Saturday, 19 May 2018

సమస్యాపూరణము

                                       సమస్యా పూరణము

అవధానప్రక్రియలోనొకటిసమస్యాపూరణము.శ్రీ రావూరి సత్యనారాయణ గారి సమస్యామంజరి గ్రంథమున కొన్ని పద్యములను చూడుడు .

*కరము,సరము,బరము,గరము(రామాయణార్ధము)

కరమునరాఘవుండసితకంఠు ధనుస్సును                                                      ద్రుంప సీత పూ 

సరమున వాని దత్పతిగ సమ్మతి దెల్పి                                                         వనంబులోన సం

బరమున నుండ రావణుడుపాయమునన్                                                జెఱ పట్ట నామె సం 

గరమునవాని జంపి నిజకాంతనుదెచ్చెను 

రాముడర్మిలిన్ .

*పరమేశ్వరు గొల్చువారుపతితులుగా రే 

అను దానికి కవి పూరించిన వర్ణన -

కరిరాజవరదు గిరిధరు 

పరమేశ్వరు గొల్చు వారు పతితులుగా రే 

గిరిమున్ను భక్తులెందఱొ 

హరిచరణము సేవచేసి యవ్విధిపురికిన్.  

*గరిమసామగపదమా నిగనిరిదరిని 

అను దానికి  కవి పూరణ .

త్యాగరాజాది సంగీత రాగ  నిధులు

తత్కళామృత వారిధి దాటబూని 

గరిమసా మగపద మాని గనిరి దరిని .          

శ్రీ చోట్నీరు శ్రీరామమూర్తి కవి కృత సమస్యా మందారమాల అనుగ్రంధమును సమస్యాపూరణములను జూడుడు.
*పాదములు లేని తరులు పరుగిడజొచ్చెన్ *

మాదయితు రోటగట్టె య 
శోదాసతి యతడు  రెండు చోద్యపుజెట్టుల్ 
భేదిల్ల లాగి పరుగిడ
బాదమ్ములులేని తరులు పరుగిడ జొచ్చెన్.  

అని కవి పూరించి నాడు.

*కొడుకునకున్ గూతునిచ్చె గోమలి ముదిమిన్ *

పై దానిని కవి ఇట్లు పూరించినాడు.


విడువని పేదరికంబున 

గడు సంతును గూర్చి మగడు గన్నులు మూయన్

హడలుచు నొక ధనవంతుని 

కొడుకునకున్ గూతినిచ్చె గోమలి ముదిమిన్.


*మల్లియ తీవియలు కాసె మామిడికాయల్.*

అల్లన నామని రాగా 

నెల్లెడ గోయిలలు గూసె ;నింపుగ వీచెన్ 

చల్లని గాలులు ;పూచెను 

మల్లియ తీవియలు  కాసె  మామిడికాయల్.   


*పగలు మిగిలియున్న ఫలము హెచ్చు*

జాతి కులము మతము సాకుగా గైకొని 

యొకరినొకరు జంప నొప్పదిలను 

సర్వసమత గల్గి సమయింపు డెల్లరు 

బగలు!మిగిలి యున్న ఫలము హెచ్చు.  

No comments:

Post a Comment