Wednesday, 6 June 2018

సాధన

                                  సాధన 

పరమేశ్వరునిసృష్టిలో మరో చిద్విలాసము మానవ మనస్సు !కొలిమిలో బాగా కాలిన యినుము సమమ్మెట దెబ్బలననుసరించి వంగినట్లుగా కోరికలను బట్టి మనసు మలుపులు తిరుగుతుంది.కానమానవ మనస్తత్వాన్ని కబళించి నరకానికి దారి జూపే అరిషడ్వర్గాలను జయించడానికి సులువైనమార్గాలను అన్వేషించ వలెను.మానవునిహృదయముబహుదుర్బలమైనది.కలిమి లేములకుగాని,సంతోషవిషాదాలకుగాని తట్టుకోలేదు.అది ఈర్ష్యాసూయద్వేషాలకునిలయము.కోపతాపాలకోవెల.అసహన,ఆగ్రహాలకుకేంద్రము.కోరికలశిఖరమీశరీరము.అప్రియపలుకులకు ఏహ్యమైన వాంఛలకుప్రియమైనదీ మనస్సు.హృదయము మోసకారము.ఘోరమైనవ్యాధి కలది.అనిబైబిలుసూక్తి.కాన మనము అరిషడ్వర్గాలను ,ఇంద్రియనిగ్ర హ మార్గాలను గ్రహించి అనుసరించి ఆచరించిన దైవత్వము మానవునకు లభింపగలదు.భగవద్గీతకుడా ఇదే చెప్పుచున్నది.

ఆసం యతాత్మానాయోగో 

దుష్ప్రాప ఇతిమే మతి: 

వశ్యాత్మనాతు యతతా 

శక్యోవాప్టు ముపాయతః -------అనగామనసునునిగ్రహించలేని వారికి దవత్వము సిద్ధిం  పదు .మనసును వశపరచుకొని ధ్యానించువారికియోగప్రాప్తి కలుగును.బైబిలులో "ప్రాకారము సరిగా లేక పాడైన పురము ఎంతో,అటులనే తన మనస్సును అణచుకోలేని వాడునుఅంతే."అని యున్నది.దానర్ధమునుపరికించగా -లెక్కకు మిక్కిలిగానున్న రధ,తురగ,గజ,పదాతిదళములు సుశిక్షితులై పటిష్టంగా ఉన్న పట్టణమైనా, దుర్గము సురక్షితముగా నుండవలెనంటే ప్రాకారమును పకడ్బందిగా నిర్మించవలెను గదా!అటులనే మానవుడు అనే నగరానికి క ఠిణ శిలలనే సుగుణాలతో నిండిన మంచి మనస్సు అనే అందమైన ,అభేద్యమైన ప్రహరీని నిర్మించుకోవాలి.దానికి ముందుగా పూర్వము చెప్పినట్లుగా అరిషడ్వర్గాలను జయించాలి.

ఆశా వై వశ్వ వివశే 

చిత్తే సంతోష వర్జితే 

మ్లానే వక్త్ర మమీవాదర్మే 

నజ్ఞానం ప్రతిబింబతి---మానవుడు మొదట ఆశా సౌధమునుండి నిజజీవితంలోనికిదిగాలి.ఈ ఆశాపాశములను తెన్చుకోనుటయే  కష్టము.కాని ఒక్కసారి పుటుక్కున తెగిపోతే --మళ్ళీ ప్రాపంచిక దృష్ట్యా ఏవస్తువునుమానవుడుచూడడు.డబ్బు మీద ,సంసారము,జీవితము మీద ,ప్రపంచములోని ప్రతి ఉన్నత వస్తువు పై ఆకాంక్ష,---ఈ అధిక ఆశ అనర్ధా  నికిహేతువనిగ్రహించిమనోనిగ్రహసాధనలనాచారించవలెను.  ఒకటి గుర్తుంచుకోవాలి -మురికి నిండిన అద్దములో మన ప్రతిబింబము మనకు కనబడదు గదా!    

 ఆశ అనే మురికిని మన హృదయమునుండి పూర్ణముగా తుడిచివేయుట మన కర్తవ్యము.అటుపై మోక్ష మార్గము వైపు ఆలోచనలను త్రిప్పి అరిషడ్వర్గాలను తొలగించుకొని ప్రతి తప్పును దేవుని ఎదుట ఒప్పుకొని హృదయపారిశుధ్యమును పొందిన భగవంతుని కరుణకు పాత్రుడగును.ఇంద్రియనిగ్రహము కల్గినవాడు గృహస్దుడైన భాగవత్సాక్షాత్కారమునుపొందగలడు.  

    

No comments:

Post a Comment