Wednesday, 9 November 2022

మనుజులు... తరగతులు నిర్వహించారు

       మనుజులు... తరగతులు

శ్రీయతీంద్రస్వామివారిఉపదేశమునమనుజులనుక్రిందితరగతులుగావిభజింపబడిరి.మనముమనలనువిమర్శించుకొని,నిష్కపటహృదయముతోమనమేతరగతికిచెందినవారమోగ్రహించవలయును.

మొదటి తరగతి:_పరమాత్మలేడనియు, మానవుడు ప్రాపంచిక విషయాలను అనుభవించుట కాసేపు టైటిలా రామునితో వచ్చుచు,పుణ్యపాపవిచారణలేక,విషయయోపభోగాలలోమునిగియుండేవారు.

రెండవతరగతి:-పరమాత్మకలడనిగాని,లేడనిగానివిచారణలేకయే,ప్రాపంచికవిషయోపభోగాలలోమునిగియుండువారు.

మూడవ తరగతి వారు :-పరమాత్మకలడనువిశ్వాసముకలదు .కాని ఆయనను పొందుటకు ఎంతమాత్రము పుట్రా యత్నము చేయక,ప్రాపంచికవిషయోపభోగములకైప్రయత్నించుచుండువారు.

నాల్గవ తరగతి వారు:-

పరమాత్మనుగూర్చికొంచెముప్రయత్నముచేసెదరుకానివారిచిత్తముప్రాపంచికవిషయములవైపునకేచాలాభాగముమొగ్గుచుండును.

 ఐదవ తరగతి వారు:-ప్రాపంచికవిషయములనుగూర్చినప్రయత్నమునందును,పరమాత్మను గూర్చిన ప్రయత్నము నందును సమముగా నుందురు.కానిప్రాపంచికవిషయములకుఅడ్డువచ్చినప్పుడుమాతచరము,పరమాత్మను గూర్చిన ప్రయత్నము మానుదురు.

ఆరవతరగతివారు:-,పరమాత్మనుగూర్చినప్రయత్నమునందును,ప్రాపంచికవిషయములనుగూర్చినప్రయత్నమునందునుకూడాముగనుందురుకానిపరమాత్మునిగూర్చినప్రయత్నమునకడ్డువచ్చినప్పుడుమాత్రము,ప్రాపంచికవిషయయములనుగూర్చినప్రయతనములనుమానుదురు.

ఏడవ తరగతి వారు:-పరమాత్మనుగూర్చియు, ప్రాపంచిక విషయాల గూర్చియుప్రయత్నములుచేయుదురు.కాని,వారిచిత్తములుపరమాత్మవైపుకేమొగ్గియుండును.

ఎనిమిదవ తరగతి వారు:-ప్రాపంచికవిషయాలపైపూర్తిగాకాంక్షలుపోలేదు.కాని,బలవంతంగాచిత్తమునునిగ్రహించుకొని,పరమాత్మనుగూర్చినసాధనలోనేమునిగియుండువారు.కాలమునుగడుపుకొనుచుందురు.

తొమ్మిదవ తరగతి వారు:-ప్రాపంచికవిషయాలపైఏమాత్రముకాంక్షలేక,సర్వకాలసర్వావస్థలయందును,పరమాత్మను గూర్చినసాధనలలోనేమునిగియుండువారు.

పదవతరగతి వారు:-సర్వకాలసర్వావస్థలయందును,సర్వత్రపరమాత్మనేఅనుభవించుమహాత్ములు.

@@@@@#







Sunday, 30 October 2022

శివలింగం

 శివలింగం.  కార్తీక మాసం

దీపావళిపండుగవెళ్ళినమరునాడువచ్చేమాసముకార్తీకము.అన్నిమాసములకన్నవిశిష్టమైనది.మిగులభక్తినిచ్చేది.పవిత్రమైనది.ఈమాసంలోజనులంతాఉదయముననేలేచిశుచియైశివాలయమునకువెళ్ళిలింగదర్శనముచేసుకొనిగానినిత్యకృత్యములారంభింపరు.

శివలింగం యొక్క అర్థమునొకసారిపరికింపుడు.

లింగంఅనుదానిలోరెండుబీజాక్షరములున్నవి.లిం..కంటికి కనుపించక అవ్యక్తమైన దైవము.

గంఅనగావ్యక్తంచేసేచిహ్నము.శివునివ్యక్తంచేసేచిహ్నం.లింగాన్నిచూడగానేభక్తులకుశివుడుస్ఫురణకువచ్చును.

లయనాలింగముచ్యతే...లీనంచేసుకొనేదిఏదోదానినిలింగమంటారు.

లీయతేగమ్యతేఇతిలింగంనష్క్రమణప్రవేశనమిత్యాకాశస్యలింగం.....

