Thursday, 14 June 2018
Wednesday, 13 June 2018
మనోనిగ్రహ సాధనాలు
మనోనిగ్రహసాధనలు
మదం
మదమనగా క్రొవ్వు అనియర్ధము.మనమొకనిచెడ్డగుణాన్ని,
నిర్లక్ష్యంగాచెప్పుకొనేటప్పుడుజాతీయంగావాడుకుంటాము. వీడికెంతమదంరా -అనియంటూ యుంటాము.మదం అంటే అహం అని చెప్పవచ్చు.ఈ విచిత్ర సృష్టి చక్రము
నిరంతరమూ త్రిప్పు భగవంతుడుండగా అన్నిటినీ -నేనే
చేస్తున్నానని అనుకోవడమెంత అవివేకము.ఈ అహమే అన్ని అనర్ధాలకు మూలము.నవీన మానవుడు "నేనీరోజు ఈ పనిని సునాయాసంగా చేసాను".అని చెప్పుకుంటాడు కానీ,భగవంతుని కృపచే పూర్తి చేశానని చెప్పడు.
ఇప్పటి విద్యార్ధి రెండు చేతులు వదిలిపెట్టి సైకిలు త్రొక్కుతూ గర్వంగా కాలరు సర్దుకుంటాడు.ఏ చిన్న కారో ఎదురొస్తే తప్పుకోవడం చేతకాక తిన్నగా దానిక్రిందికి దూరి ప్రాణాలను వదులుతాడు.శారీరిక బలాన్ని పెంపొందించుకోవడంలో తప్పు లేదు గాని దాని ఆధారంతో బ్రతుకదానికి ప్రయత్నించడం మహాపాపం,మరియు ఆత్మీయ శక్తిని కోల్పోతున్నారు.
అహం+మదం =నేను అనే స్వభావాన్ని విడిచి వినయవిధేయతలతో నాకన్నా బలవంతుడు ,సత్యస్వరూపి ,ప్రేమమయుడైన భగవంతుడున్నాడని జ్ఞాపకం తెచ్చుకుంటూ పరుల కష్టనష్టాలలో సాయం జేస్తూ సత్ప్రవర్తనతో దేవుని ధ్యానించుకుంటూమంచి మనుగడ సాగిస్తున్న వ్యక్తి వద్దకు మదము జేరాడు.
శ్లో||విపుల హృదయై ర్ధనై:కైశ్చి జ్జగజ్జనితం పురా,
విధృత మపరై,ర్దత్తం చాన్యై ర్విజిత్యతృణం యధా ,
ఇహ హాయ్ భువనాన్యన్యే ధీరాశ్చతుర్దశభుఞ్జతే,
కతిపయ పురస్వా మ్యే పుంసాం క ఏష మదజ్వరః ?
ఆదిలో హరిశ్చంద్రాదులు ప్రజాపతులు.సమగ్ర ధర్మాచరణo చేతఈ భూమండలాన్ని చక్కగా చేశారు.దానిని మన్వాదులు కాపాడారు.ఎందరెందరో రాజులు చక్కగాపాలించినారు.దీన్నే పరశురామాదులు స్వవశం చేసికొని ఇతరులకు దానం చేశారు.వారెంతమాత్రము గర్వమును చూపలేదు .చిన్నమండలానికి జెందిన ప్రభువులు జ్వరంలాంటి మదంచేత వికారం పొందడం ఆశ్చర్యమే గదా!
మనోనిగ్రహసాధనలు-కోపము
మనోనిగ్రహసాధనలు
కోపము
కోపము అనగానే క్రింది పద్యము గుర్తుకొస్తుంది.
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష;దయ చుట్టంబౌ;
తన సంతోషమె స్వర్గము ;
దన దు:ఖమె నరకమండ్రు తధ్యము సుమతీ.---అని సుమతీ శతకములో కోపము యొక్క ఫలితమును కవి చక్కగా చెప్పెను.
