జన్మ యొక్క గొప్పతనము
జన్మయొక్క గొప్పతనము
మానవ జన్మ ఉత్తమ జన్మ మఱియు దుర్లభమైనది యని అందరికితెలియునుగదా !
జన్మలు3రకాలు 1.దేవజన్మ 2.మానవజన్మ 3.జంతు జన్మ.
జన్మలెలావచ్చును వాని ప్రత్యేకతలు గూర్చి తెలిసికుందాము.మానవుడు తనజీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు.ఆకర్మలకు ఫలితాలను
అనుభవిoచాలి .వానినే కర్మఫల్లలంటారు.అనేక జన్మలలో చేసిన కర్మ ఫలాలు ఆ జీవునితో బాటు వస్తాయి .అందులో పుణ్యకారణంగా కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు దేవలోకాల్లో దేవజన్మనెత్తుతాడు .అక్కడ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు.అది భోగభూమి.కనుకఅక్కడ అతడికి ఏకర్మలు చేసే అధికారములేదు.అందుచే పరమాత్ముని జేరుటకు తగిన కర్మలు చేసే అవకాశం అక్కడ లేదు.
తన కర్మఫలాన్ననుసరించి భోగాలననుభవించి ,ఆ కర్మ ఫలాలు క్షయం కాగానే క్షీణే పుణ్యే మ ర్త్యలోకం విశంతి. అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని,మానవలోకాన్ని చేరు కోవలసినదే .....
మరలా మరలా మానవజన్మనో ,జంతుజన్మనో ఎత్తవలసినదే ,ఈదే వజన్మలోకేవలం మనోబుద్ధులుంటాయి గాని కర్మజేయుటకు సాధనమైన స్ధూల శరీరముండదు.కాన భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మ కాదుదేవజన్మ.
ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడుజంతువులు,పశువులు,పక్షులు,క్రిములు,కీటకాలు మొదలగుజంతువులుగానీచయోనులందు జన్మిస్తాడు...
ఆజన్మలలో ఆకర్మఫలాకావున ల కారణంగా అనేకబాధలు,దుఃఖాలు అనుభవిస్తాడు.హింసింపబడతాడు.జంతుజన్మలలో కర్మలు జేస్తున్నట్లు కన్పించిన ఆకర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి ,స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనిచేసేవికావు.కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి. కానఇజన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్నిపొందే అవకాశము లేదు.కావున భగవాత్సాక్షా త్కారము నాకు ఈ జంతుజన్మ కూడా ఉపయోగపడదు .
ఇక పుణ్యపాపకర్మలఫలాలు మిశ్రమముగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవజన్మనెత్తటం జరుగును.ఈ జన్మలలో పుణ్యకర్మ ఫలాలు కారణముగా సుఖాలు,భోగాలు ,ఆనందం అనుభవిస్తాడు .పాపకర్మఫలాలకారణంగా దుఃఖాలు,బాధలు అనుభవిస్తాడు.84లక్షల జీవరాశులలోపుట్టి గిట్టినతర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవ జన్మ ...ఇట్టి అపురూపమైన ,దుర్లభమైన,ఉత్తమోత్తమమైన మానవజంమను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి అని శాస్త్రోవాచ.
పునర్విత్తం పునర్మిత్రమ్
పునర్భా ర్య పునర్మహి .
ఏతత్సర్వం పునర్లభ్యమ్
నా శరీరం పునః పునః ................పోయినధనం మళ్ళీ చేరుతుంది.దూరమైన మిత్రుడు మళ్ళీ దగ్గరౌతాడు .భార్య గతిస్తే మరొకభార్యలభిస్తుంది .భూసంపద మళ్ళీ లభిస్తుంది.పోయినవన్ని మళ్ళీ తిరిగి రాబట్టుకోవచ్చు.కానమానవశరీరం మాత్రం మళ్లి మళ్ళీ తిరిగిరాదు.శరీరం ఖలు ధర్మసాధనం అని పెద్దలన్నారు .
శరీరముంటేనే ...ధార్మికపనులు చేయవచ్చు,నాలుగుమంచిపనులు చేయవచ్చు,హితవాక్యాలితరులకు చెప్పవచ్చు ,ఏపనైనా చేయవచ్చు,బుధ్ధి,ఆలోచన,మాట్లాడే శక్తి కావలసినది సంపాదించుకొనే జ్ఞానం తగినావయవనిర్మాణం ఉండేది ఒక్క మానవులకే .
జంతువులకు శరీరం ఉంటుంది కానీ వానికి ఆలోచన ఉండదు.పైగా ఏకొద్దోగొప్పో ఆలోచనకల్గిన దాని అమలు చేయుటకు శరీరం సహకరించదు.మనము అతిగా తిన్నా ,ఆలోచించినా,సుఖించినా,దుఃఖించినా,ఏదైనా అతిగా చేసినా శరీరము కాస్తపుటుక్కుమంటుంది.శరీరముపోతే మనము చేసేదేమీలేదు.కాన మనశరీ రమును సంరక్షించుకొనుచు విస్తరాకునుపయోగించుకొని బయట పారేసినట్లు,మనశరీరంలో ఊపిరి పోగానే బయటపరేసివస్తారు.విస్తారాకుకు ఒకరికీ ఉపయోగపడినానని సంతోశించునట్లుగా మనమితరులకుసాయపడుచు సేవచేసికొనుచు సార్ధకతను సంపాదించుట ప్రతి మానవుని కర్తవ్యము.
No comments:
Post a Comment