ullasam
Thursday, 4 May 2023
Wednesday, 3 May 2023
జీవిత సత్యం
జీవిత సత్యం
మనుజుడుభగవత్సన్నిథికి చేరాలంటే అత్యాశకు పోరాదు.ఆనందమైనజీవితాన్నికోరుకోవడంసహజం.అందుకైప్రతీవారుయత్నిస్తుంటారు.అందుకుతన ఆశకు పరిమితులను ఏర్పరచుకోవాలి.ఉన్నదానితోసంతృప్తిచెందాలి.లేకుంటేమనిషికిఆనందముఉండదు.భగవద్గీతలో శ్రీకృష్ణుడు
యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతోవిమత్సరః
సమః సిద్ధావసిద్హౌ చ
కృత్వాపిననిబధ్యతే
తనకు దక్కిన దానితో సంతోషపడ్డారు ప్రతివ్యక్తి నేర్చుకోవాలి.అత్యాశలేని వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు.ఉ!!అరణ్యాలలో ఉండే ఋషులు సంతృప్తి అనేసంపదతోభౌతిక సంపదలు వాని చాలాసంతోషంగాజీవించారు.సంతృప్తి ఆథ్యాత్మిక ముగా ఎదగ డానికి అవసరం.పైగామానవుడు తన దేహము అశాశ్వతమైన నదియు,ఎముకలగూడుపై కప్పపడిన మాంసపు ముద్ద దేహమనియు తెలిసి కూడా దానికోసం ఎన్నో నేరాలు హత్యలు చేస్తూ జన్మలు జన్మలు వేలు,లక్షల వృథా చేసుకుంటున్నాడు.
అసలు నాశము లేనిశాశ్వతనిత్యసత్యమగు ఆత్మజ్ఞానాన్ని పెంచుకొనేయత్నంచేయాలి.అదేమోక్షంగదా.ఆఆత్మజ్ఞానం ఒక్కటేమనిషికి ముక్తినికల్గిస్తుంది.అందుకు మౌనం, ధ్యానం, శాకాహారం మాత్రమే.
Thursday, 20 April 2023
థనమున్నాసుఖములేదు
*మైక్రో సాఫ్టు అధినేత సత్యానాదెళ్ళ గారు వేల కోట్లు సంపాదించారు. కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉండి వీల్ ఛైర్ కు మాత్రమే పరిమిత మైన కొడుకు ఉండేవాడు.అతను దాదాపు 25సంవత్సరాలపాటు అలాగే జీవించి ఇటీవలే మరణించాడు.మరి వారికి వచ్చి న ఈ దురదృష్టం ఎందరికి తెలుసు?*
*అలాగే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు వేలకోట్లు సంపాదించారు.వారికి మానసిక వికలాంగుడైన కొడుకు ఉండేవాడు.అతనికి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశాడు. కానీ అది కూడా ఫలించలేదు.*
*మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కూడా వందల కోట్ల ధనము సంపాదించాడు. అయినా గానీ వారిమొదటి భార్య చనిపోతే ప్రేమ తో పట్టెడు అన్నం పెట్టే వాళ్లు లేరు. అలాగని రెండో పెళ్ళి చేసుకుంటే కుటుంబ కలహాలతో పదవీ చ్యుతుడై మనస్తాపం తో చనిపోయాడు.*
*రేమండ్సు అధినేత విశ్వపతి సింఘానియా తన స్వశక్తితో రేమండ్సు కంపెనీ ని బాగా అభివృద్ధి చేశాడు వేలకోట్ల ఆస్తులను తన పుత్ర రత్నానికి బహుమతి గా ఇచ్చాడు. ఇంత చేస్తే ఆ పుత్రుడే వారిని తమ ఇంటి నుంచి బయటకు గెంటేశాడంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. ?*
*మనము ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. మనము ధర్మ మార్గం లో జీవిస్తూ ఉండటం ముఖ్యం. మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మంచి సంస్కారం అందించాలి. ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చి న డబ్బు ను ఆస్తులను ఒక ధర్మ కర్త వలె ఖర్చు పెట్టాలి.అప్పుడే ఆ డబ్బు సుఖమును తృప్తి ని ఇస్తుంది. ఇలా తృప్తి సుఖము ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎంత సంపాదించాము అనేది ముఖ్యము కాదు.*
*ఇలా ఎంతో మంది ధనికులు చాలా బాధలు పడ్డారు.*
*డబ్బు తనతో పాటు కొంత చెడును కూడా తీసుకుని వస్తుంది. డబ్బు ఉంటే అహంకారం వస్తుంది. ఆ అహంకారమే అన్ని అనర్థాలకు మూలకారణం అవుతుంది.*
*ఇలా ప్రతివారికీ ఏవో దురదృష్టం కూడా ఉంటుంది. కావున ఇతరుల ఆస్తులను గూర్చి అసూయ పడ కూడదు.*