కోపము(ఆగ్రహము)ఆలోచనను నశింపజేయును.తోటి మానవుల మంచితనమునుపోగొట్టి ఆప్యాయతను లోపింప జేస్తుంది.కోపము గలవారు సాధారణంగా శారీరిక బలహీనులుగా ఉంటారు.అటులనే మానసికముగాను బలహీనులే.కానశారీరిక,మానసికబలములనుపొందాలంటే తప్పక శాంతగుణమునలవరచుకోవాలి.అని పై పద్యము మనకుచెప్పుచున్నది.భర్తృహరిసుభాషితములులోనిక్రింది శ్లోకమును పరికించుడు.
శ్లో||క్షాన్తిక్చేత్కవచేన కిం కిమరిభి:క్రోధోస్తి చేద్దేహినాం
జ్ఞాతి శ్చేదనలేన కిం యది సుహృద్దివ్యౌషధై:కింఫలం
కిం సర్పైర్యది దుర్జనాః కిము ధనైర్విద్యానవద్యాయాది
వ్రీడా చేత్కిము భూష ణై స్సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్
ఓర్పు ఉంటే కవచకుండలాలెందుకు?ఆగ్రహమున్నవాడికి వేరే శత్రువులు అక్కర లేదు.దాయాదులున్నచోట నిప్పు కొని తేనక్కరలేదు.దుర్మార్గుడున్నచో వేరేసర్పములెoదు కు.పురాణాలను చూచిన దుర్వాసమహర్షి ముక్కోపి గా కనబడును. పురాణాలలో పరికించి తే దుర్వాసమహర్షి ముక్కోపి .రావణుడు తనకోపముచేతనే తాను ,తనవంశమును నశింపజేసికొనెను.కోపమున్నంతవరకు అరిషడ్వర్గాలు దగ్గరగా ఉంటాయి.బైబిలునందు "కోపము గలవానితో సహవాసము వద్దు.పరిచయము కూడా వలదు.లేనిచో ణీ ప్రాణమునకు "ఉరి"తెచ్చుకుందువు."
అని యున్నది.కోపము వస్తున్నప్పుడు మౌనంగా ఉండడం మంచిది.పూర్వులు "మౌనేన కలహం నాస్తి "అని చెప్పిరి.
Saturday, 9 June 2018
మనోనిగ్రహాసాధనలు
మనోనిగ్రహసాధనలు
1.కామం
కామము అనగా కోరిక్ అనియర్ధ ము .జీవితంలో ప్రతివానికి ఎన్నో కోరికలుంటాయి.వానిని తీర్చుకోవడము పురుషా ర్ధమే యైనప్పటికి ధర్మమునతిక్రమింపరాదు. ఎన్ని కట్టెలు వేసిననుఅగ్నికితృప్తిలేనట్లుఎన్నిసుఖములనుభవించినాను మానవునకు తృప్తి కలిగదు.కాన క్షణికములగు ఐహిక సుఖాలపై ఆశలను పరిమితిలోనుంచుకొనవలయును.అట్టి కోరికలను (తృష్ణ లను)విడుచుట అంతసులభమా?
శ్లో||భ్రాస్తం దేశమనేకదుర్గవిషమం ప్రాప్తం న కించత్ఫలం
త్యక్త్వా జాతికులాభిమానముచితం నేవా కృతానిష్ఫలా
భుక్తం మానవివర్జితం పరగృహేష్వా శంకయాకాకవ ,
త్తృష్ణే!జృoభసిపాపకర్మ పిశునేనాద్యపి సంతుష్యసి.
అన్నిచోట్ల తిరిగినాను.పడరాని పాట్లు పడ్డాను.విసిగినాను.కుల,జాత్యభిమానాలను విడిచి సేవకవృత్తిచేసాను.ఇతరుల ఇంట బెదురుతూ తిండి తిన్నాను.ఇంత చేస్తున్నా ఓ ఆశా!నీకింకా తృప్తి లేదేమి?
వార్ధక్య దశలో గూడా తృష్ణ వదలలేదు.
శ్లో||భోగానభుక్తా,వాయమేవ భుక్తా;
స్తపోనతపోతం,వయమేవ తప్తా:
కాలోనయాతో ,వయమేవ యాతా;
స్తృష్ణాన జీర్ణా,వయమేవ జీ ర్ణా :
భోగాలు మాచేత అనుభవింపబడలేదు.మేమే వానిని అంటిపెట్టుకొని ఉన్నాము.తపస్సు మా చేత ఆచరించ బడుటలేదు.కాలం గడిచినదనుకున్నాము కాని మా జీవితాలే గడిచినవి.ఇదంతా ఆశవల్లనేగదా ! అందునా దురాశ దుఃఖము నకు దారితీయును.
