Tuesday, 28 March 2023

ఆత్మను తెలుసుకోవడం ఎలా

 ఆత్మను తెలుసుకోవడం

ఆత్మను తెలుసుకోవడం మానవజాతికేసాథ్యమగును.అందులకైమూడు కార్యములను ఆచరించాలి.

1.శ్రవణదర్శనాలు2.మననము(స్మరణ)3.నిధిధ్యానము.

1.శ్రవణదర్శనాలు:-ఇంద్రియాలతోజగత్తుయొక్కయధార్ధ జ్ఞానమును,శ్రవణచక్షురింద్రియములచేపొందవలెను.

2.మననము:-తర్కముచే,నింద్రియములకతీతమగువిషయాలనుచింతించియథార్ధజ్ఞానమునుసంపాదించాలి.

3.నిదిథ్యాసము:-శ్రవణ,దర్శనం,మననములవలన గల్గిన జ్ఞానమును ఆత్మచే గ్రహించడం చేయాలి.దీనినేశ్రద్ధ లేక విశ్వాసమందురు.నిదిథ్యాసమనగాఅనుభవపూర్వకముగాగ్రహించుట.మననము గావింపచేయుట తర్కము యొక్క పని.ఆత్మ క్షేత్రమునకు తర్కము ప్రవేశింప వలదు.అట్లుజరిగినకుతర్కమనబడును.ఆకుతర్కము మనుజుని శ్రద్థా విశ్వాసము లనుండి తొలగించ గలదు.అంతఃకరణకార్యమునుగమనింపుడు.

అంతఃకరణ కార్యం:-మస్తిష్కమునకుపై భాగమున నిచ్ఛాశక్తి యుండి తనకార్యమును సాగించును.దీనికికొంచెము క్రిందుగా, మస్తిష్కముపై మేధావీ బుద్ధి యుండును.దానికి క్రిందమస్తిష్కమధ్యమున తార్కికబుద్ధికాలేదు.మస్తిష్కముక్రిందిభాగము, మనో సంబంధమైన సందేశతంతువులస్ధానముండును.హృదయము పైనమనసుగలదు.హృదయముమరియునాభిమధ్యనచిత్తముండును.దీనికిక్రిందినసూక్ష్మప్రాణములుండును.ఈఅంతఃకరణాలతోనిచ్ఛాశక్తి(నిశ్చాశక్తి)పని చేయును.బుద్ధితో

జ్ఞానముమరియుతర్కపూర్ణవిచారము,మనస్సుతోనింద్రియములవ్యాపారము,చిత్తముతోనుద్రేకాదులు,మరియుప్రాణాలతో భోగ కార్యములు గావించబడును.అంతఃకరణ కార్యములు సరిగా జరిగినప్పుడు ఇచ్ఛాశక్తి యొక్క కార్యములో నాటంకాలు కల్గి శక్తివికాస, వృద్ధులు గాంచును.ఇవన్నీ ఆత్మకు యంత్రాంగములవంటివి.ఇచ్ఛాశక్తి విద్యుత్ వంటిది(గతిశక్తి). ఈకార్యక్రమంలో కల్గు ఆటంకాలు....

1.సూక్ష్మప్రాణములు, ఇంద్రియవ్యాపారములగు భావవిచారములలో జోక్యంకల్గించుకొన్నప్పుడు,మనుజుడుకోరికలకు దాసుడగును.

2.చిత్తము,ఇంద్రియవ్యాపారములలోసంబంధము పెట్టుకొన్న భావుకత వృద్ధిచెందిమనోబుద్ధులు

నిష్క్రియములగును.

3.మనసుబుద్ధి యొక్క కార్యములోజోక్యముగొన్నమనుజుడుఇంద్రియాదులజ్ఞానమునువిచారించలేడు.ఇంద్రియజ్ఞానము తోనాతడుభ్రమాదులనెరుంగకనిర్ణయంగావించుచుండును.

