Thursday, 21 March 2019

స్వామిజీ మహారాజు-2

                                            2పేజి 

స్వామీజీ మహారాజు వారు స్ధా పించిన మతము యొక్క సారాంశము 

1.ఆధ్యాత్మికసాధనలు 3    ---1.మానవశరీరములో ఆత్మస్ధానము వద్ద పవిత్ర నామమును స్మరణ చేయుట .

2.ఆయా త్మస్ధానము వద్దనే సంత్  సద్గురువు యొక్క పవిత్ర స్వరూపమును ధ్యానము చేయుట.  

3.శబ్దాభ్యాసము అనగా ఆత్మస్ధానము వద్ద లక్ష్యము నేకాగ్రము జేసిసచ్చిదానందతేజోరూపమగు చైతన్య శక్తి తో అనగాశబ్దధారతోనాంతర్యమున  సంయోగమేర్పరచుకొనుట . 

తప్పనిసరి కృత్యములు 

1.సంత్ సద్గురువు సేవ,మానవసేవ,పరమార్ధి ఈ సేవ చేసి సద్గురువుని దయాకటాక్షములను,ఆంగ్రంధములు తర్యసాయమును పొందవలయును. 

2.సత్సంగము  అనగా సంతు సద్గురువు యధ్యక్షతన జరుపబడు సామాజిక దైవ ప్రార్ధన.సత్సంగములో పవిత్ర   గ్రంథ పాఠ మును చేయుదురు .సద్గురువు అమృత వచనములను సెలవిచ్చుచుందురు.సంత్ సద్గురు సాంగత్య మహాలాభము గూడ చేకూరును .

     రాధాస్వామీమతములో  కర్మకాండ,బాహ్యాచారములు,మొదలగునవి   విధింపబడలేదు.జాతివర్ణములమూలమునపరస్పరభేదభావములు గూడనీమతములో పాటింపబడవు. ఈ మతములోని నీతిశాస్త్రమంతయు నీక్రింది సూత్రములలో నిండియున్నవి .

1.నీవితరులు నీ యెడలనెట్లు ప్రవర్తింపవలెనని గోరుదువో గోరుదువో నీ వితరులయెడలనట్లే ప్రవర్తించవలయును.

2.భగవంతుని సన్నిధానమునకు గొనిపోవునట్టి యూహలుపనులను శుభకర్మలు.

3.భగవంతుని వద్దనుండి దూరము జేయునట్టి కృత్యములు పాపకర్మలు.

పాటింపవలసిన నియమములు :-

1.ఈ మతమున  నుపదేశము గోరువారు మత్స్యమాంసములను ,గ్రుడ్లు మొదలగు జంతుసంబంధ మైన యాహారమును విసర్జించవలయును.

2.మద్యము మొదలగు మత్తుపదార్ధములను విసర్జించవలయును.

3.రాధాస్వామీ నామము పరమపితయొక్కనిజనామమని దృఢవిశ్వాసము కల్గియుండవలయును.

      స్వామీజీమహారాజు వారి ప్రధమ శిష్యులగు జీవన్  లాల్ ,మఱియు హుజూరు మహారాజుగారు .వేరు స్వామీజీ వారు ఆశువుగా జెప్పు శబ్దములను వ్రాసి తదుపరి అచ్చొత్తించిరి.అదియే సారబచన్  గ్రంధము.

సత్సంగము ప్రతిదినము జరుగుచు నన్నిజాతుల వారును, వర్ణములవారును సత్సంగమునకు వచ్చి స్వామీజీమహారాజు వారి వచనామృతమును గ్రోలుచుండెడివారు.వీరి కాల ములో 4000మందికిపైగా ఉపదేశములనుతీసుకొనిరి.స్వామీజీ మహారాజు వారు తమ నిర్యాణమునకు ముందు హుజూర్  మహారాజువారు తమతర్వాతగురువగుదురనితెలియబరిచిరి.వారు 1878సం|| జూన్15వతేదీన మధ్యాహ్నము 1గుంట 45నిమిషాలకు 60వ యేట భౌతికశరీరమును విడిచిరి.

