శ్రీమదుమాచోడేశ్వర
శతకము
శ్రీ
రావూరి వేంకటేశ్వర్లు
1.
శా
||శ్రీవర్ధిష్ణుగుణాభిరామ!జగతీక్షేమంకరా!పార్వతీ భావాంభోజమరందధార!వినతప్రారంభనిర్వాహకా!
సేవానమ్రజనాంతరంగనిలయాసీనా!చిదాకార!శ్రీ
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!చోడేశ్వరా!
తా!!జ్ఞానసంపదలనిచ్చుస్వభావముగలగుణములచేప్రకాశించువాడా! లోకక్షేమమును
కల్గించువాడా! పార్వతీదేవిహృదయపద్మమున మకరంద
ధారయైనవాడా! సేవచే వినీతులైన వారి
హృదయాలలోనుండువాడా!
దేవీ పట్టణ పర్వత నివాసియైన ఓ
చోడేశ్వరా!
2.శా|| ఏవాడేనిభవన్మహత్త్వమగుబ్రాహ్మీసంస్ధితిన్
వర్ణన
శ్రీవాల్లభ్యము నిర్వహింపగలడే?శ్రీకంఠ!బ్రహ్మాదులున్
నీవస్తుత్వముగాంచలేరటగదా!నిత్యత్వ
సంభాషితా
దేవీపట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన
!చోడేశ్వరా!
తా||శాశ్వతధర్మముతో బ్రకాశించు శ్రీకంఠుడవైన దేవీపట్టణపర్వతేంద్రశిఖర
నివాసియగు చోడేశ్వరా!నీ వస్తుత్వమును
బ్రహ్మాదులు కూడ నెరుంగ
లేరని వేదాలు చెప్పుచున్నవిగదా! నీ
బ్రహ్మత్వమైన బ్రాహ్మీ స్ధితిని
ఎవ్వరును వర్ణింపలేరుగా.
3.శా||భావాతీత
పరంపరాయితజను:ప్రారబ్ధకర్మాత్మక
శ్రీ విద్యావినయప్రమేయలహరీ
రింగద్గుణప్రేక్షితా!
దేవా!దీనజనావనప్రియకృతీ!దీవ్యత్తనూవైభవా!
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన
!చోడేశ్వరా!
తా||భావాతీత చోడేశ్వరా!జననమరణ సంసార
చక్రములో తిరుగుచున్న
ప్రాణులసకలవిషయములనుచూచిఆర్తులనురక్షించుమూర్తి
వైభవమున్నవాడవు.
4.శా||ఏ వాక్యమ్ములు సర్వకాలమును నిన్నే
పల్కు విశ్వమ్మునం
దావేశించి పదార్ధచింతనము
నత్యంతమ్ముజృంభింపగా
భావంబున్ వెలయింప జేయునవి
మాప్రత్యక్షవేదమ్ములో
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన !చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!వేదములెల్ల ప్రపంచమునందలి
వస్తువులన్నియు
నీవే యని చెప్పుచున్నవి.
5.శా||ప్రావీణ్యంబిసుమంతలేదుకద!శాస్తంబందు
వేదాన్తవి
ద్యా వైదుష్యము లేద,యర్ధమును
సందర్భoపగాలేను,భ
క్త్యావేశమ్మున
మాత్రమెన్నెదనునీదౌదివ్యమూర్తిన్దమిన్
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!నాకు శాస్త్ర
పాండిత్యము,వేదాంతవిజ్ఞాననైపుణ్యములు
లేవు.పురుషార్థాలను సమన్వయము చేయలేను.కేవలము
భక్త్యావేశముతో మాత్రమేనీదివ్య
స్వరూపమును గీర్తించెదను.
6.శా||నీవార్వంబగునాలపోతు
గరుణానిర్ణిద్రవృత్తిన్ జగత్
సేవన్ జేయును
వట్టిగడ్డిదినియెంతేధాన్యముల్ బండగా
నీ వాల్లభ్యము సర్వభూతదయకున్నిక్కంబు
గాణాచిరా
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!నీవాహనమైన ఎద్దు వట్టిగడ్డినితినిరైతులకుసహకరించుచు అనేకపంటలకుసాధనమైలోకసేవనుజేయును.నీప్రభుత్వమునిజముగా
సర్వభూతదయకు నిలయమైనది.
7.శా||జీవాత్మైక్యము
నీవుగా దలచి తఛ్ఛ్రీలబ్ధిమన్మూర్తులై
జీవుల్ ఖండితభావబంధులగుచున్
జిన్మూర్తులై యాత్మలో
గైవల్యంమ్మునుగాంచి మించెదరు సౌఖ్య స్ఫూర్తి
మత్సర్వులై
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!లోకములో జీవాత్మపరమాత్మల
యేకత్వమునీవే యని భావించి జ్ఞానస్వరూపులై సమస్తమందు
నానంద స్ఫూర్తి గలవారై బ్రహ్మత్వమును పొంది అతిశయించెదరు.
8.శా||ప్రోవుల్ ప్రోవులు జీవరాశులుగన్ భూభారముల్
దేవనీ
సేవాదూరములైన
వేటికి?పునశ్చింతాభరమ్ముల్,భవ
సేవాతన్మయజీవియొక్కడు
గదా!శ్రీనించు నీధారణన్
దేవీ పట్టణ పర్వతేంద్ర
శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!
నీ సేవకు దూరములై చింతలతోనున్న ప్రాణుల సముదాయము అప్రయోజనము. భూమాతకు
బరువుమాత్రమే. నీ సేవలోనున్న సేవకులు నిన్నెల్లప్పుడు సేవించుచు ఇహపర సుఖములను
బొందును.
9.శా||నీ వాత్సల్యము
జూరగొన్నమనుజుల్ నిత్యంబుగార్హస్థ్యధ
ర్మావిర్భూతసమస్తభూతనిచయప్రాంచత్కృపాసింధులై
ప్రొవన్జూతురుదీనకోటినిగృపాపూర్ణావతారా!ప్రభూ
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన!చోడేశ్వరా!
తా||ఓ చోడేశ్వరా!నీ కృపను పొందిన
సేవకులు సమస్తప్రాణుల యెడ దయాసముద్రులై గృహస్థధర్మముతో నుండి దీనులను రక్షించుటకు
నెదురుచూచుచుందురు. నీవు కృపాపూర్ణావతారుడవు.
***
No comments:
Post a Comment