4.ఇటులనే తర్కము కల్పనాస్మృతులయొక్కయు, మేధావి బుద్ధి యొక్కయుకార్యములలోజోక్యంగల్పించుకొన్నచోమనుజుడుకుతర్కాలుగలవాడై విజ్ఞానము,శ్రద్ధ,మరియువిశ్వాసములనుండి విముఖుడై యుండి అనుమానాదులలో చిక్కు కొనును.

5.బుద్ధి, ఇచ్ఛాశక్తి పనిలో సంబంధం పెట్టుకున్నచో నాత్మ పరమాత్ముల నైక్యమొనర్చు శక్తి నుండి మనుజుడువంచితుడగును.

6.అల్పజ్ఞతవలన కూడా విఘ్నముకల్గును.దానివలనమానవునిలోసందేహము,అసఫలత మున్నగు స్వభావములేర్పడును.ఇదిశక్తి, వికాసము లో గొప్పఆటంకంకల్గించును.మనోబుద్ధి చిత్తాదులు తమతమ సీమలలో పనిజేయుచునితరులతో సంబంధంపెట్టుకొనకుండా యున్నచోమానవుడు శ్రద్ధా తర్కములచే లాభం పొందగలడు.

@@@@@@

Saturday, 18 March 2023

భారతంలో చిన్నకధలు

               యోగము _ప్రాణాయామము 

సాంఖ్యము కలుగు జ్ణానము యోగముతో కలిగే బలమూ రెండూ సాటిలేనివి.కొంతమంది సాంఖ్యము యోగము వేరు వేరు అంటారు.కానీ రెండూ ఒకటే .మనోధారణ ప్రాణాయామము అనేవి రెండు ప్రధానయోగములు.మొదటిది నిర్గుణము రెండవది సగుణము .మనోధారణ అనగా మనస్సును ఏకాగ్రత గా ఉంచడము.ప్రాణాయామము అనగా శ్వాసను క్రమ పద్ధతిలో వదలి పీల్చడం .ఇది మానవునకు అసౌకర్యము కల్గించదు.క్రమ పద్ధతిలో ప్రాణాయామము చేస్తూ ఇంద్రియములనదుపు లో ఉంచుకున్నవాడు యోగసిద్ధిపొందగలడు.ప్రాణాయామము చేసే సాధకుడు  నియమనిష్ఠలు పాటించాలి .ప్రాణాయామమునకు రోజూ కొంత సమయము పాటించాలి.శరీరమునకు అసౌకర్యము కలుగని రీతిలో ప్రాణాయామము అభ్యసించాలి.ఇలా ప్రాణాయామము పగలు ,రాత్రి అభ్యసించాలి.దీనివలన లోపలి వెలుపలి శరీరము శుద్ధి పొందుతుంది.

యోగసిద్ధికి ప్రాణాయామము 

దానివలనకల్గే అంతః బాహ్య శుద్ధి మూలము.ఇది సగుణతంత్రము.మనోధారణ నిర్గుణతంత్రము.ఇంద్రియములను మనసులో,మనసును అహంకారంలో ,అహంకారమును బుద్ధిలో,బుద్ధిని ప్రకృతిలో లీనం చేయడమే ధ్యానం.నిరంతరం ధ్యానంలో నిమగ్నమైనవాడికి ముసలి తనములేదు.యోగీకి మలినములు అంటవు .. 

నిరంతర ఆనందము పొందుతూ పరమాత్మ దర్శనం పొందుతాడు.యోగి గాలిలో పెట్టిన దీపము వలె నిశ్చలంగా ఉంటాడు.నిర్మలాకాశంలాఉంటాడు.ఆటుపోటులకు  చలించని సముద్రంలా ఉంటాడు.అతడి చుట్టూ భయంకర శబ్దాది మనసును కలవర పెట్టే విషయాలను పట్టించుకొనడు.దీనినే యోగమార్గము అంటారు.కానీ ఈ మార్గంలో నడవడానికి ఎలాంటి అలసత్వం పనికి రాదు.ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండాలి.ఈ యోగీకి ఎవరికి అందని మోక్షము లభిస్తుంది.