*ఎంత చెట్టు కు అంత గాలి ఉంటుంది. ఈ విషయం మరచిపోకూడదు.*
*మనకు ఉన్న దానితో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి.*
*మనకు మంచి ఆకలి వేస్తూ ఉండటం, ఆకలివేసినపుడుమంచి భోజనం, మంచి నిద్ర, ఒక ఇల్లు, సంఘంలో గౌరవ ప్రదమైన జీవితం జీవిస్తూ ఉంటే మనము చాలా ధనవంతులము, అదృష్ట వంతులము కూడా. దానికి తోడు ప్రశాంతమైన,ధర్మ మార్గం లో జీవనం. ఇవి ఉంటే అన్నీ ఉన్నట్లే.*
*ఎవరికీ ఎప్పుడూ సుఖాలు ఉండవు. సుఖపడినవారు కష్టాలు పడతారు. కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది. కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. ఈ అవకాశం చాలా మంది ధనవంతులకు లేదు గదా.*
*ఏ కష్టాలు లేని వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రాగలరా? ప్రయత్నించి చూడండి.*
*ఇలా అసూయ పడతారనే శేషప్ప కవిగారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు.*
*తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు*
*వెళ్ళి పోయెడినాడు వెంటరాదు*
*లక్షాధికారైన లవణమన్నమె గాని*
*మెండుబంగారంబు మింగబోడు.*
*ఏ వస్తువు అయినా తాత్కాలికంగా సుఖమును ఆనందమును ఇస్తుంది. సుదీర్ఘ కాలములో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది. కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి. ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అదికూడా అశాంతికి దారితీస్తుంది.*
*మన కోరిక లే అన్ని దుఃఖాలకు మూలకారణం అని బుధ్ధుడు ఎప్పుడో చెప్పాడు. తక్కువ కోరిక లతో తృప్తిగా హాయిగా సమాజం లో గౌరవప్రదంగా జీవించడం చాలా అదృష్టం.*
" సర్వే జనా సుఖినో భవన్తు"*మైక్రో సాఫ్టు అధినేత సత్యానాదెళ్ళ గారు వేల కోట్లు సంపాదించారు. కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉండి వీల్ ఛైర్ కు మాత్రమే పరిమిత మైన కొడుకు ఉండేవాడు.అతను దాదాపు 25సంవత్సరాలపాటు అలాగే జీవించి ఇటీవలే మరణించాడు.మరి వారికి వచ్చి న ఈ దురదృష్టం ఎందరికి తెలుసు?*
*అలాగే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు వేలకోట్లు సంపాదించారు.వారికి మానసిక వికలాంగుడైన కొడుకు ఉండేవాడు.అతనికి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశాడు. కానీ అది కూడా ఫలించలేదు.*
*మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కూడా వందల కోట్ల ధనము సంపాదించాడు. అయినా గానీ వారిమొదటి భార్య చనిపోతే ప్రేమ తో పట్టెడు అన్నం పెట్టే వాళ్లు లేరు. అలాగని రెండో పెళ్ళి చేసుకుంటే కుటుంబ కలహాలతో పదవీ చ్యుతుడై మనస్తాపం తో చనిపోయాడు.*
*రేమండ్సు అధినేత విశ్వపతి సింఘానియా తన స్వశక్తితో రేమండ్సు కంపెనీ ని బాగా అభివృద్ధి చేశాడు వేలకోట్ల ఆస్తులను తన పుత్ర రత్నానికి బహుమతి గా ఇచ్చాడు. ఇంత చేస్తే ఆ పుత్రుడే వారిని తమ ఇంటి నుంచి బయటకు గెంటేశాడంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. ?*
*మనము ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. మనము ధర్మ మార్గం లో జీవిస్తూ ఉండటం ముఖ్యం. మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మంచి సంస్కారం అందించాలి. ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చి న డబ్బు ను ఆస్తులను ఒక ధర్మ కర్త వలె ఖర్చు పెట్టాలి.అప్పుడే ఆ డబ్బు సుఖమును తృప్తి ని ఇస్తుంది. ఇలా తృప్తి సుఖము ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎంత సంపాదించాము అనేది ముఖ్యము కాదు.*
