మనోనిగ్రహసాధనలు
మదం
మదమనగా క్రొవ్వు అనియర్ధము.మనమొకనిచెడ్డగుణాన్ని,
నిర్లక్ష్యంగాచెప్పుకొనేటప్పుడుజాతీయంగావాడుకుంటాము. వీడికెంతమదంరా -అనియంటూ యుంటాము.మదం అంటే అహం అని చెప్పవచ్చు.ఈ విచిత్ర సృష్టి చక్రము
నిరంతరమూ త్రిప్పు భగవంతుడుండగా అన్నిటినీ -నేనే
చేస్తున్నానని అనుకోవడమెంత అవివేకము.ఈ అహమే అన్ని అనర్ధాలకు మూలము.నవీన మానవుడు "నేనీరోజు ఈ పనిని సునాయాసంగా చేసాను".అని చెప్పుకుంటాడు కానీ,భగవంతుని కృపచే పూర్తి చేశానని చెప్పడు.
ఇప్పటి విద్యార్ధి రెండు చేతులు వదిలిపెట్టి సైకిలు త్రొక్కుతూ గర్వంగా కాలరు సర్దుకుంటాడు.ఏ చిన్న కారో ఎదురొస్తే తప్పుకోవడం చేతకాక తిన్నగా దానిక్రిందికి దూరి ప్రాణాలను వదులుతాడు.శారీరిక బలాన్ని పెంపొందించుకోవడంలో తప్పు లేదు గాని దాని ఆధారంతో బ్రతుకదానికి ప్రయత్నించడం మహాపాపం,మరియు ఆత్మీయ శక్తిని కోల్పోతున్నారు.
అహం+మదం =నేను అనే స్వభావాన్ని విడిచి వినయవిధేయతలతో నాకన్నా బలవంతుడు ,సత్యస్వరూపి ,ప్రేమమయుడైన భగవంతుడున్నాడని జ్ఞాపకం తెచ్చుకుంటూ పరుల కష్టనష్టాలలో సాయం జేస్తూ సత్ప్రవర్తనతో దేవుని ధ్యానించుకుంటూమంచి మనుగడ సాగిస్తున్న వ్యక్తి వద్దకు మదము జేరాడు.
శ్లో||విపుల హృదయై ర్ధనై:కైశ్చి జ్జగజ్జనితం పురా,
విధృత మపరై,ర్దత్తం చాన్యై ర్విజిత్యతృణం యధా ,
ఇహ హాయ్ భువనాన్యన్యే ధీరాశ్చతుర్దశభుఞ్జతే,
కతిపయ పురస్వా మ్యే పుంసాం క ఏష మదజ్వరః ?
ఆదిలో హరిశ్చంద్రాదులు ప్రజాపతులు.సమగ్ర ధర్మాచరణo చేతఈ భూమండలాన్ని చక్కగా చేశారు.దానిని మన్వాదులు కాపాడారు.ఎందరెందరో రాజులు చక్కగాపాలించినారు.దీన్నే పరశురామాదులు స్వవశం చేసికొని ఇతరులకు దానం చేశారు.వారెంతమాత్రము గర్వమును చూపలేదు .చిన్నమండలానికి జెందిన ప్రభువులు జ్వరంలాంటి మదంచేత వికారం పొందడం ఆశ్చర్యమే గదా!
No comments:
Post a Comment