మరణము లోకాలు  

మరణసమయంలోఈయోగికిపాదాలనుండి ప్రాణాలుపోయినచోవిష్ణుపదము, పిక్కలు నుండి పోయిన వసువులుఉండేలోకమును,జానువులనుండిపోయినసాథ్యులుండేలోకములభిస్తుంది.     విసర్జనకు ఆలయము నుండి పోయిన సూర్య లోకము లభిస్తుంది.తొడలనుండి పోయిన ప్రజాపతి లోకము లభిస్తుంది.జననేంద్రియాలనుండి పోయిన భూలోకప్రాప్తిలభిస్తుంది.పార్శ్వములనుండిపోతే మరుత్తల లోకము వస్తుంది.బొడ్డులోనుండిపోతేచంద్రలోకములభి స్తుంది.చేతులనుండిపోతే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది.వక్షస్థలమునుండిపోతేకైలాసప్రాప్తిలభిస్తుంది.ముఖములోనుండిపోతే విశ్వ దేవతలుండే లోకం లభిస్తుంది.చెవుల నుండి పోతేదిక్పాలకులుండే లోకం లభిస్తుంది. ముక్కునుండి పోతే వాయుదేవుడు ఉండే లోకము లభిస్తుంది.కళ్ళనుండి పోతే అగ్నిదేవుడు ఉండే లోకము లభిస్తుంది.కనుబొమలనుండిపోతే అశ్విని దేవతలు ఉండే లోకం ప్రాప్తిస్తుంది. నుదురు నుండి పోతే పితృ దేవతలు ఉండే లోకం ప్రాప్తిస్తుంది.తలపైభాగంనుండి. పోతే శాశ్వతానందం ఇచ్చే మోక్షం లభిస్తుంది.

మరణసమయం
మరణసమయం మాసన్నమైనప్పుడు ఆకాశంలో అరుంధతీ నక్షత్రం కనిపించదు.ముక్కుచెక్కినట్లుకనపడినా , చంద్రుడు మలినంగా కనబడినా,అతడిఆయుష్షు ఒక సంవత్సరము నిగ్రహించాలి.ముఖవర్ఛ స్సు,తెలివితేటలుపెరిగినాతరిగినాఅతడిఆయువుఆరు నెలలే అనితెలుసుకోవాలి.పూర్ణచంద్రుడిలో,సూర్యబింబంలో వెలితి కనబడితే అతడి ఆయుర్దాయము ఏడు రోజులే అని తెలుసుకోవాలి.దేవాలయమునకు వెళ్లినప్పుడు దేవుడికి సమర్పించిన పుష్పములు,సుగంధ ద్రవ్యములు దుర్గంధము వెదజల్లితే అతడి ఆయస్సు ఆరు నెలలు మాత్రమే.చెవులు ముక్కు వాలిపోయినా దంతాలు రంగు  మారినా కళ్ళలో కాంతి సన్నగిల్లినా ,శరీరము నల్లబడినా అతనికి తక్షణమే మృత్యువు అని తెలుసుకోవాలి.మానవుడు ఏ కారణము లేకుండా నే కళ్ళలో నీరు కారుతూ ఉంటుంది.తల మీద నుండి పొగలు,సెగలు వచ్చినా అతనికి చివరి దశ ఆసన్నమైనదని టెక్=లుసుకొవాలి .యోగి యైనవాడు ఈ సూచనలు గమనించి నిరంతర ధ్యాన సమాధిలో నుండి జీవుడిని పరమాత్మలో కలపడానికి ప్రయత్నించును.అట్టి యోగి ప్రాణములను విడువగానే పరమాత్మలో లీనమై శాశ్వతానందమును పొందును. 