లయమై,ఆలస్యమై జననమరణాలు ఏదికారణముగాదానినిలింగమంటారు.లీయతేఇతిలింగః..సర్వందేనిలోలయిస్తుందోఅదేలింగం.

శివశక్త్యోశ్చచిహ్నస్యమేళనంలింగముచ్యతే..శివ, శక్తుల సమ్మేళనమే లింగము .శివ, శక్తుల నువే‌రుచేయలేము.మానవునకుతల,మొండెముఅనియుండినట్లుగాలింగము,పీఠిక ఉండును.

ప్రతీ ప్రాణి లోనుండేపరబ్రహ్మము,జీవశక్తి,సమస్త ప్రాణాధారమైన జీవితం.మరియుఅనంతమైనతేజస్సు,స్వయంప్రకాశమైనదీలింగం.మూలదైవం,ఆదిదైవం,అనాదిదైవం.

లోకంలింగాత్మకంఅనితెల్సుకొనిఅర్చయేత్ శివలింగం.

శివుని అనుగ్రహమును సేవించుట ద్వారా పొందుతాడనిచెప్పునిశ్శంసయము.



Tuesday, 25 October 2022

జన్మ యొక్క గొప్పతనము

                                        జన్మయొక్క గొప్పతనము 

మానవ జన్మ ఉత్తమ జన్మ మఱియు దుర్లభమైనది యని అందరికితెలియునుగదా !

జన్మలు3రకాలు 1.దేవజన్మ 2.మానవజన్మ 3.జంతు జన్మ.

జన్మలెలావచ్చును వాని ప్రత్యేకతలు గూర్చి తెలిసికుందాము.మానవుడు తనజీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు.ఆకర్మలకు ఫలితాలను 

అనుభవిoచాలి .వానినే కర్మఫల్లలంటారు.అనేక జన్మలలో చేసిన కర్మ ఫలాలు  ఆ జీవునితో బాటు వస్తాయి .అందులో పుణ్యకారణంగా  కర్మల  ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు దేవలోకాల్లో దేవజన్మనెత్తుతాడు .అక్కడ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు.అది భోగభూమి.కనుకఅక్కడ అతడికి ఏకర్మలు చేసే అధికారములేదు.అందుచే పరమాత్ముని జేరుటకు తగిన కర్మలు చేసే అవకాశం అక్కడ లేదు.

తన కర్మఫలాన్ననుసరించి భోగాలననుభవించి ,ఆ కర్మ ఫలాలు క్షయం కాగానే క్షీణే పుణ్యే మ ర్త్యలోకం విశంతి. అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని,మానవలోకాన్ని చేరు కోవలసినదే .....

మరలా మరలా మానవజన్మనో ,జంతుజన్మనో ఎత్తవలసినదే ,ఈదే వజన్మలోకేవలం మనోబుద్ధులుంటాయి గాని కర్మజేయుటకు సాధనమైన స్ధూల శరీరముండదు.కాన భగవత్సాక్షాత్కారానికి  ఉపయోగపడే జన్మ కాదుదేవజన్మ. 

ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడుజంతువులు,పశువులు,పక్షులు,క్రిములు,కీటకాలు మొదలగుజంతువులుగానీచయోనులందు జన్మిస్తాడు...

ఆజన్మలలో ఆకర్మఫలాకావున ల కారణంగా అనేకబాధలు,దుఃఖాలు అనుభవిస్తాడు.హింసింపబడతాడు.జంతుజన్మలలో కర్మలు జేస్తున్నట్లు కన్పించిన ఆకర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి ,స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనిచేసేవికావు.కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి. కానఇజన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్నిపొందే అవకాశము లేదు.కావున భగవాత్సాక్షా త్కారము నాకు ఈ జంతుజన్మ కూడా ఉపయోగపడదు .

ఇక పుణ్యపాపకర్మలఫలాలు మిశ్రమముగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవజన్మనెత్తటం జరుగును.ఈ జన్మలలో పుణ్యకర్మ ఫలాలు కారణముగా సుఖాలు,భోగాలు ,ఆనందం అనుభవిస్తాడు .పాపకర్మఫలాలకారణంగా దుఃఖాలు,బాధలు అనుభవిస్తాడు.84లక్షల జీవరాశులలోపుట్టి గిట్టినతర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవ జన్మ ...ఇట్టి అపురూపమైన ,దుర్లభమైన,ఉత్తమోత్తమమైన మానవజంమను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి అని శాస్త్రోవాచ. 

పునర్విత్తం పునర్మిత్రమ్           

పునర్భా ర్య పునర్మహి .