శారీరిక వ్యభిచారము కన్నా మానసిక వ్యభిచారము మహాపరాధము.దీనిగుర్చి క్రీస్తు "ఒక స్త్రీని మోహపు చూ పుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు --ఆమెతో వ్యభిచారము చేసినవాడగును."(కొత్త నిబంధన ,మత్తయి సువార్త 5;28)శీలానికి విలువివ్వక పైపై మెరుగులకు భ్రమసి నాశామానమగు తాత్కాలికానందం కొరకు ప్రాకులాడుటఅవివేకముగదా!మానవుడు చేయు ప్రతి పాప కృత్యమునకు ఎప్పుడో ఒకనాడు భగవంతునికి లెక్క అప్పజేప్పవలసి యుంటుంది.పాప ఫలితాలను ఈ లోకములోనున్నప్పుడే అనుభావింప వలసియుండును.
భగవద్గీతలో
దూమె నావ్రియతె వహ్ని
ర్యధాదర్శో మలేనచ,
యధోల్బెనా వృతో గర్భ
స్తధా తె నేదమావృతమ్
కాముకునికిసహజంగా తెలివి తగ్గును.శరీరసౌo దర్యాని కిచ్చే ప్రాధాన్యత ఆత్మకీయడు.పోగానిన్దినప్పుడు అగ్ని కనబడదు గదా!మురికి జేరిన అద్దములో ప్రతిబింబము కనబడదుగదా! కామము మానవును విజ్ఞానాన్నిమూ స్తుంది గదా!"నిప్పుల మీద నడచిన--పాదములు కాలినట్లే పొరుగువాని భార్యను కూడువాడుకూడా నాశనమగును."బైబిలు,పాతనిబంధన సామెతలు 6:26 -29
రామాయణాన్ని పరీక్షించిన సీతనెత్తుకొని పోవుటచేతనే తను నశించుటయే గాక తనకులాన్ని నాశనము రావణుడు చేసినాడుగదా! స్త్రీ పురుషులు ఒకసారి చేయుసంయోగమున ఐదు రోజులాయస్సును పోగొట్టుకుందురు. కాన సన్మార్గముతోభగవంతుని జేరవలేనన్న నీవు ప్రతి క్షణము భగవన్నామాన్నిస్మరిస్తూఉన్నకామాన్నిమానవుడు సులభంగా జయించగలడు.
Wednesday, 6 June 2018
సాధన
సాధన
పరమేశ్వరునిసృష్టిలో మరో చిద్విలాసము మానవ మనస్సు !కొలిమిలో బాగా కాలిన యినుము సమమ్మెట దెబ్బలననుసరించి వంగినట్లుగా కోరికలను బట్టి మనసు మలుపులు తిరుగుతుంది.కానమానవ మనస్తత్వాన్ని కబళించి నరకానికి దారి జూపే అరిషడ్వర్గాలను జయించడానికి సులువైనమార్గాలను అన్వేషించ వలెను.మానవునిహృదయముబహుదుర్బలమైనది.కలిమి లేములకుగాని,సంతోషవిషాదాలకుగాని తట్టుకోలేదు.అది ఈర్ష్యాసూయద్వేషాలకునిలయము.కోపతాపాలకోవెల.అసహన,ఆగ్రహాలకుకేంద్రము.కోరికలశిఖరమీశరీరము.అప్రియపలుకులకు ఏహ్యమైన వాంఛలకుప్రియమైనదీ మనస్సు.హృదయము మోసకారము.ఘోరమైనవ్యాధి కలది.అనిబైబిలుసూక్తి.కాన మనము అరిషడ్వర్గాలను ,ఇంద్రియనిగ్ర హ మార్గాలను గ్రహించి అనుసరించి ఆచరించిన దైవత్వము మానవునకు లభింపగలదు.భగవద్గీతకుడా ఇదే చెప్పుచున్నది.