Saturday, 11 March 2023

మనము గుర్తుంచు కోవలసిన విషయాలు 2

       కర్మ ఫలము

మనంనిత్యజీవితంలోఅనేకకర్మలుచేస్తూయుంటాము.మనకెదురయ్యేసమస్యలు,బాధలు,వేదనలు ప్రారబ్ధకర్మలుద్వారావస్తున్నాయి.ప్రస్తుతంమనం ఎదుర్కొంటున్న పెట్టుడు మన ప్రతిస్పందన లేచావా క్రొత్త కర్మను సృష్టిస్తున్నాయి.వీనికర్మఫలితాలనిప్పుడో,మీరెప్పుడైనా తప్పక అనుభవించాలి.వాక్కు రూపంలోచేసేకర్మలకి ఫలితము వర్తమానం లోను, భవిష్యత్తులో కూడా ఉంటుంది.మనమెదుర్కొంటున్న భిన్నకర్మలకి  తిరిగి ఏ విధంగానూ స్పందించక పోతే,క్రొత్త కర్మ సృష్టించబడింది,. అలా ఉండటం కూడా కష్టమైనవిషయమే.దీనికెంతో సాధన అవసరము.‌ ‌‌‌‌‌‌భక్తులు, యోగులు ఇట్టి స్థితి ఎదురైనప్పుడు,ఎవరుఎలాబాధించినా, వారందరూ భగవంతుడి రూపాలుగాను,ఎదురైన కర్మగాను భావించారు.భక్తి, జ్ఞానం మన మనస్సులో ఉంటే ఏ ఒక్కరూ మనలను బాధించలేరు.ఇవి ఒక యోగస్ధితిలోనికి  తీసుకొని వెళ్ళి సర్వవిధములైన చిత్త వికారాలను దూరం చేస్తాయి.

మానవుడొక్కడే నిట్టనిలువు గా నడిచే రీతిలో జన్మించాడు.(ఊర్ధ్వ గతికి అర్హత మనిషికి మాత్రమే ఉన్నది .)ఎవరిని చూసి ప్రపంచము భయపడదో ,ప్రపంచాన్ని చూసి ఎవరు భయపడ రో  ,ఎవరు 

ఎవరు సంతోషము,కోపము,భయము,మనోవ్యాకులత వంటివి లేకుండా ఉంటారో అట్టి వారు భగవంతునికి ప్రియమైన వారు.బాహ్యాభ్యంతర శుచిని కలిగి ఉన్నవారు,కార్య సామర్ధ్యము కలవారు ,తటస్ధులు ,కర్తృత్వము లేనివారు ,భగవంతుని యందు భగవంతునికి ఇష్టమైనవారు .
మానవుని మొదటి కర్తవ్యము మానవునిగా మెలగటమే ..మనిషి మనిషిలాగే ప్రవర్తించాలి.మఱియు అంతకు మించిన స్ధాయికి ఎదిగేందుకు యత్నించాలి.పెద్దమనుష్యులు,యోగ్యులు అంటే ఉన్నతముగా ఆలోచించేవారు,ఇతరుల అభిప్రాయాలతో కాక సదాలోచనలతో సదామెలిగేవారు ,చెడును తలపెట్టనివారు.ఒక్కోసారి చెడు ఆలోచనలు కూడా మంచి వానివలె వినూత్న రీతిలో అనిపించవచ్చు.ఐనా వాటిని దూరంగా ఉంచగలగాలి.మనస్సుకు చక్కటి తర్ఫీదుని ఇవ్వనిదే మానవుడు సంతోషంగాఉండలేడు .ఒకసారి దైవీగుణాలను అలవరచుకుంటే  అతనిని ఎవరూ అధిగమించలేరు.
సత్సాంగత్యం:-భగవంతుని సృష్టి లో ప్రతీది ఒక  ఆథ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది.బియ్యపుగింజకు,వరిగింజకు మధ్యనున్న సంబంధంలో ఎంతో గొప్ప ఆథ్యాత్మిక దాగియుంది.పొట్టుంటేవరిగింజ.పోట్టునుతొలగిస్తేబియ్యపుగింజ.పొట్టుంటేనేవరిగింజతిరిగి మొలకెత్తుతుంది.లేకపోతేమొలకెత్తదు.పొట్టుఅనేదిఅజ్ఞానంలాంటిది.ఉంటేజీవుడు.అజ్ఞానం
తొలగితే దేవుడు.అజ్ఞానంకలవానికిపునర్జన్మ ఉన్నది.అదితొలగినవానికి పునర్జన్మ ఉండదు.కానమనము సద్గ్రంధపఠనముచేసి, సజ్జనసహవాసంసేవచేసి,సద్సేవచేసి,అజ్ఞానంతొలగించుకొనే ప్రయత్నం చేయాలి.