*ఇలా ఎంతో మంది ధనికులు చాలా బాధలు పడ్డారు.*
*డబ్బు తనతో పాటు కొంత చెడును కూడా తీసుకుని వస్తుంది. డబ్బు ఉంటే అహంకారం వస్తుంది. ఆ అహంకారమే అన్ని అనర్థాలకు మూలకారణం అవుతుంది.*
*ఇలా ప్రతివారికీ ఏవో దురదృష్టం కూడా ఉంటుంది. కావున ఇతరుల ఆస్తులను గూర్చి అసూయ పడ కూడదు.*
*ఎంత చెట్టు కు అంత గాలి ఉంటుంది. ఈ విషయం మరచిపోకూడదు.*
*మనకు ఉన్న దానితో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి.*
*మనకు మంచి ఆకలి వేస్తూ ఉండటం, ఆకలివేసినపుడుమంచి భోజనం, మంచి నిద్ర, ఒక ఇల్లు, సంఘంలో గౌరవ ప్రదమైన జీవితం జీవిస్తూ ఉంటే మనము చాలా ధనవంతులము, అదృష్ట వంతులము కూడా. దానికి తోడు ప్రశాంతమైన,ధర్మ మార్గం లో జీవనం. ఇవి ఉంటే అన్నీ ఉన్నట్లే.*
*ఎవరికీ ఎప్పుడూ సుఖాలు ఉండవు. సుఖపడినవారు కష్టాలు పడతారు. కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది. కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. ఈ అవకాశం చాలా మంది ధనవంతులకు లేదు గదా.*
*ఏ కష్టాలు లేని వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రాగలరా? ప్రయత్నించి చూడండి.*
*ఇలా అసూయ పడతారనే శేషప్ప కవిగారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు.*
*తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు*
*వెళ్ళి పోయెడినాడు వెంటరాదు*
*లక్షాధికారైన లవణమన్నమె గాని*
*మెండుబంగారంబు మింగబోడు.*
*ఏ వస్తువు అయినా తాత్కాలికంగా సుఖమును ఆనందమును ఇస్తుంది. సుదీర్ఘ కాలములో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది. కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి. ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అదికూడా అశాంతికి దారితీస్తుంది.*
*మన కోరిక లే అన్ని దుఃఖాలకు మూలకారణం అని బుధ్ధుడు ఎప్పుడో చెప్పాడు. తక్కువ కోరిక లతో తృప్తిగా హాయిగా సమాజం లో గౌరవప్రదంగా జీవించడం చాలా అదృష్టం.*
" సర్వే జనా సుఖినో భవన్తు"1601. 2-1. 210423-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀474..830
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*తాము లోకంలోకి వచ్చిన తర్వాత తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే లోకంలో ఏ విశేషమూ, ఏ అంశమూ తమకు సంబంధించినది కాదు అని.*
*వెళ్ళేటప్పుడు ఏ లోక సంబంధమైన అంశాన్నీ తీసుకు వెళ్ళలేము అని.*
*కాని లోకంలో ఉన్నంతసేపు తాము ఉపయోగించుకున్న ఈ ప్రకృతి తమదే అని వ్యక్తి భావన చేస్తున్నాడు. దానిపై అభిమానాన్ని పెంచుకుంటున్నాడు.*
*దాచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అధికంగా అనుభవించాలని వేరు వేరు యంత్రాలను తయారు చేసుకుని ఈ ప్రకృతిని ఇబ్బంది పెడుతున్నాడు.*
*ఈ ప్రపంచం తాము వినియోగించుకుని వదిలి పెట్టి వెళ్ళిపోయే అద్దె ఇంటి వంటిదని భావించిన వానికి ఇబ్బందులు ఉండనే ఉండవు. కాని ఈ రకమైన ఆలోచనా పరిధికి అందరూ దూరంగానే ఉంటారు.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*
Friday, 14 April 2023
మంచి _చెడు
మంచి -చెడు
ఇతర జీవులకంటే మానవ జీవితం విలక్షణమైనది.అందుచేతనే మానవునకు భావవ్యక్తీకరణ,ఆలోచనలతో బాటు కష్టసుఖాలు,మంచి చెడులు మున్నగునవి ఉంటాయి.