ఏతత్సర్వం పునర్లభ్యమ్ 

నా శరీరం పునః పునః ................పోయినధనం మళ్ళీ చేరుతుంది.దూరమైన మిత్రుడు మళ్ళీ దగ్గరౌతాడు .భార్య గతిస్తే మరొకభార్యలభిస్తుంది .భూసంపద మళ్ళీ లభిస్తుంది.పోయినవన్ని మళ్ళీ తిరిగి రాబట్టుకోవచ్చు.కానమానవశరీరం మాత్రం మళ్లి మళ్ళీ తిరిగిరాదు.శరీరం ఖలు ధర్మసాధనం అని పెద్దలన్నారు .

శరీరముంటేనే ...ధార్మికపనులు చేయవచ్చు,నాలుగుమంచిపనులు చేయవచ్చు,హితవాక్యాలితరులకు చెప్పవచ్చు ,ఏపనైనా చేయవచ్చు,బుధ్ధి,ఆలోచన,మాట్లాడే శక్తి కావలసినది సంపాదించుకొనే జ్ఞానం తగినావయవనిర్మాణం ఉండేది ఒక్క మానవులకే .

జంతువులకు శరీరం ఉంటుంది కానీ వానికి ఆలోచన ఉండదు.పైగా ఏకొద్దోగొప్పో ఆలోచనకల్గిన దాని అమలు చేయుటకు శరీరం సహకరించదు.మనము అతిగా తిన్నా ,ఆలోచించినా,సుఖించినా,దుఃఖించినా,ఏదైనా అతిగా చేసినా శరీరము కాస్తపుటుక్కుమంటుంది.శరీరముపోతే మనము చేసేదేమీలేదు.కాన మనశరీ రమును సంరక్షించుకొనుచు విస్తరాకునుపయోగించుకొని బయట పారేసినట్లు,మనశరీరంలో ఊపిరి పోగానే బయటపరేసివస్తారు.విస్తారాకుకు ఒకరికీ ఉపయోగపడినానని సంతోశించునట్లుగా మనమితరులకుసాయపడుచు సేవచేసికొనుచు సార్ధకతను సంపాదించుట ప్రతి మానవుని కర్తవ్యము.  

Wednesday, 19 October 2022

కర్మ-పునర్జన్మ

                                    రాధాస్వ ఆమీ 

                                 కర్మ -పునర్జన్మ 

మనకి కష్టాలు ఎదురై నప్పుడు మనకి మూడు లాభాలు కల్గును.

1.మొదటిది :-మనము గతజన్మల్లో చేసుకొన్న కర్మ ఋణం తీరిపోతున్నది.

2.రెండవది:-వాటిని ఎదిరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి.సాధనవలన మరింతగా ప్రకాశిస్తాయి.

3.మూడవది:-ఈశక్తులమన వర్తమానంలోనూ గొప్ప సత్కర్మచేసే అవకాశం మనకిస్తాయి.

ఈ పనే పాండవులు చేశారు.మనమెందుకుచేయకూడదు.మహర్షులు ,యోగులు కర్మలనుండి ఎలా తప్పించుకోవాలి అని ఎప్పుడుఆలోచించలేదు.కర్మక్షాళనం కోసం పరితపించారు.వరనుసరించినపద్ధతినేమనమనుసరించవచ్చునుగదా.

మనం గతజన్మ లలో చేసుకొన్న పాపరాశి కొండంత ఉంటుంది.దీనిని చాలా నెమ్మదిగాను,వాటినుండి ఎలా తప్పించుకోవాలా యని ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మ భారం వచ్చేజన్మలకు వాయిదాపడి ఇంకా జన్మలు పెరిగిపోతాయి.మనం మనకర్మభారాన్ని కొద్ది జన్మల్లోవదిలించు కోవాలంటే మనం శ్రీకృష్ణుడు చెప్పినమార్గమున నుసరించవలయును .

యస్య సర్వే సమారంభాః 

కామ సంకల్ప వర్ణితాః 

జ్ఙానాగ్ని    దగ్ధ కర్మాణం 

తమాహుః పండితమ్ బుధాః (భగవద్గీత జ్ఙానయోగం ..19శ్లో )

ర్వరి సమస్త కర్మలు కోరిక సంకల్పము లేకుండా ఉంటాయో ,వారికర్మలు జ్నానమనే అగ్ని చేత దహించబడతాయి.    

యధేయాంసి సమిద్ధో  అగ్ని 

ర్భస్మాత్కురుతే అర్జున 

జ్ఙా నాగ్నిస్సర్వ కర్మాణి 

భస్మాత్కతరుతే తధా .  జ్ఙాన యోగము 37శ్లో .