తెలుసుకోండి

          తెలుసుకోండి

వాన పలుకులు 

మనకు వర్షం గూర్చి తెలుసు.వానలు కురుస్తాయి.ఎప్పుడూఒకేవానకురిస్తేఎలా? ఇన్ని రకాల వానలు కురిస్తే?

*గాంధారి వాని:-కంటికిఎదురుగాఉన్నదికనిపించనంత జోరుగా కురిసే వాన.

*మాపుసారి వాని:-సాయంత్రంకురిసేవాన మీసర వాన:-మృగశిర కార్తె లో కురిసే వాన.

*దుబ్బురు వాన:-తుంపర/తుప్పరవాన.

*సానిపి వాన:-కళ్ళాపిజల్లినంతకురిసేవాన.

*సూరునీల్ల వాన:-ఇంటిచూరునుండిధార పడేంత వాన.

*బట్టదడుపు వాన:-ఒంటి మీదనున్నబట్టలుతడిపేంతవాన 

*తెప్పే వాన :-ఒక చిన్న మేఘమునుండిపడేవాన 

:*సాలువాన :_ఒక నాగలి సాలుకు సరిపడావాన 

*ఇరువాలు వాన:-రెండుసార్లకు &విత్తనాలకు సరిపడా వాన 

*మడికట్టు వాన :-బురదపొలము దున్నేటంత వాన

*ముంతపోతవాన :-ముంతతోటి పోసినంత వాన  

*కుండపోతవాన :-కుండతో కుమ్మరించినంత వాన 

*దరోదరివాన :-ఎడతెగకుండా కురిసే వాన 

*బొయ్యబొయ్యగొట్టేవాన :-హోరుగాలితోకూడినవాన

*రాళ్లవాన :-వడగ౦డ్లవాన 

*కప్పదాటువాన :-అక్కడక్కడాకొంచెము కురిసివాన 

*తప్పడతప్పడవాన :-టపటపా కొంచెము సేపు కురిసేవాన 

*దొంగవాన :-రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన 

*కోపులు నిండే వాన :-రోడ్డు పక్కన గుంతలు కురిసే వాన 

*ఏక్దారవాన :-ఏకధారగా కురిసే వాన 

*మొదటి వాన :-విత్తనాలకు బలమిచ్చే వాన 

*సాలేటివాన :-భూమి తడిసే0తభారీవాన 

*సాలుపెట్టువాన:_దున్నేందుకు సరిపోయేంత వాన   

























Tuesday, 7 March 2023

మనం గుర్తుంచుకోవాలి 3

      మానవశరీరం

మనం శరీరం కూడా కురుక్షేత్రమే.మంచిఆలోచనలుపాండవులసైన్యంఐతే,దుర్మార్గం తో కూడినఆలోచనలుకౌరవసేనలు.వానిమథ్య జ