స్వామీజీమహారాజువారు తమ నిర్యాణమునకు ముందు భక్తులకు "ఈ త చేతకానివాడు నీటిలో మునిగిపోవుచుండగా నాతనిని యీదుమని  జెప్పినను అతడప్పుడీత నేర్చుకొనజాలక మునిగిపోవును.కానీ చిన్నతనమునుండియు ఈత నేర్చినవాడు నట్టేటిలో పడిపోయిన నెన్నటికిమునిగిపోడు.మన భౌతికశరీరము చర్మముతో కప్పిన మాంసాస్ధికల శకలం.యావజ్జీవము నాధ్యాత్మిక సాధనల జేసినవానికి ఈ   ప్రపంచమును వీడిపోవునప్పుడు పరమపురుషుని పవిత్ర నామముతప్పక స్మృతికి వచ్చుఁను.కావున మానవులు పవిత్ర నామమును ప్రాపంచిక కృత్యములను చేసికొనునప్పుడును,ఇటునటు తిరుగుచున్నప్పుడును,గూడ మఱువకుండనెల్లప్పుడును స్మరణ చేయుచునే యుండవలయును.

           కావున ప్రతి సత్సంగీ పై వచనములనాచరణలో నుంచుకొనవలయునని మనవి.

Wednesday, 20 March 2019

                        పరమ గురు స్వామీజీ మహారాజ్ 

పరమ పురుష రాధాస్వామీ దయాళురు క్రీ .శ .1818సం వత్సరము  ఆగష్టు 24వ తేదీ సోమవారం రాత్రి 12-30గం టలకుఆగ్రాలోని ఫన్నీగల్లు  అను మొహల్లాలో జనించెను.వారి పూర్వనామము శ్రీ శివదయాల్  సింగ్ .వీరు ఖత్రికులమునకు చెందిన శేఠ్ దిల్వాల్ సింగ్ సాహెబ్ గారికి మొదటి కొడుకు,రెండవకొడుకు శే ఠ్  బృందావన్ ,మఱియు మూడవకొడుకు శేఠ్ ప్రతాపసింగ్ .వీరు గురునానక్ సాహెబ్ భక్తులు .వీరు సంతు తులసీసాహెబ్ వారి సత్సంగములో చేరిరి మాతాపితరులతోసహా .వీరు 5వ సంవత్సరంలోనే చదువు మొదలుపెట్టి గురుముఖీ భాషలనే గాక పర్షియన్ భాషనునేర్చుకొని యొక గ్రంధమునుకూడారచించిరి.సంస్కృతము,అరబిక్,హిందీ,ఉర్దూ భాషలలో ప్రావీణ్యము సంపాదించిరి.ఆయనవద్దకు అనేకమందివిద్యను గ్రహించిరి.

            వీరు చిన్నతనమునుండియే ఆధ్యాత్మిక సాధనలు సల్పుచు  తల్లి సాయమున తమ 6వ ఏటనుండియే ఆధ్యాత్మికాఅభ్యాసముచేయుచుండెడివారు..స్వామిజివారు పసితనమునుండియు,బడికివెళ్ళుసమయములోను పిన్నలకు.పెద్దలకు,తమతల్లిదండ్రులకు పరమార్థబోధన లు చేయుచు పరిపూర్ణోధ్ధారణమునుసాధించుటకుదోడ్పడు పంధానందరు నవలంబింపవలసినదని బోధించెడివారు. 