మంచి చెడు :-నేడు ఈ ప్రపంచాన చేదుకున్న విలువ మంచికి లేకపోవచ్చు.కానీ మంచివారికి ఉన్న విలువ మాత్రం చెడ్డవారికి ఉండదు.తన మిత్రుడు దొంగ ఐనా కూడా తప్పురా అని చెప్పలేకపోవచ్చు.,అలా అని తన ఇంట్లో కూర్చుo డబెట్టుకొని బంధుత్వం కలుపుకొనునా !లేదు కదా.ఎన్ని జరిగినా చివరికి ప్రపంచం మంచి వైపే నిలబడుతుంది.మంచినే అంగీకరిస్తుంది .కాన మంచినే ఎల్లప్పుడు మంచినే చెయ్యాలి.మంచినే ఆశ్రయించాలి .భగవంతుడు చూపే మార్గం కూడా మంచివైపే.కాన చెడును చూడకు.మంచిని వీడకు.ఏనాటికైనా నీకు రావాల్సింది దక్కాలంటే అది మంచి మార్గంలోనే అని మఱువకూడదు.
కష్టసుఖాలు :-కష్టసుఖాలు కావడికుండలు --ఇవి కాలాలువంటివి.నువ్వు వద్దనుకున్నా సరే నీ కర్మ ప్రకారం వచ్చి అవి ఉండక్లిగినంతకాలం ఉంది వెళ్ళిపోతాయి .దానిని నువ్వు అడ్డుకోలేవు .ఆపనూలేవు.ఏదైనా చేయగ ల్గావంటేఒక్కటే!వచ్చిపోయే ఈ కష్టనష్టాలు గురించి పట్టించుకోకుండా పరమాత్మను గట్టిగా పట్టుకో .ఇవి ఒకదానివెంట ఒకటి క్రమక్రమంగా వచ్చిపోతుంటాయి.నీవి చేయవలసినది ఏమనగా చేయాల్సినపనులను దోషము లేకుండా చేసుకో .నిన్ను ఏ కర్మ ఫలం కూడా ఏమీ చేయలేదు.
Tuesday, 11 April 2023
మూడు మూడు మూడు
మూడు మూడుమూడు
మన జీవితంలో క్రింది విషయాలు లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
1.నిన్నునీవుపోగడుకొనుట.2.పరనింద3.ఇతరుల దోషాలను ఎంచుట.
**ఈ మూడింటిని ఎల్లప్పుడూజ్ఞాపకం ఉంచుకో .
1.ఈశ్వరస్మరణ
2.పరులనుగౌరవించుట.
3.నీలోనిదోషలనుకనిపెట్టుట.
***ఈ మూడింటిని ఆచరించు.1.సత్యము,2.అహింస3.ప్రేమతత్త్వము.
*ఈమూడింటికిదూరంగాఉండు.