ఆసం యతాత్మానాయోగో
దుష్ప్రాప ఇతిమే మతి:
వశ్యాత్మనాతు యతతా
శక్యోవాప్టు ముపాయతః -------అనగామనసునునిగ్రహించలేని వారికి దవత్వము సిద్ధిం పదు .మనసును వశపరచుకొని ధ్యానించువారికియోగప్రాప్తి కలుగును.బైబిలులో "ప్రాకారము సరిగా లేక పాడైన పురము ఎంతో,అటులనే తన మనస్సును అణచుకోలేని వాడునుఅంతే."అని యున్నది.దానర్ధమునుపరికించగా -లెక్కకు మిక్కిలిగానున్న రధ,తురగ,గజ,పదాతిదళములు సుశిక్షితులై పటిష్టంగా ఉన్న పట్టణమైనా, దుర్గము సురక్షితముగా నుండవలెనంటే ప్రాకారమును పకడ్బందిగా నిర్మించవలెను గదా!అటులనే మానవుడు అనే నగరానికి క ఠిణ శిలలనే సుగుణాలతో నిండిన మంచి మనస్సు అనే అందమైన ,అభేద్యమైన ప్రహరీని నిర్మించుకోవాలి.దానికి ముందుగా పూర్వము చెప్పినట్లుగా అరిషడ్వర్గాలను జయించాలి.
ఆశా వై వశ్వ వివశే
చిత్తే సంతోష వర్జితే
మ్లానే వక్త్ర మమీవాదర్మే
నజ్ఞానం ప్రతిబింబతి---మానవుడు మొదట ఆశా సౌధమునుండి నిజజీవితంలోనికిదిగాలి.ఈ ఆశాపాశములను తెన్చుకోనుటయే కష్టము.కాని ఒక్కసారి పుటుక్కున తెగిపోతే --మళ్ళీ ప్రాపంచిక దృష్ట్యా ఏవస్తువునుమానవుడుచూడడు.డబ్బు మీద ,సంసారము,జీవితము మీద ,ప్రపంచములోని ప్రతి ఉన్నత వస్తువు పై ఆకాంక్ష,---ఈ అధిక ఆశ అనర్ధా నికిహేతువనిగ్రహించిమనోనిగ్రహసాధనలనాచారించవలెను. ఒకటి గుర్తుంచుకోవాలి -మురికి నిండిన అద్దములో మన ప్రతిబింబము మనకు కనబడదు గదా!
ఆశ అనే మురికిని మన హృదయమునుండి పూర్ణముగా తుడిచివేయుట మన కర్తవ్యము.అటుపై మోక్ష మార్గము వైపు ఆలోచనలను త్రిప్పి అరిషడ్వర్గాలను తొలగించుకొని ప్రతి తప్పును దేవుని ఎదుట ఒప్పుకొని హృదయపారిశుధ్యమును పొందిన భగవంతుని కరుణకు పాత్రుడగును.ఇంద్రియనిగ్రహము కల్గినవాడు గృహస్దుడైన భాగవత్సాక్షాత్కారమునుపొందగలడు.
Saturday, 2 June 2018
10 8 యొక్క ప్రాముఖ్యత
108 యొక్క ప్రాముఖ్యత
మనం ఏదైనా మంత్రం జపించడానికి 108 సంఖ్యను ఉపయోగిస్తాము.పైగా విష్ణు సహస్ర నామాలు -108
అష్టోత్తరాలలో 108 సంఖ్యనామాలతో దేవతలను ఆరాధిస్తుంటాము.దానికి మన మునులు క్రింది విధంగా చెప్పిరి.1.జ్యోతిష శాస్త్రములో మనకు ఉపయోగ పడేవి
27 నక్షత్రాలు.ప్రతి నక్షత్రానికి 4 పాదాలు అనగా మొత్తము 10 8 అగును. ప్రతి మానవుడు ఈ పదాలలో నొక్కదానిలో
పుట్టియుంటాడు.కాన ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యత.
*2.ఖగోళ పరముగా సూర్యునికి,భూమికి మధ్యదూరము --
149.6 million kms.ఈ దూరాన్ని సూర్యుని చుట్టుకొలత
1391౦౦౦ kms తో భాగిస్తే వచ్చే సంఖ్యా రమారమి 108 .