అర్జునా !బాగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని కట్టెలని ఏ విధంగా బూడిద చేయకలుగుతుందో ,మనం సంపాదించిన జ్ఞానం మన సర్వకర్మలని బూడిద చేయకల్గుతుంది ......దీనిలో పరమార్ధమేమనగా జ్ఞానం మనలో అగ్నిలా జ్వలిస్తే మన కర్మలు మనల్ని బాధించవు.మనం గతంలో ఎవరినో మానసికంగా హింసిస్తే ఇప్పుడు వారు తిరిగి ఆ కర్మ  మనకి ప్రసాదించడానికి వచ్చారు.మనం ఈ కర్మ రహస్యాన్ని ..జ్ఞానాన్ని పొందితే మానపెదవులపైని చిరునవ్వే  ఉంటుంది.కర్మలు వస్తాయి.మనలని చుట్టుముడుతాయి.అవి మనపైనఏ ప్రభావం చూపవు. జ్ఞానంచేత ఆ కర్మ దగ్ధమైనది. 

 

Wednesday, 12 October 2022

భభాభిభుభూ..

    భభాభిభుభూ.....

ధారానగరంలోభుభుక్కుడనేగజదొంగనివసించేవాడు.నగరంలోదొంగతనాలుచేసిచేసివేరేరాజ్యానికివెళ్ళిఒకసంవత్సరంతర్వాతతిరిగివచ్చిమరీదొంగతనాలుచేసేవాడు.కానీవాడుధనవంతులయిళ్ళలోదొంగతనంచేసిదానిలోచాలాభాగంపేదలకుపంచిపెట్టేవాడు.సంస్కృతంలోపండితుడుకూడా.రాజసైనికులెంతయత్నించినఅతడుదొరికేవాడుకాదు.ఒకసారిఒకరింటికికన్నంవేస్తూదొరికాడు.వానినిరాజసభలోప్రవేశపెట్టారు.ఎన్నోసంవతసరాలుగాదొంగతనాలుచేసినభుక్కుండుడికిమంత్రిమరణశిక్షవిధించరాజునుకోరిరి.తనకురాజెక్కడమరణశిక్షవేస్తాడేమోయనిక్రిందిశ్లోకాన్నిచదివాడు.

భట్టిర్నష్టః,భారవిశ్చాపినష్టః

భిక్షుర్నష్టఃభీమసేనోపినష్టః

భుక్కుండోహంభూపతిఃత్వం

రాజన్ 

భబ్భావళ్యామ్అంతకఃసంనివిష్టః

అనగాఓరాజానన్నుశిక్షించండి.కానినాకుఒక్కటేభయం.మీరుగమనించారోలేదోభట్టిచనిపోయాడు.భారవికవిమరణించెను.ఆవెనుకేభిక్షుకవిమరణించాడు.ఇటీవలేభీమకవికూడాకాలధర్మంచెందాడు.మరినేనుభుక్కుండను.ఈయమధర్మరాజుభగుణింతాన్నిపట్టుకొనిభట్టిని,భారవిని,భిక్షుకవినీ,భీమకవినీతీసుకెళ్ళిపోయాడు.తర్వాతవాడినినేనుభుక్కుండుడిని.నన్నుతీసుకొనిపోతేనాతర్వాతభూపతివీవు, నీపేరు లో కూడా సాకారం ఉంచినా తర్వాత నీవంటే నేమో నాని,యింతమంచిరాజుమరణిస్తేప్రజలకుగతేమి?అనినేనుభయపడుతున్నాననిచెప్పాడు.రాజదండనపొందబోతూకూడాఇలాచమత్కారంగాశ్లోకంచెప్పడంతోనవ్విసరేభుక్కుండానిన్నుఈసారికివదుల్తున్నాను.అనివానికికావలసినంతధనమిచ్చియికముందుదొంగతనాలుచేయకమంచిగాబ్రతుకుమనివదిలివేశాడు.(భబ్భావళిఅంటేభగుణింతం.అంతక=యముడు,సంవిష్టఃఅంటేదృష్టిపెట్టినవాడు) 

@@@@@@@@






 

Sunday, 9 October 2022

ఆత్మానందం

        ఆత్మానందం

మనం ఇంటిలోనికి వెళ్ళడానికిముందుభాగంలోప్రవేశద్వారాన్నిఏర్పాటుచేసుకుంటాము.వాటితోపాటుకాంతఇ,గాలి,రావడానికిఏర్పాటుచేసుకుంటాము.ఐతేద్వారాన్నిఏర్పాటుచేశాముకదాయనిదొంగలను,దోపిడీదారులులోపలికిఅనుమతిస్తామా? లేదు కదా!మీ మిత్రులను,బంధువులనుమాత్రమేఅనుమతిస్తాము . అటులనేమనస్సులోకి దుర్గుణాలు అనేదొంగలు, దోపిడీదారులుప్రవేశించకుండా చూసుకోవాలి.

సద్గుణాలు,సదాచారాలు అనేబంధుమిత్రులకుమాత్రమేప్రవేశంకల్పించాలి.