1.ఇతరులగూర్చిచర్చ
2.వాదవివాదాలు
3.నాయకత్వం
**ఈ మూడింటి యందు దయతో ఉండవలెను.
1.అబల2.పిచ్చివాడు
3.దారి తప్పినవాడు.
**ఈమూడింటియందు దయతో నుండకు.
1.పాపము2.బద్ధకము.
3.స్వేచ్ఛాప్రవర్తన
**ఈ మూడింటిని నీవశం చేసుకోవాలి.
1.మనసు2.కామేంద్రియం3.నాలుక.
**ఈమూడింటియందు మమకారం కల్గియుండు.
1.ఈశ్వరుడు2.సదాచారము3.పేదలు
**ఈ ముగ్గురు పట్ల వినయంతో ఉండు.
1.తల్లి2.తండ్రి3.గురువు
**ఈ మూడింటిని నీ మదిలో ఉంచుకోవాలి.
1.దయ2.క్షమ3.వినయము.
**ఈమూడు వ్రతాలు పాటించు
1.పరస్త్రీనిమోహించకుండుట2.పరధనాసక్తిలేకుండుట.3.అసహాయులకు సేవ చేయుట.
**వీరి యందు ప్రత్యేక శ్రద్ధ జూపు.
1.వితంతువు2.అనాధలు3.నిరాధారులు.
***వీటిని లెక్క చేయవద్దు
1.ధర్మాన్నిపాటించేసమయంలోకల్గేకష్టము
2.పరులకష్టాన్నితొలగించేటప్పుడుకల్గేధననష్టాన్ని
3.రోగికిసేవచేయునప్పుడు శరీరానికి కలిగే కష్టాన్ని.
** బాగా పోషించిడంనీకర్తవ్యం!
1.తల్లిదండ్రులు2.భార్యాబిడ్డలు3.దుఃఖములోనున్నవారు.
**వీటిని మరచిపో
1.నీవితరులకుచేసినసాయం2.ఇతరులునీకుచేసినకీడు3.డబ్బు,గౌరవం,సాధనాలు వల్ల సమాజంలో నీకుకల్గిన ఉన్నతస్థితి
**ఈవిధంగా మారకు
1.కృతఘ్నుడు2.డాంబికుడు3.నాస్తికుడు.
ఏ విద్యనభ్యసించాలన్నా , మనపెద్దలు3మెట్లసోపానాన్నిఎక్కాలనిసూచించిరి.
1.శ్రవణం2.మననం3.నిధిధ్యాసనఫలితంగాకలిగేదిసాక్షాత్కారం.ఆధ్యాత్మికవిద్యనభ్యసించడానికిపైవానినిఅనుసరించుటయుక్తము.శ్రవణమనగాగురువులుచెప్పేదిశ్రద్ధగావినడంద్వారాజ్ఞానముపొందవచ్చును.కేవలంవినుటయేగాక విన్న దానిని మరింత లోతుగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేయడం,ఆస్వాదించడం,కూలంకషంగా నెమరు వేసుకొనిఏర్పాటుచేయాలి.విన్నదాన్నిమననంచేసాక సారాంశము పై కొంతసేపు ధ్యానం చేయాలి.అప్పుడువిన్నది,చదివినదిమనశరీరవ్యవస్థలోజీర్ణమైఆజ్ఞానముమనస్వంతమగును.ఆవధంగామనలోనంతర్భాగమైమనకక్కరవచ్చినప్పుడుపయోగపడేవిధంగాఉంటుంది.మంచిచెడులనుయోచించిసాధువర్తనంతోజీవనగమనాన్నికొనసాగించాలి.మనోవాక్కాయకర్మల్నిభగవంతునిపైకేంద్రీకరిస్తేఆధ్యాత్మికతపుడుతుంది.ధర్మచింతనతోఅలుపెరుగనిబాటసారిగాఆధ్యాత్మికమార్గంలోపయనిస్తేసార్ధకమగును.అదేమహాప్రస్ధానం.జీవితాన్నిమలుపుతిప్పేదివ్యసోపానం.