రిగేసంఘర్షణేకురుక్షేత్రసంగ్రామము.మానవుడుపుట్టగానేఅతడి/ఆమె మనసు నిర్మలంగా,ప్రశాంతంగా,అమాయకంగా ఉంటుంది.పెరిగిపెద్దయ్యేకొద్దీనాది,నీదనుస్వార్థము,నీవు వేరు,నేనువేరుఅనేభేదబుద్ధి ,అంతానాకే కావాలి,నీకివ్వననేలోభత్వము,నువ్వంటే నాకు పడదనేద్వషము,నీకు అంత ఉంది నాకు ఇంతే ఉందనే అసూయక్రమక్రమంగామనమనోబుద్ధులనుకురుక్షేత్రంగా మారుస్తాయి.ఈమంచిచెడులమథ్యనిత్యంఘర్షణ జరుగుతూనే ఉంటుంది.ఒకసారిమంచిగెలుస్తుంది.ఒకసారిచెడు గెలుస్తుంది.దానినిబట్టి సుఖదుఃఖములుఒకదొనివెంటఒకటివస్తుంటాయి.ఇదేసంసారమనేసాగరము.దీనినుండిబయటపడాలంటే ఒక గట్టి పడేలా కావాలి.అదేభగవద్గీత.దానికిచుక్కానిపట్టేదిగురువు . ఈ సంసార సాగరమును వాని వలన సఉలభంగఆదఆటవచ్చు.పైగామానవశరీరముఅనిత్యము.అందుచే మంచిపనులు చేస్తూ భగవంతుని ఆలోచిస్తూ తనసంపాదనయందా సక్తి లేకుండా మనో వికారాలనుఅణచివేస్తూ యున్న భక్తి జ్ఞాన ములతో సాధన చేసిన మానవశరీర ధారణకు న్యాయం చేసే వారమగు దుము.

గీతాచార్యుడు మనుజులను మూడు రకములుగా వివరించాడు.యావత్తు మానవవర్గాన్ని మూడు గుణాలలో విభజించాడు.అవి సత్వ గుణము,రజోగుణము,తమో గుణము.సత్వ గుణమున్నవారిని సాత్వికులనియo దుము.రజోగుణమున్నవారిని అతనికేంరాజుఅంటాము.తమోగుణమున్నవారిని ఒట్టి తామసం అంటాం..ఈ మూడింటిలోనూ రూపం వేరు.ఆత్మ వేరు.కొందరి అభిప్రాయమును బట్టి దేహానికి ఆత్మపై ఆధిపత్యముందంటారు.కానీ ఆత్మ దేహముపై ఆధిపత్యముచేయలేక తల్లడిల్లుతోంది.

మొదటి రకమైన సాత్వికుడు ఆత్మను తన గుప్పెట్లోకి తె చ్చుకుంటాడు.మనిషి చేసే పనులు జ్ణానంతో తేజోవంతమైనప్పుడు సత్వగుణము వృద్ధి చెందుతుంది.

రజో గుణము గలవాడు ఆత్మగురించి పట్టించుకోక శారీరక ఇచ్ఛనే ప్రపంచమనుకొని జీవిస్తాడు.రాజోగునంతో కోరికలనణచుకోలేము .క్రియాశీలత వృద్ధి చెందుతుంది.

ఇక తమో గుణమున్నవానికి ఆత్మ,దేహము రెండింటిపైన ఎలాంటి ఆధిక్యముండదు.అందరికీ సత్వగుణముండటం అనేది కఠినమే.దేహానికి విడిగా వ్య్వహరించే శక్తి ఉంది.మనసును అది నలుపగలదు.వెళ్లకూడని చోటికల్లా అది వెళ్లమంటుంది.చేయరాణి పనులు చేయమంటుంది.పట్టించుకుదని విషయాలను పట్టించుకొమంటుంది.దేహము సవ్యంగా ఉంటే మనసు బాగుంటుంది.అట్లు లేనిచో దేహము చెదిరిపోతుంది.మనసుకు మరో రూపమే ఆత్మ .దేహానికి ఆత్మపై ఆధిక్యముంది.ఈ ఆధిక్యాన్ని వేరు చేయగలవారు సాత్విక గుణము కలిగి ఉంటారు.దేహానికి ఆత్మపై ఆధిక్యము లేకుండాఉన్నవారే ప్రపంచములో ఉత్తములౌతారు.వారే సాధువులు.ఏ మూడు గుణాలకతీతమైనవారే దైవత్వము నిండిన వారై ఉంటారు..... 