ఇదంతామాయాబజార్.ఇక్కడున్నసరుకంతానకిలీదే!కనుక ఎవరినీ ఎక్కువగానమ్మవద్దు.అలాఅనిఎవరిపైనాఅసూయాద్వేషాలుండకూడదు.అందరిలోయుంటూమంచినేస్వీకరించాలి.చెడునక్కడనేవదలాలి.ఆత్మానందమనేదిమనసొంతసంపద.దానినిమనమేకాపాడుకోవాలి.దుర్గుణాలంటేకామక్రోధలోభమోహమదమాత్సర్యాలనియర్ధము.

Saturday, 8 October 2022

ఒక మంచి మాట

        ఒక మంచి మాట

కలియుగంలోభగవంతుణ్ణిసంతృప్తిపరచేఏకైక ఉపాయం...సేవలు.

పూజలు,పుష్కరాలుమీరుదైవోన్ముఖులగునిమిత్తమే.సేవలు,దానములు చేసినపుడు సాక్షాత్ పరమాత్ముని కేచేసినట్లుభావించిచేయండి.విసుగుతోను,బలవంతంచేతనూ,ఫలితమఆశించిచేసేసేవలు,దానాలుఎట్టిఫలితాన్నిఇయ్యలేవు.పేరుకోసమోలేదాఇతరలాభంకోసమోసేవలుచేయడంమానాలి.

నీకు భగవంతుడిచ్చిన దానిలో కొంత నీపక్కవానికివ్వడంనీధర్మం.అర్హులైనవారికేదానములు,సేవలుచేయండి.ప్రేమతో,కర్తవ్యనిర్వహణగాభావించిచేయండి.నిర్లుక్ష్యంను,విసుగునుదరిచేరనీయకండి.

దైవముఅన్నివేళలామిమ్మల్నిగమనిస్తుంటాడు.అన్నివేళలాపరీక్షిస్తుంటాడు.కాన ఎవరైనా స్వయంగా వచ్చి సహాయం అడిగితే కాదులేదనకండి.

నీవుచేయలేనిపనికోసంఆయననీదగ్గరకుఎవరినీపంపడు.నీవుచేయగలశక్తియున్ననుచేయుటకువెనుకాడినచోఆయనమరింతవెనుకకువెళ్ళేప్రమాదంఉంది.కానతిరస్కరించేముందుఒకటికిపదిసార్లుఆలోచించుకోవాలి.పరోపకారాదిసేవలువిషయంలోబహుజాగ్రత్తగనుండండి.





Tuesday, 4 October 2022

నీకు నీవే దీపం

   నీకు నీవే దీపం

ఇద్దరు ప్రయాణికులు ఒకదారిలోకలిశారు.ఒకతనివద్దలాంతరు(దీపం)ఉంది.ఇంకొకనివద్దలేదు.

కానీ ఇద్దరు కలిసిపక్క పక్కనేనడవడంచేతకాంతిఇద్దరిమార్గాల్లోపరచుకోవడంచేతమార్గంసుగమంగాఉంది.

దీపంఉన్నవాడుఎంతసులభంగాఅడుగులువేస్తున్నాడోదీపంలేనివాడుగూడాఅంతేఅనాయాసంగాసాగుతున్నాడు.

కారణందీపమున్నవానితోదీపంలేనివాడునడవడమే.అతనికిదీపమవసరంలేకపోయినది.అలానడవగానాల్గురోడ్లకూడలివచ్చింది.అక్కడనుండివారువేర్వేరుదారులలోవెళ్ళవలసియున్నది.దీపమున్నవాడుచక్కగాతనదారినివెళ్ళిపోయినాడు.దీపములేనివాడుముందుకువెళ్ళలేకచీకటికారణంచేదీపమున్నవానినితలచుకొనుచుతనకుదీపములేదనివ్యథచెందుచుండెను.మనకుఇతరులుకొంతవ‌రకేమార్గంచూపిస్తారు.తరువాతమనదారిమనమేవెతుక్కోవాలి.చివరివరకెవరూచూపరు.గురువుచేసేపనైనాఅదే.గురువువద్దనున్నకాంతికొంతవరకేచూపును.శిష్యుడుతనలోనిదీపాన్నివెల్గించుకున్నప్పుడుప్రయాణంచివరిదాకాచేయగలడు.నీకునువ్వేదీపంఅనిబుద్ధుడుచెప్పుఠవెనుక అర్థమిదే.ముందుకుసాగిపోఎన్నిఅడ్డంకులువచ్చినాముందుకుసాగిపోఅనేదానిలోనిదియేయర్థము.



Monday, 3 October 2022

దసరా పాట

                 దసరా పాట


మనకు కనుమరుగౌతున్నదసరాపాటనొకసారిఅవలోకించుదుము.‌‌‍

పల్లవి

ఏదయామీదయమామీదలేదు.

ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగదు

దసరాకివస్తిమనివిసవిసలబడక

చేతిలో లేదనకు ఇవ్వలేమనక

ఇప్పుడు వేదనకు అప్పివ్వరనక

రేపురామాపురామళ్ళీరమ్మనక

శీఘ్రముగనివ్వరేశ్రీమంతులారా

జయీభవ విజయీభవ

దిగ్విజయీభవ

పావలాబేడైతేపట్టేదిలేదు 

అర్ధరూపాయైతేఆంటేదిలేదు

రూపాయిఐతేనుచెల్లుబడికాదు

హెచ్చురూపాయైతేపుచ్చుకుంటాము

జయీభవ విజయీభవ

దిగ్విజయీభవ

అయ్యవారికి చాలు ఐదు వరహాలు

పిల్లవాళ్ళకుచాలుపప్పుబెల్లాలు

మాపప్పుబెల్లాలుమకుదయచేసి

శీఘ్రముగబంపరేశ్రీమంతులారా 

జయీభవ విజయీభవ

దిగ్విజయీభవ.




Sunday, 2 October 2022

సద్బోధన

        సద్బోధన

మనం ప్రపంచానికి ఎంత ఇస్తామోతిరిగిఅంతేపపొందగలం.సమస్తాన్నిసమర్పించగల్గితేతిరిగిసమస్తాన్నిపొందగలం.చీకటివెల్గులు,జీవన్మరణాలు_ఇవిజీవితంయొక్కదశలు.కొందరుప్రకాశంతోవెలిగిపోతూతమచుట్టూకూడాప్రసరింపజేస్తారు.మరికొందరిలోవెతికినాప్రకాశపుజాడకనిపించదు.

అట్టివారిలోనిచీకటినిపారద్రోలుతూ,కొడిగొట్టుతున్నప్రకాశపుకాంతినిపెంచుకొనేవిధానాన్నివారికితెలియజెప్పడమేమనకర్తవ్యం.

మనంఇతరులనుండివేరుకాదనేపరమసత్యాన్నివిస్మరించేవిధంగాతోటివారిపట్లనిర్దయగానట్లువ్యవహరించగలము. 

అందరిఇళ్లలోఉంటాడుభగవంతుడు.అందరిహృదయాలలోనుంటాడుభగవంతుడు.

&&&&&&



Monday, 26 September 2022

కృష్ణశతకంలోనోకపద్యం

కృష్ణశతకం ..ఒకపద్యం
నీవేతల్లివిదండ్రివి
నీవేనాతోడునీడనీవేసఘుడౌ
నీవేగురుడవుదైవము
నీవేనాపతియుగతియునిజముగకృష్ణా
    ఆందులోనీవే(భగవంతుడే)అన్నీఅనిచెప్పడమేగాదు ,అన్ని మానవసంబంధాలుగాకూడానిన్నేఅనిభావించవచ్చుఅన్నభావనకూడాఉంది.అంతేకాదు ,ఎవరికినచ్చినసంబంధంతోవాళ్ళుపిలుస్తూఆబంధందృఢపరచుకోవడంమంచిదని ,అప్పుడే చివరికి పరమగతిచేరగలమనికవిహృదయం.పద్యంచిన్నదైనాదానిలోనంతరార్థమునిరుపమానము.
మానవుడు పుట్టినదిమొదలుఎన్నోబంధుత్వాలుచకచకాఅల్లుకుంటాయి.అదిసహజమే.అందులోకనిపించనివిజాతిమతంకులంమొదలైనవి.ఇవొకబంథాలే!కనిపించే బంధుత్వాలుతల్లిదండ్రులు ,అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు ,భార్యాపిల్లలు ,అత్తమామలు మొ!!ఎన్నోవావివరుసలు.ఇవికాకపరిచయస్థులు ,మిత్రలు ,గురుశిష్యులు ,యజమానులు, సేవకులు మొ!!బంధాలున్నవి.మానవుడు చుట్టరికాలతోరమిస్తూఎంతోకొంతోప్రయోజనమునుపొందుతూఇదేశాశ్వతమనిభ్రమపడకూడదు.మానవునిజీవితకాలంలోతనసన్నహితులమరణములనుచూచుటసంభవించును.తద్వారా శోకమునుపొందవచ్చును.దానిని తప్పించుటకైతనబందధాలనన్నిటినిభగవత్పరముచేయుటయే.అలాచేసినవానికిఆప్తవియోగదుఃఖాలతాకిడియుండదు.భగవంతుడుప్రేమస్వరూపుడు ,కరుణామయుడనిపైపద్యంవల్లతెలుస్తోంది.


