సమస్యా పూరణము
అవధానప్రక్రియలోనొకటిసమస్యాపూరణము.శ్రీ రావూరి సత్యనారాయణ గారి సమస్యామంజరి గ్రంథమున కొన్ని పద్యములను చూడుడు .
*కరము,సరము,బరము,గరము(రామాయణార్ధము)
కరమునరాఘవుండసితకంఠు ధనుస్సును ద్రుంప సీత పూ
సరమున వాని దత్పతిగ సమ్మతి దెల్పి వనంబులోన సం
బరమున నుండ రావణుడుపాయమునన్ జెఱ పట్ట నామె సం
గరమునవాని జంపి నిజకాంతనుదెచ్చెను
రాముడర్మిలిన్ .
*పరమేశ్వరు గొల్చువారుపతితులుగా రే
అను దానికి కవి పూరించిన వర్ణన -
కరిరాజవరదు గిరిధరు
పరమేశ్వరు గొల్చు వారు పతితులుగా రే
గిరిమున్ను భక్తులెందఱొ
హరిచరణము సేవచేసి యవ్విధిపురికిన్.
*గరిమసామగపదమా నిగనిరిదరిని
అను దానికి కవి పూరణ .
త్యాగరాజాది సంగీత రాగ నిధులు
తత్కళామృత వారిధి దాటబూని
గరిమసా మగపద మాని గనిరి దరిని .
శ్రీ చోట్నీరు శ్రీరామమూర్తి కవి కృత సమస్యా మందారమాల అనుగ్రంధమును సమస్యాపూరణములను జూడుడు.
*పాదములు లేని తరులు పరుగిడజొచ్చెన్ *
మాదయితు రోటగట్టె య
శోదాసతి యతడు రెండు చోద్యపుజెట్టుల్
భేదిల్ల లాగి పరుగిడ
బాదమ్ములులేని తరులు పరుగిడ జొచ్చెన్.
No comments:
Post a Comment