మనోనిగ్రహసాధనలు
కోపము
కోపము అనగానే క్రింది పద్యము గుర్తుకొస్తుంది.
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష;దయ చుట్టంబౌ;
తన సంతోషమె స్వర్గము ;
దన దు:ఖమె నరకమండ్రు తధ్యము సుమతీ.---అని సుమతీ శతకములో కోపము యొక్క ఫలితమును కవి చక్కగా చెప్పెను.
కోపము(ఆగ్రహము)ఆలోచనను నశింపజేయును.తోటి మానవుల మంచితనమునుపోగొట్టి ఆప్యాయతను లోపింప జేస్తుంది.కోపము గలవారు సాధారణంగా శారీరిక బలహీనులుగా ఉంటారు.అటులనే మానసికముగాను బలహీనులే.కానశారీరిక,మానసికబలములనుపొందాలంటే తప్పక శాంతగుణమునలవరచుకోవాలి.అని పై పద్యము మనకుచెప్పుచున్నది.భర్తృహరిసుభాషితములులోనిక్రింది శ్లోకమును పరికించుడు.
శ్లో||క్షాన్తిక్చేత్కవచేన కిం కిమరిభి:క్రోధోస్తి చేద్దేహినాం
జ్ఞాతి శ్చేదనలేన కిం యది సుహృద్దివ్యౌషధై:కింఫలం
కిం సర్పైర్యది దుర్జనాః కిము ధనైర్విద్యానవద్యాయాది
వ్రీడా చేత్కిము భూష ణై స్సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్
ఓర్పు ఉంటే కవచకుండలాలెందుకు?ఆగ్రహమున్నవాడికి వేరే శత్రువులు అక్కర లేదు.దాయాదులున్నచోట నిప్పు కొని తేనక్కరలేదు.దుర్మార్గుడున్నచో వేరేసర్పములెoదు కు.పురాణాలను చూచిన దుర్వాసమహర్షి ముక్కోపి గా కనబడును. పురాణాలలో పరికించి తే దుర్వాసమహర్షి ముక్కోపి .రావణుడు తనకోపముచేతనే తాను ,తనవంశమును నశింపజేసికొనెను.కోపమున్నంతవరకు అరిషడ్వర్గాలు దగ్గరగా ఉంటాయి.బైబిలునందు "కోపము గలవానితో సహవాసము వద్దు.పరిచయము కూడా వలదు.లేనిచో ణీ ప్రాణమునకు "ఉరి"తెచ్చుకుందువు."
అని యున్నది.కోపము వస్తున్నప్పుడు మౌనంగా ఉండడం మంచిది.పూర్వులు "మౌనేన కలహం నాస్తి "అని చెప్పిరి.
No comments:
Post a Comment