మంచిమాట

 మంచిమాట

దేవుని కొఱకుఎక్కడెక్కడోతిరిగి ,ఏవేవోచేసేబదులుఇంట్లోనొకమూలనకూర్చొనిచిత్తముతోదేవునిఏదోయొకరూపమునుథ్యానంచేసిచూస్తేచక్కగకనబడును.ప్రార్థనలోఏవేవోకోర్కెలుకోరేబదులుమౌనంగాఉంటేమనతోసంభాషించును.పుణ్యంవస్తుందనిగుళ్ళు ,గోపురాలుకట్టించడం ,వాటిచుట్టూతిర్గేబదులుఅవసరములోనున్నవారికిచేతనైనంతసాయంచేస్తేపుణ్యంలెక్కించనంతవచ్చును.మీజీవనంబాగుంటుందనిపూజలు ,హుండీలలోవేలాదిరూప్యంబులువేసేకన్న ఆకలితో నున్న వానికిపట్టెడన్నముపెట్టినభగవంతుడుమనకుతరతరాలకుసరిపడేపంచభక్ష్యపరమాన్నములనుయిస్తాడు.

అశాశ్వతప్రాపంచికవాంఛలనువిడిచిదైవమేకావాలనికోరుకొనిచూడండి.మీహృదయంలోనిత్యమూకొలువైఉంటూమిమ్మల్నిఆనందసాగరంలోమునకలువేయిస్తాడు.

Saturday, 24 September 2022

దానవుడు.. మానవుడు...దేవుడు

 దానవుడు

       మానవుడు

            దేవుడు

మానవునకుభోగంకల్గించేదిపాపం.పాపంచేయకూడదనితెల్సినాపుణ్యంచేయుటకుమనసొప్పదు.మానవుని భవిష్యత్తు నిర్ణయించేదికర్మ.నీస్వకీయకర్మనుఅంకితభావముతోచేసుకొమ్మంటాడుపరమాత్మ.అలాచేసుకొంటేనీకుమోక్షముకూడాయిస్తానన్నాడు(గీత28-46).మానవునకులాభంకల్గించేదిసేవ.సమస్తజీవులకుచేసినసేవమాధవసేవౌతుందనిపదేపదేపరమాత్మచెప్పాడుకానిఅంతానాకేకావాలంటాడుమనిషి.మనిషికి సంపాదననిల్పేదిపొదుపు.బిందువు+బిందువుకలిస్తేనేసింథువౌతుంది.ఇటుక+ఇటుకపేరిస్తేఇల్లౌతుందనితెలిసినాఒకేసారికొండంతైపోవాలంటాడుమనిషి.ఇల్లు ఒకే రోజు పూర్తవ్వాలంటాడు.విత్తనంపెట్టినీరు+ఎరువువేసికొన్నిసంవత్సరాలుపెంచితే ,దానిని బ్రతికినన్నాళ్ళుకాపాడితఫలాలుయిస్తుందనితెల్సినాఓర్పుండదు.మానవునివిలువపెంచేదిదానం.మనకున్నదానిలోకొంతభాగములేనివారికిదానంయచెయ్యాలి.నీవొకచేత్తోదానంచేస్తేనీకుదేవుడుపదిచేతులతంసాయంచేస్తాడు.దయగలహృదయమేభగవన్నిలయం.మానవునకునష్టముకల్గించేదిహింస ,

కామం.అశాంతి నికల్గిస్తుంది.ఆశ.శాంతిని కల్గించే దిసంతృప్తి.దుఃఖంకల్గించేదికామం.పతనంచేసేదిఅహంకారం.అందరనిదగ్గఱకుచేర్చేదిప్రేమ ,దూరంచేసేదిఅసూయ.స్థితిని సూచించేదిగుణము.చెడుగుణాల్నివీడిమంచిగుణాల్నివృద్ధిపరచుకొన్నమనలోదైవత్వంచోటుచేసుకొంటుంది.దైవంగామార్చేదిదయ.ఆత్మస్థితినితెల్పేదివాక్కు.విజయంచేకూర్చేదిధర్మం.గొప్పవానిగాచేసేదితత్వజ్ఞానం.ముక్తినిచ్చేదిసత్యం.మానవునిఅన్నిరకాలుగాసంస్కరించేదిధ్యానం.అందచేమానవుడుపరమాత్మనుస్మరిస్తూధ్యానంచేసుకొనుటచేభగవద్ధామమునకుచేరగలడు.జననమరణచక్రమునుండివేరుపడును.


సమస్య....పరిష్కారం

 సమస్య..పరిష్కారం

మనిషి దేనినైతేఎక్కువగాతలుస్తాడోదానిరూపాన్నిపొందును.మనకుసదాఏదోయొకసమస్యవస్తూనేఉంటుంది.ఐతేసమస్యనువదలిపరిష్కారంమీదదృష్టిపట్టడంమానేసిసమస్యపైనేఎక్కవదృష్టికేంద్రీకరిస్తూఉంటాము.కనుకేసమస్రతీరకపోగామరింతజటిలంఔతుంటుంది.తీవ్రమనోవ్యథకుకారణమగును.ఫలితంగా మానసికంగా కృంగిపోయిఅనేకరకాల అనారోగ్యాలనుతెచ్చుకుంటున్నాము.

