భక్తుడు---భగవంతుడు
భక్తుడు----భగవంతుడు
పూర్వమునుండియుఅనేకులు(పెద్దలు,కవులు,గురువులు)భగవంతుని జేరాలంటే భక్తితోనూ,దీనత్వముతోను,సుగుణ ములుకలిగిప్రార్ధనజేసినతప్పకఫలించుననిజెప్పుచున్నారు.
తిరుపతి వెంకటేశ్వర కృత కామేశ్వరీ శతకములోని పద్యమును జూ డుడు.
శా.వారున్వీరును దిక్కటoచు మది సంభావించుటేకాని య
వ్వారు న్వీరును గష్టమబ్బినఎడన్వారింపగాలేరు నీ
వో రాబోెెెయెడి వానితోడ నవియేదోరీతివారింతు నీ
వేరాజిల్లుము నాకు దిక్కగుచు నిన్నే గొల్తు కామేశ్వరీ !
నీవే నాకు దిక్కు గా నుండ మని కోరిక కనబడుచున్నది.
అల్లంరాజు రంగశాయి కవి కృత మాధవశతకమున
ఈవే తండ్రివి తల్లివీవె చెలివీవే ప్రాణమిత్రుండవున్
నీవే నాకిక సద్గురుండ వయిన న్నీవే సహాయుండవున్
నీవే యాపదలందు రక్షకుడవు న్నీవే సుమీ భ్రాతవున్
నీవే గావున నిన్ను భక్తి గొలుతు న్నిక్కంబుగన్ మాధవా!
చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి కృపాంభో నిధి శతకము లోని క్రింది పద్యములను జూడుడు.
భగవంతుడు తన్ను ఎట్లు రక్షించగలడు ?అని ఎలా అంటున్నాడో చూడండి .
నినుధ్యానింపదునామనoబనిశముజేయున్ దురాలోచనల్
నిను గీర్తిoపదు జిహ్వ, సల్ప నెగడున్ నీచప్రలాపంబులన్
నినునర్చింపవుహస్తముల్,నెఱపెడున్ నింద్య క్రియారంభముల్
నను నేరీతినిగాచెదో యెఱుగనన్నా!యో కృపాంభోనిధీ!
ఏ కాలంబున నేమి కావలెనొ మాకేదియిష్టంబొ నా
యా కాలంబున మేము చెప్పకయె నీ వేదాని జేకూర్తు లే
దే కష్టంబును నీవె తల్లివయి నీవె తండ్రివై యుంటిమా
కో కళ్యాణ గుణాలవాలవరదా యో సత్కృపా oభోనిధీ !
మరియు
అలుకకంబూనవు,మమ్మువెట్టిపనిసేయింబింప,వంతః పురంబు
బులలో నుండవు,మొఱ్ఱలన్వినెదు గొల్వుందీర్చిహృత్ప
ఠిం,గో
లాల గొట్టింపవు,పన్నులిమ్మనవు,మేల్గానించిరక్షింతు,నీ
వలె బాలించు ప్రభుండు సేకురునె దేవా సత్కృపాo భో
నిధీ!
పై పద్యములచే భగవంతుడు తన భక్తుని ఎట్లు కాచు
చుండునో మనకు కవి తెలియబరచినాడు.
No comments:
Post a Comment