Saturday, 4 March 2023

మనం గుర్తుంచుకోవలసిన విషయాలు

                                                రాధా స్వ ఆమీ 

                                  మనం గుర్తుంచుకోవలసిన విషయాలు 
1.కర్మ ,కర్మఫలం :-

      దేవుడు                                                             జీవుడు 

1.శరీరధారుడు కాదు.                            శరీరధారుడు 

.  2 .కర్మలు చేయడు                                         కర్మలు చేయును .గాన శరీరధారణ 

                                                                                    అవసరము.కర్మఫలములను                                                                                                               అనుభవించును.

3..కర్మఫలములను అనుభ 
వించనక్కరలేదు.   
కర్మచేసేవారిని కర్త అనియందురు.వాని ఫలములననుభవించు వానిని భోక్త అనియందురు.

కర్తృ త్వమేవరిదో భోక్తత్వము కూడా వారిదే.దేవునిలో నవి యుండవు.   వేదవిహిత కర్మలను చేయాలని ఈశ్వరాజ్ఞ .అట్లు చేయనిచో అనేకదుఃఖము లపాలగును .దేవుడు జీవునకు కర్మఫలములనిచ్చును.అందుకే దేవుడవసరము.కర్మఫలాలనను భవించాలంటే మొదట శరీరము కావాలి .తర్వాత అన్నము,అనువగు ప్రపంచ మిచ్చుట దేవుని పని.దేవుని సృష్టి రచనలేనిచో  సుఖదుఃఖాలు,కర్మలు,పాప పుణ్యములేమియు నుండవు.జీవుని యందు కోరిక,ప్రయత్నము,ద్వేషము,దుఃఖము,సుఖము,జ్ఞానము ఈ ఆరును ఆశ్రయంచి యుండును.కాన మాటిమాటికి జీవుడు శరీరాధారణ చేయును.ఒక వస్తువు కావాలని కోరడము  అది లభించనిచో ద్వేష భావము కల్గియుండుట,వస్తుసంపాదనకై ప్రయత్నించడము,సాధించిన దానితో సుఖపడటము/దుఃఖించడము సామాన్యజ్ఞానాన్ని కల్గియుండడం,వంటివన్నీ జీవునిలోచూస్తాము.దేవుడు,జీవుడు,ప్రకృతి,ఉనికి గల పదార్ధాలు.వీనికెన్నడు నాశములేదు.దేవుడు సృష్టి స్ధితి లయలకధిపతి.దేవుడు ప్రపంచానికి స్వామి.ప్రపంచాన్ని మించి యున్నాడు.జీవుడు   ప్రపంచములో నొక భాగస్వా మి మాత్రమే.దేవుడు సర్వవ్యాపకుడు,సార్వదేశికుడు.జీవుడేకదేశీ .దేవుడొక్కడే.జీవులనేకం.దేవునిలో విశ్వమంతా నిండి యుంది.శరీరమవసరములేదు.కారణశరీరము,సూక్ష్మ శరీరము,స్ధూలశరీరము అనేవిలేనివాడు దేవుడు.కారణజన్ముడు జీవుడు కానీ దేవుడు కాదు.జన్మఎత్తే అధికారమతనికుంది.దేవుడు జీవుల చేష్టలను,కర్మలను పరిశీలిస్తూ,తగినఫలా లనిస్తుంటాడు.పరమాణువుకంటే సూక్ష్మమైనవాడు,అదృశ్యరూపుడు,ఓంకారవాచ్యుడు,అంతటానిండి యున్నవాడు ,మనలోనున్నవాడు.కాన మనము శరీరధారులము కావున మనలోని దేవుని వెదకి ఆతనినుపాసించి తరించుట మన కర్తవ్యము.