@@&&@@
మానవ జీవితం విశిష్టత
మానవ జీవితం
ఇదిభగవంతుడిచ్చినవరం.దీనిని సుఖవంతంగా మలచుకోవడం మన బాధ్యత.ఈజీవిత చదరంగంలో కల్గే బాధలకు మనమే కారణం.అవన్నీదేవుడుచేసాడనుకోవడం చాలా పొరబాటు.పరిష్కారంలేని సమస్య అంటూ ఏదీ లేదు.రోజులోకొంచెం సమయం దైవం కోసం కేటాయించు.నీమనసునుదైవానికిసమర్పించు.అలాగేమనంమనదగ్గరనున్న వాటితో సరిపెట్టుకుంటే ప్రతీ చోటాస్వర్గమే.లేనిదానికోసంఆరాటపడుతూవేసేప్రతీ అడుగు నరకమే.ఒక్కోసారి మన నిజాయితీ,ధైర్యం, తెలివితేటలు ఇవేవీ మనల్ని గెలిపించ లేకపోయినా మన ఓర్పు, సహనంమాత్రమేమనల్ని గెలిపించగలవు.మనం చేసే పనిని అందరూ స్వీకరించక పోయిన, అవసరం, అర్హత ఉన్న వారు స్వీకరిస్తారు.మనదగ్గరేముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరు ఉన్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను మర్చిపోయేలాచేస్తుంది. .మనఆత్మాభిమానం మునకు ముఖ్యం.అది ఎప్పుడూ అంత ఎత్తులో ఉండాలి.ఒకరుచులకనచేసారని ఎప్పుడూ అనుకోకూడదు.ఎవరిస్థాయి వారిదే.
మానవునికిరోగంకల్గించేది..పాపం.భోగంకల్పించేది .. పుణ్యం
భవిష్యత్తునిర్ణయించేది..కర్మ..లాభంకలిగించేది...సేవ.సంపాదననిల్పేది . పొదుపు.విలువ పెంచేది..దానం.నష్టం కల్గించేదిహింస.అశాంతికల్గించేది..ఆశ.శాంతికల్గించేది.తృప్తి.దుఃఖంకల్గించేది..కామం.పతనంచేసేది...అహంకారం..మానవునకుఅందరినిదగ్గరచేసేదిప్రేమైతేదూరంచేసేది అసూయ.మానవునిస్థితినిసూచించేది.గుణం, దైవంగా మార్చేది..దయ.
ఆత్మ స్థితిని తెల్పేది.వాక్కు.విజయం చేకూర్చేది..ధర్మం,గొప్పవానిగాచేసేది. జ్ఞానం, ముక్తి నిచ్చే రాహిత్యం.మానవుని అన్నిరకాల సంస్కరించే ది స్మరణ ధ్యానములు.అందుకేప్రతీమానవుడుభగవంతునినామస్మరణచేస్తూథ్యానమునభగవద్దర్శనమును పొందుట ఆవశ్యకం.
Tuesday, 28 March 2023
ఆత్మను తెలుసుకోవడం ఎలా
ఆత్మను తెలుసుకోవడం
ఆత్మను తెలుసుకోవడం మానవజాతికేసాథ్యమగును.అందులకైమూడు కార్యములను ఆచరించాలి.
1.శ్రవణదర్శనాలు2.మననము(స్మరణ)3.నిధిధ్యానము.
1.శ్రవణదర్శనాలు:-ఇంద్రియాలతోజగత్తుయొక్కయధార్ధ జ్ఞానమును,శ్రవణచక్షురింద్రియములచేపొందవలెను.
2.మననము:-తర్కముచే,నింద్రియములకతీతమగువిషయాలనుచింతించియథార్ధజ్ఞానమునుసంపాదించాలి.
