించి నన్ను తీ సుకొనివెళ్ళి కినేమాహాలులోనున్నవారిని పట్టుకొని తీసుకొనివచ్చినారు.
ఆయనింట ప్రతిరోజూ వారికుటుంబ సభ్యులే కాక కనీసం ఐదుగురు భోజనం చేసేవారు .ఆరకముగా వారిద్వారా కళాశాలపండితులతో సామీప్యమేర్పడి నది.వారు అనేక అవధానములు చేసిరి.తద్వారా వచ్చినవి పేదవిధ్యార్ధులకు ఇచ్చేవారు.చోడేశ్వరశతకము మొదలగుగ్రంధములు రచించిరి.వారు విధ్యార్డులను కన్నా బిడ్డలుగచూచుకొనుచు విద్యాబోధన చేసేవారు.వారివలన భాషాప్రవీణ ,పండిత్ ట్రైనింగ్ పూర్తి చేసుకొంటిని.వారి అమ్మాయిని వివాహము చేసికోకపోయినా నాయందు పుత్రత్వము తో నుండిరి గాని ఏ నాడు కోపము గాని శత్రుత్వము గాని చూపలేదు.ఆవిధముగావారికి ,నాకు సఖ్యముకలదు.
No comments:
Post a Comment