              వీరు చిన్నవస్సులోనే ఫరీదాబాదు నివాసియగు లాలా  ఇజ్జత్  రాయ్ గారి   కు మార్తె శ్రీమతినారాయణదేవిగారితో వివాహము జరిగెను.చదువు  పూర్తయిన తర్వాత ఉద్యోగములో జేరినను ఆధ్యాత్మికాభ్యాసనలకాటంకము కల్గుచుండుటచే మానివేసిరి.కానీ కుటుంబపోషణకై వారి మామగారు యొక రాజుగారి దివాణమున 2గంటలు పనిచేయు షరతుతో జేరిరి.వారికి లభించినదానిలో తమకవసరమణదానినియుంచుకొని మిగిలినది బీదసాదలకిచ్చెడివారు .

                                                                                         ఇట్లుండగా నొకనాఁడుతమతండ్రిమరణమాసన్నమైనదని యుద్యోగమునువదిలి తమతండ్రియొద్దకుబోయిరి. వీరు వెళ్లునప్పటికీ వారితండ్రిగారు యొకవివాహమునకు హాజరై తిరిగివచ్చిజబ్బుపడిరి .స్వామిజివారు సపర్యలుజేయుచు సంతుల పవిత్ర గ్రంధములనుండి శబ్దపఠనము చేసి గతించిపోవు నాత్మకు సహాయసంరక్షణలనిచ్చిరి.

             స్వామీ జి మహారాజువారు తమకుటుంబబాధ్యతలనుండి,ప్రాపంచికబాధ్యతలనుండియు విముక్తులై తమ కాలమునంతటిని యాధ్యాత్మిక సాధనలలోను,పరమార్ధ బోధన చేయుటలోను గడుపు చుండిరి.వారికి వేరే గురువు లేరు.అట్టి యవసరము కలుగలేదు.స్వేఛ్చచేపరమోన్నత ధామమునుండి దిగివచ్చిమానవ రూపమును ధరించిన పరమపురుషుని యవతారము.వారు తినునది 2ఔన్సుల ధాన్యపు దినుసులు మాత్రమే.కానీ వారు గంటలకొలది యుపన్యాసములనిచ్చు చు నందరిని యబ్బుర పరిచెడివారు.   కొందరి విశిష్ట వ్యక్తులకు ఆధ్యాత్మిక సాధనలనుపదేశించెడివారు .తమ ప్రధాన శిష్యులైన హుజూర్  మహారాజువారియొక్కయు,ఇతరభక్తులయొక్కయు ప్రార్ధనలకు మన్నించి సమస్త ప్రజలందఱకు సత్సంగమును క్రీ|| శ 1861 వతేదీవసంతపంచమీ సుదినమున తెఱచి నట్లుమహానుగ్రహముతో ఘోషణ చేసిరి.హుజూరుమహారాజు వారి ప్రార్ధనను తెలియబరుస్తు స్వామీజీమహారాజు వారొకశబ్దమును రచించిరి. 

సతగురుసే కరూ పుకారీ ,సంతన మత్ కీజె  జారీ 

            అప్పటినుండి పన్నీగల్లు లో అభ్యసనాది ఎల్లవే  ళలచేయుచుండగా భక్తుల సoఖ్య  పెరుగుచుండుటచే ఇప్పుడున్న రాధాబాగ్  అదే స్వామిబాగ్  కి  మార్చుట జరిగినది.తమదగ్గరకు వఛ్చిన వారి సందేహాలను,ఖండనలు వారడగకముందే వారికీ విడమరిచిచెప్పెడివారు..వారు నూతి దగ్గరనుండి జలమును తీసుకొనివెళ్లెడివారు.ఒకరోజు ఆ నూతి చుట్టూ పెద్దనగరము తయారగునని చెప్పిరి.అదే ఇప్పటి దయల్బాగ్ .

Monday, 18 March 2019

ullasam: భాస్కర శతకం

ullasam: భాస్కర శతకం:                                  భాస్కర శతకం  1.శ్రీ గల భాగ్య శాలి గడు                 జేరగ వత్తురు తారు దారెదూ  రాగమన ప్రయాసమున  ...