3.నిదిథ్యాసము:-శ్రవణ,దర్శనం,మననములవలన గల్గిన జ్ఞానమును ఆత్మచే గ్రహించడం చేయాలి.దీనినేశ్రద్ధ లేక విశ్వాసమందురు.నిదిథ్యాసమనగాఅనుభవపూర్వకముగాగ్రహించుట.మననము గావింపచేయుట తర్కము యొక్క పని.ఆత్మ క్షేత్రమునకు తర్కము ప్రవేశింప వలదు.అట్లుజరిగినకుతర్కమనబడును.ఆకుతర్కము మనుజుని శ్రద్థా విశ్వాసము లనుండి తొలగించ గలదు.అంతఃకరణకార్యమునుగమనింపుడు.
అంతఃకరణ కార్యం:-మస్తిష్కమునకుపై భాగమున నిచ్ఛాశక్తి యుండి తనకార్యమును సాగించును.దీనికికొంచెము క్రిందుగా, మస్తిష్కముపై మేధావీ బుద్ధి యుండును.దానికి క్రిందమస్తిష్కమధ్యమున తార్కికబుద్ధికాలేదు.మస్తిష్కముక్రిందిభాగము, మనో సంబంధమైన సందేశతంతువులస్ధానముండును.హృదయము పైనమనసుగలదు.హృదయముమరియునాభిమధ్యనచిత్తముండును.దీనికిక్రిందినసూక్ష్మప్రాణములుండును.ఈఅంతఃకరణాలతోనిచ్ఛాశక్తి(నిశ్చాశక్తి)పని చేయును.బుద్ధితో
జ్ఞానముమరియుతర్కపూర్ణవిచారము,మనస్సుతోనింద్రియములవ్యాపారము,చిత్తముతోనుద్రేకాదులు,మరియుప్రాణాలతో భోగ కార్యములు గావించబడును.అంతఃకరణ కార్యములు సరిగా జరిగినప్పుడు ఇచ్ఛాశక్తి యొక్క కార్యములో నాటంకాలు కల్గి శక్తివికాస, వృద్ధులు గాంచును.ఇవన్నీ ఆత్మకు యంత్రాంగములవంటివి.ఇచ్ఛాశక్తి విద్యుత్ వంటిది(గతిశక్తి). ఈకార్యక్రమంలో కల్గు ఆటంకాలు....
1.సూక్ష్మప్రాణములు, ఇంద్రియవ్యాపారములగు భావవిచారములలో జోక్యంకల్గించుకొన్నప్పుడు,మనుజుడుకోరికలకు దాసుడగును.
2.చిత్తము,ఇంద్రియవ్యాపారములలోసంబంధము పెట్టుకొన్న భావుకత వృద్ధిచెందిమనోబుద్ధులు
నిష్క్రియములగును.
3.మనసుబుద్ధి యొక్క కార్యములోజోక్యముగొన్నమనుజుడుఇంద్రియాదులజ్ఞానమునువిచారించలేడు.ఇంద్రియజ్ఞానము తోనాతడుభ్రమాదులనెరుంగకనిర్ణయంగావించుచుండును.
4.ఇటులనే తర్కము కల్పనాస్మృతులయొక్కయు, మేధావి బుద్ధి యొక్కయుకార్యములలోజోక్యంగల్పించుకొన్నచోమనుజుడుకుతర్కాలుగలవాడై విజ్ఞానము,శ్రద్ధ,మరియువిశ్వాసములనుండి విముఖుడై యుండి అనుమానాదులలో చిక్కు కొనును.
5.బుద్ధి, ఇచ్ఛాశక్తి పనిలో సంబంధం పెట్టుకున్నచో నాత్మ పరమాత్ముల నైక్యమొనర్చు శక్తి నుండి మనుజుడువంచితుడగును.
6.అల్పజ్ఞతవలన కూడా విఘ్నముకల్గును.దానివలనమానవునిలోసందేహము,అసఫలత మున్నగు స్వభావములేర్పడును.ఇదిశక్తి, వికాసము లో గొప్పఆటంకంకల్గించును.మనోబుద్ధి చిత్తాదులు తమతమ సీమలలో పనిజేయుచునితరులతో సంబంధంపెట్టుకొనకుండా యున్నచోమానవుడు శ్రద్ధా తర్కములచే లాభం పొందగలడు.
@@@@@@