*అటులనే చంద్రునికి ,భూమికి మధ్యదూరము 38 లక్షలకిలోమీటర్లనుచంద్రుని చుట్టుకొలత అయిన 3474 కి.మీ.తో భాగిస్తే వచ్చే సంఖ్యా 108.
12 రాశులు 9 నక్షత్ర పాదాలు=10 8 .
*హైందవము ప్రకారము ముఖ్య శివ లింగాలు 108.
శైవమతాలు కూడా 108.
*గౌడియ వైష్ణవంలో బృందావనంలో 108 గోపికలను పూజిస్తారు.108 వైష్ణవ దివ్య క్షేత్రాలు కంబోడియాలోఆంగ్కోర్ వాట్ గుడిలో108మంది(అసురులు,దేవతలు)కలిసి సాగరమధనం చేసినట్లు చిత్రింపబడినది.
*బౌద్ధం ప్రకారం పంచేంద్రియాలతో స్పృహను కలిపి ఆరు భావాలను వాటివల్ల కలిగే అంతర్భావా లైన సుఖము,దుఃఖము ,స్దిరత్వ బుద్ధిని గుణించి అవి బాహ్యంగా నైనా,అంతరంగానైనా భూత,భవిష్యద్ ,వర్తమానాలలో కల్గినభావనలను గుణిస్తే 108.(6.3.2.3)
*ఓం పూర్ణ మద :పూర్ణ మిదం
పుర్ణాత్పూర్ణముదచ్యుతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమే వావశిష్య తే .----నుండి ఇన్ఫినిటీ (8)కు చేరుకునే
విధానం 108 symbolism.
*ఆయుర్వేదముప్రకారము 108 మర్మస్ధానాలు,శక్తికేంద్రాలు,
కిలారిపయట్టు ప్రకారం (తరువాత కరాటే గా మారింది)108
pressure points 108 డిగ్రీల జ్వరం వచ్చినపుడు శరీరములో ఉన్న అన్ని అవయవాలు చచ్చుబడి పోతాయి.108 సార్లు
జపము చేయడం వల్ల మనస్సును నిర్మలం చేస్తుంది.
లోపల ఉన్న భావాలను అణగదొక్కుతుంది.సంస్కృత భాషలో 54 అక్షరాలుంటాయి.వాటికి శివ,శక్తి తత్వాలైన స్త్రీ,
పురుష రూపాలుంటాయి.54*2=108.12 ౦౦౦ దివ్య సంవత్సరాలు=43,20,౦౦౦మానవసంవత్సరాలు=బ్రహ్మకు ఒక పగలు =4 ౦౦౦ *108108 లో1 జీవుడినితెలియచేస్తుంది.0 పరిపూర్ణ భగవత్తత్త్వము108.ఈ సంఖ్యను కూడితే 1+0+8=9 చాలా ముఖ్యమైన సంఖ్య.9 తో ఏది కలిపినా వచ్చిన సంఖ్యలోఅంకెలను కలిపితే చివరకు అదే సంఖ్య వస్తుంది.
- గణితం పరంగా 108 ఒక abundant number.అంటే వాటి
divisors 1+2+3+4+6+12+18+27+36+54=163>108
Technical number (ముందటి నాలుగుfibonaccinumbersను
కలిపితే వచ్చేది)0,0,1,1,2,4,8,15,29,56,108.
- hyper factorable 1*1+2*2+3+3=108. ఒకపెంటగాన్ కోణాలు అన్నీకలిపితే 108.ఒక refactorable number ( వాటి divisorsఎన్నున్నాయో వాటితో భాగింప పడ గలిగేది)
- ఇంకా మరెన్నో విశిష్టతలను తనలో యిముడ్చుకున్న సంఖ్య.ఇటువంటి ప్రత్యేకతతో ఉన్నది కనుకనే మన మునులు,ద్రష్టలు ఎప్పుడో 108 సంఖ్యప్రాముఖ్యతను
- మనకు నామాలలోను,ప్రదక్షిణలలోను,జపాలలోను విధిగా విధించారు.మనపూర్వీకులైనవారు చాలా విషయాలను మన కోసము శోధన,సాధన వలన మనకు తెలియకుండానే లాభము పొందుతున్నాము.
Subscribe to:
Posts (Atom)