బుద్ధిమంతుడైనవాడుసమస్యనువదిలిపరిష్కారంకోసంప్రయత్నంచేయాలి.అసలుసమస్యకులొంగకపోతేసగంపరిష్కారందొరికినట్లే.మిగతామనప్రయత్నంద్వారాసాధించుకోవచ్చు.కావున ఇలలోసమస్యలకు ,అవరోధములకు ,అడ్డంకులకులొంగవద్దు.

సద్గురువేఅన్నిటికీసరైనపరిష్కారం.కావునప్రయత్నంచేయండి.సద్గురువును(పరమాత్మ)నమ్మండి.ఏసమస్యామనలనుఏమిచేయలేదుమనల్ని.

@@@@@@@

Sunday, 18 September 2022

విత్తనము మానవజన్మ

 raadhaasvaamiiరాధాస్వ ఆమీ

  మానవ జన్మవిత్తనం వంటిది.విత్తనానికి పూర్వం చెట్టు ఉంది.విత్తనం తరువాత కూడా

చెట్టూండచ్చు.అయితె విత్తనం తరువాత చెట్టు ఉండాలాలేదా అనెది విత్తనము సామర్ధ్యం

మీద ఆధారపడియుంటుంది. విత్తనములొమొలకెత్తెగుణం ఉన్నట్లైనాఅది మొక్కగా

మారి పెద్దచెట్టు అగును.మళ్ళీవిత్తనాలుపుట్టాయి.

 మళ్ళీచెట్లు...ఇలాతిరుగుతూ ఉంటాయి.

అలాగునేమనజన్మలుకూడా అంతే.పూర్వజన్మలో ఉన్నాము.ఈజన్మలోనున్నాము.రాబోయేజన్మలోగూడానుండవచ్చును.అనేకజన్మలెత్తిచివఱకుమనుజన్మనెత్తాము.ఐతేముందుజన్మమనకుందాలేదాఅనేదిమనంచేసేసాధనబట్టియుంటుంది.

విత్తనంలోమొలకెత్తేగుణమున్నంతవఱకుఅదిమొలకెత్తుతూఉంటుంది.ఆగుణంలేనట్లైతేమనమెంతప్రాకులాడినామొలకెత్తదు.అటులనేమనలోనుండేఅజ్ఞానాహంకారమమకారాలున్నంతవఱకుజననమరణచక్రములోతిరుగుతుంటాము.వానినినశింపజేసికొన్నచోజననమరణచక్రమునుండితప్పించుకొనిభగవంతునిజేరగలము.అందులకుగట్టిసాధనజేయవలయును..అదిచాలాకష్టము.నిరంతరసతగురునామస్మరణచేయుటవలనయేదోయొకసమయంలోఆగుణాలునశించిముక్తికిమార్గములభించును.ఎట్టి సమయాలలోను,ఎన్నిఆటంకాలెదురైనామథ్యలోనామస్మరణ ఆపకూడదు.


Tuesday, 30 August 2022

లోభము

         లోభము

మానవునిలోగలకామక్రోథాదులలోలోభమనేగుణముభగవంతునివద్దకుచేరకుండాచేయును.అతనినినాశనముచేయును .అందులకొకకథనువిందుము.లోభి అనుకొన్నదానికిఎప్పుడువ్యతిరేకముగజరుగుతుంది.

బాగాాాథనవంతుడగునొకపిసినారికివయసొచ్చిన ఇద్దరందగత్తెలగుకుమ ర్తెలుగలరు.వారికి వివాహం చేసిననెక్కునకట్నంములిచ్చుకోవాలనీ ,అతిచౌకగాఅల్లుళ్ళుదొరుకుటకష్టమనియూరకుండెను.తెలివైనయువకుడొకడుఅతనినికలసితక్కువగాఇద్దరినిచేసుకుంటాననిఅతనినినమ్మించిచేరెను.ఒకానొకరోజునాతడుపిల్లలతోఆభరణాదులు ,లోభివద్దనున్నధనమునుసంగ్రహించిపారిపోయికొద్దిరోజులకుఆపిల్లనువదలిపారిపోయెను.ఆపిల్లలద్దఱుతిర్గితండ్రివద్దకుచేరిననాతడుస్పృహతప్పెను.అతడుతగినవారికితనపిల్లనిచ్చివివాహముచేసిననింతదుఃఖముండదు.ధనముపోదుకదా!ఎంత అగౌరవము.

లోభఃపాపస్యకారణం

లోభముపాపమునకుమూలకారణం

లుబ్ధానాంయాచకశ్శత్రుఃచోరాణాంచంద్రమారిపుః

లోభులకుయాచకులేశతృవులు

దొంగలకుచంద్రుడేశతృవు.